‘మూడేళ్ల సగటు’తో రాయితీ సిలిండర్లు
అర్హులైన లబ్ధిదారులు గడిచిన మూడు సంవత్సరాల్లో వాడిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకుని.. ఆ మేరకు రాయితీ సిలిండర్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రూ.500కు గ్యాస్ పథకానికి మార్గదర్శకాల్లో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: అర్హులైన లబ్ధిదారులు గడిచిన మూడు సంవత్సరాల్లో వాడిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకుని.. ఆ మేరకు రాయితీ సిలిండర్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకం మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. ఈ పథకానికి అర్హతగా మూడు ప్రమాణాల్ని నిర్దేశించింది. తెలంగాణలో తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి, వారి పేరుతో వినియోగంలో ఉన్న గ్యాస్ కనెక్షన్ ఉండి, డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసిన వారు అర్హులని స్పష్టం చేసింది.
సబ్సిడీ చెల్లింపు ఇలా..
వినియోగదారులు తొలుత సిలిండర్కు పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. వారికి ఇచ్చే సబ్సిడీకి తగినంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు చెల్లిస్తుంది. ఆ రాయితీ మొత్తాన్ని ఆయిల్ కంపెనీలు లబ్ధిదారు బ్యాంకు ఖాతాకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందిస్తారు. ఈ పద్ధతి ప్రస్తుతం పైలట్ విధానంలో అమలవుతుంది. లబ్ధిదారు సిలిండర్కు రూ.500 మాత్రమే చెల్లించి అందుకునే విధానాన్ని పౌరసరఫరాలు, ఆర్థికశాఖలు సమీప భవిష్యత్తులో తీసుకువస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రూ.500కు గ్యాస్ సిలిండర్లు అందేలా జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలివ్వాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ పథకం అమలు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కలెక్టర్లు పర్యవేక్షించాలని తెలిపింది. ఈ పథకానికి దరఖాస్తు చేయడం, సమాచారం అప్డేషన్, ధ్రువీకరణకు వచ్చే వారికి కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
39.50 లక్షల మంది లబ్ధిదారులు
హైదరాబాద్లో అత్యధికం..
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రాయితీపై గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతానికి 39,50,884గా తేలింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 3,55,153 మంది లబ్ధిదారులు ఉండగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 44,005 మందికే గ్యాస్ సబ్సిడీ లభించనుంది. 2,22,938 మంది లబ్ధిదారులతో నల్గొండ రెండో స్థానంలో ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే 4,63,078 మందికి, ఆ తర్వాత ఉమ్మడి మెదక్లో 4,11,091 మందికి, ఉమ్మడి ఖమ్మంలో 3,54,172 మందికి ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది.
1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నా..
రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, 89.99 లక్షల మందికి రేషన్కార్డులు ఉన్నా... గ్యాస్ రాయితీకి 39.50 లక్షల మంది మాత్రమే అర్హులుగా తేలారు. వడపోత ప్రక్రియ కొనసాగుతుండటంతో ఈ సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉండవచ్చని తెలుస్తోంది. రేషన్కార్డులు ఉన్నవాళ్లంతా ప్రజాపాలనలో దరఖాస్తు చేయలేదు. దీంతో అక్కడే ఈ సంఖ్య కొంత తగ్గింది. దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఆధార్, రేషన్కార్డు, గ్యాస్ కనెక్షన్ వివరాలను అధికారులు సరిపోలుస్తున్నారు. సరిపోలని వాటిని ప్రస్తుతానికి పక్కనపెడుతున్నారు. కొందరి ఇళ్లలో రెండేసి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇలా వివిధ కారణాలతో గ్యాస్ రాయితీ లబ్ధిదారుల సంఖ్య తగ్గినట్లు చెబుతున్నారు. దరఖాస్తుదారు పేరుతో రేషన్కార్డు, ఆయన జీవిత భాగస్వామి లేదంటే కుటుంబ సభ్యుల్లో ఒకరి పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా పరిగణనలోకి తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఒకే రేషన్కార్డులో పేరున్న కుటుంబ సభ్యుల పేరిట విడివిడిగా గ్యాస్ కనెక్షన్లు ఉంటే.. కుటుంబ యజమాని పేరునే సబ్సిడీకి పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్