గురుకులాలకు సొంత భవనాలు
రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు సొంత భవనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.10-15 కోట్ల వరకు ఖర్చు చేయనుంది.
తొలి ఏడాది ఒక్కో సొసైటీ పరిధిలో 20 నిర్మాణం
ప్రతిపాదనలు స్వీకరించిన ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు సొంత భవనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.10-15 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. తొలి విడతలో భూములు గుర్తించిన.. ఇప్పటికే స్థలాలు స్వాధీనం చేసిన గురుకులాలకు భవనాలు నిర్మించనుంది. ఇలాంటి గురుకులాలు ఎన్ని ఉన్నాయి? ఏడాదిలోగా ఎన్ని భవనాలు పూర్తవుతాయి? ఎన్ని నిధులు అవసరమో వివరాలు సేకరిస్తోంది. భవనాల నిర్మాణానికి సంబంధించి గురుకుల సొసైటీల నుంచి ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించింది. వాటికి త్వరలోనే ఆమోదం లభించే అవకాశాలున్నాయని సొసైటీలు భావిస్తున్నాయి.
ప్రైవేటు అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కొత్తగా 731 గురుకులాలు ఏర్పడ్డాయి. ఇందులో 85 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేటు అద్దె భవనాల్లో ప్రారంభమయ్యాయి. తొలుత 5, 6, 7, 8 తరగతులతో ప్రారంభమైనప్పటికీ.. ఆ తరువాత ఏడాదికో తరగతి ఉన్నతీకరణతో జూనియర్ కళాశాలల స్థాయికి చేరాయి. విద్యార్థుల సంఖ్య పెరిగినా.. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరగతి గదిలోనే భోజనం, బసతో నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో శాశ్వత భవనాలు నిర్మించేందుకు నియోజకవర్గాల్లో భూములు గుర్తించారు. కనీసం 5 నుంచి 10 ఎకరాల్లో భవనాలు నిర్మించాలని భావించారు. అయితే అప్పట్లో నిధులు మంజూరు కాక ముందుకు సాగలేదు. కొత్త ప్రభుత్వం గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. తొలి ఏడాది ఒక్కో సొసైటీ పరిధిలో 20 వరకు గురుకులాలకు భవనాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త టీచర్లకు జూన