ఈ ‘టానిక్’కు ఇన్ని మినహాయింపులెందుకు..!
విదేశీ మద్యం విక్రయాల్లో పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్లోని ‘టానిక్’ ఎలైట్ మద్యం దుకాణానికి అనుమతుల్లోనే మతలబులున్నట్లు వెలుగులోకి వచ్చింది.
అన్నింటికీ రెండేళ్లు.. దీనికి మాత్రం అయిదేళ్ల లైసెన్స్
తెరవెనక బడాబాబుల హస్తంతో అధికారుల గప్చుప్
ఆబ్కారీశాఖ వర్గాల ఆరా
ఈనాడు, హైదరాబాద్- పేట్బషీరాబాద్, న్యూస్టుడే: విదేశీ మద్యం విక్రయాల్లో పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్లోని ‘టానిక్’ ఎలైట్ మద్యం దుకాణానికి అనుమతుల్లోనే మతలబులున్నట్లు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా అన్నింటికీ రెండేళ్ల కాలపరిమితి ఉంటే.. టానిక్కు అయిదేళ్ల గడువుతో లైసెన్స్ జారీ చేయడమే కాకుండా విక్రయాల్లో పలు రాయితీలివ్వడం విస్తుగొలుపుతోంది. అయిదేళ్ల తర్వాత కూడా ఏటా గడువును పొడిగించడం వెనక గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల ప్రమేయమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 18 డిపోల్లో ఎక్కడి నుంచైనా మద్యం దిగుమతి చేసుకునే వెసులుబాటు ఎందుకు కల్పించారు, సాఫ్ట్డ్రింకులు, సిగరెట్లు, గ్లాసుల్లాంటివి విక్రయించుకోవడానికి ఎలా అనుమతిచ్చారనే.. సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కేవలం రూ.15 లక్షల అదనపు రుసుం
2016 అక్టోబరు 26న ఎలైట్ షాప్ రూల్స్-2016 పేరున అప్పటి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్మిశ్రా జీవో జారీ చేశారు. దీని ప్రకారం దుకాణంలో ఫారిన్, ఇండియన్ మేడ్ ప్రీమియం లిక్కర్, వైన్లు అమ్ముకోవచ్చు.
- జూబ్లిహిల్స్, ప్రశాసన్నగర్ చిరునామాతో అమిత్రాజ్ లక్ష్మారెడ్డి పేరున ఈ దుకాణం లైసెన్స్ ఉంది. అదే ప్రాంతంలో ఇతర దుకాణాల లైసెన్స్ ఫీజు రూ.1.1 కోట్లు ఉండగా.. టానిక్కు మాత్రం రూ.1.25 కోట్లుగా నిర్ణయించారు. రూ.15 లక్షలు అదనంగా చెల్లించినందుకు ఇన్ని మినహాయింపులు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది.
- వ్యాట్ చట్టంలోని షెడ్యూల్-6, ఎక్స్ప్లనేషన్-1 ప్రకారం ఆబ్కారీశాఖకు చెందిన మద్యంపై రాష్ట్ర బేవరేజస్ కంపెనీ లిమిటెడ్(టీఎస్బీసీఎల్)కు మాత్రమే వ్యాట్ చెల్లించాల్సి ఉంది. టానిక్ ఎలైట్ విదేశాల నుంచి మద్యం దిగుమతి చేసుకున్నా.. తప్పనిసరిగా టీఎస్బీసీఎల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి లేబులింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే నిర్దేశిత 70% వ్యాట్ ప్రభుత్వానికి వస్తుంది. కానీ అలా జరగలేదనే ఆరోపణలున్నాయి.
- అన్ని మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల వరకు బంద్ చేయాలి. టానిక్కు 12 వరకు అనుమతిచ్చారు. ఇదే అదనుగా దీని అనుబంధ దుకాణాలు కూడా రాత్రి ఒంటిగంట వరకు విక్రయాలు సాగించేవన్న ఆరోపణలున్నాయి.
రెండో రోజూ తనిఖీలు
నగర శివారు ప్రాంతం సుచిత్రా సమీపంలోని టానిక్ అనుబంధ దుకాణంలో గురువారం రెండో రోజు కూడా ఆబ్కారీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఏడాది నూతన ఎక్సైజ్ పాలసీ మొదలైనప్పటి నుంచి ఏ మద్యం ఎంత మేరకు కొన్నారు.. ఎంత మేరకు విక్రయించారనే దానిపై ఆరా తీశారు. పలు రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ కూడా అధికారులతో సమీక్షించారు. 2016 నుంచి ఒక్క టానిక్లోనే రూ.వెయ్యి కోట్లకుపైగా వ్యాపార లావాదేవీలు జరిగినట్లు భావిస్తున్నారు. తదుపరి కార్యాచరణపై న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్లాలని ఆబ్కారీశాఖ నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ వ్యవస్థనూ ‘వదల్లేదు!’
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రతి రాజ్యాంగబద్ధ వ్యవస్థపైనా జగన్ దాడికి దిగారు. తన అనుయాయుల్ని, అనుచరగణాన్ని ఉసిగొల్పారు. న్యాయవ్యవస్థపైనా దాడి చేయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై దాడికి దిగారు. కార్యనిర్వాహక వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, అధికారుల్ని భయభ్రాంతుల్ని చేసి చెప్పినట్టల్లా ఆడించారు. -
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అపోలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునీత నర్రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ఫెలోషిప్నకు ఎన్నికయ్యారు. -
ఓటేసేందుకు వైఎస్ భాస్కరరెడ్డికి అనుమతి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏడో నిందితుడైన వై.ఎస్.భాస్కరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. 13న వెళ్లి అదే రోజు తిరిగి హైదరాబాద్ రావాలని స్పష్టం చేసింది. -
ఇదీ సంగతి!
-
గాలివాన బీభత్సం
రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. ఆదివారం మధ్యాహ్నం తరువాత గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురిశాయి. -
విద్యుత్ వినియోగంలో 6వ స్థానంలో తెలంగాణ
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో 9,009 మిలియన్ యూనిట్ల వినియోగంతో తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచింది. -
కాళేశ్వరం పంప్హౌస్ల మునకపై ఆరా
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు పంప్హౌస్లకు సంబంధించిన వివరాలు అందజేయాలని నీటి పారుదల శాఖ ఇంజినీర్లకు విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సూచించారు. -
ఐఐటీల్లోనూ పాలిటెక్నిక్ విద్యార్థులకు సీట్లు?
పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులు నేరుగా ఐఐటీల్లో బీటెక్ రెండో ఏడాదిలో చేరొచ్చా?.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఐఐటీ హైదరాబాద్ సైతం అందుకు కృషి చేస్తున్నాయి. -
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డిలతోపాటు పలు జిల్లాల పరిధిలో ఆదివారం గాలి వాన, పిడుగులు పడిన ఘటనల్లో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరా తీశారు. -
15న సీపీగెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) నోటిఫికేషన్ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. -
ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’ విడుదల
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం ప్రాథమిక ‘కీ’ని ఆదివారం విడుదల చేశారు. రెస్సాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచామని, అభ్యంతరాలుంటే ఈ నెల 14న ఉదయం 10 గంటలలోపు వెబ్సైట్ నుంచే పంపించాలని కన్వీనర్ డీన్కుమార్, కో-కన్వీనర్ విజయకుమార్రెడ్డి తెలిపారు. -
యాదాద్రిపై భక్తజన సందోహం!
దైవదర్శనాలు.. స్వామివారి కల్యాణం.. దీపారాధనలు.. మొక్కులు, వాహన పూజలు.. పుణ్య స్నానాలతో పంచనారసింహులు కొలువైన మహా పుణ్యక్షేత్రం యాదాద్రి ఆదివారం భక్తజన సందోహంగా మారింది. -
వీనులవిందుగా ‘రవీంద్రుని’ గీతాలాపన
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం 11 రాష్ట్రాల్లో ఒకేరోజు, ఒకే సమయంలో.. ఒకేసారి ఒక్కోచోట 100 మంది గాయకుల చొప్పున రవీంద్రనాథ్ ఠాగూర్ విరచిత 20 గీతాలను మధురంగా ఆలపించి ఆయనకు నివాళులర్పించారు. -
ముఖ్యమంత్రి ‘ఆట’విడుపు..!
కొద్దిరోజులుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) మైదానంలో విద్యార్థులతో కలిసి సందడి చేశారు. -
అంగన్వాడీ సిలబస్ మరింత సరళం!
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ కేంద్రాల్లో మరింత నాణ్యమైన పూర్వప్రాథమిక విద్యను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయనుంది. -
సీఎంకు హైకోర్టు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు
న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టు బార్ అసోసియేషన్ ఆదివారం కృతజ్ఞతలు తెలిపింది. -
బ్యాట్ పట్టిన అసదుద్దీన్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం వరకు ప్రచారంలో విరామం లేకుండా గడిపిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. -
అన్ని షిఫ్టుల కార్మికులకు వేతనంతో కూడిన సెలవు నేడు
పార్లమెంటు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ ఉపఎన్నిక నేపథ్యంలో సోమవారం కర్మాగారాల కార్మికుల్లో అన్ని షిఫ్టుల వారికీ వేతనంతో కూడిన సెలవును కార్మికశాఖ ప్రకటించింది.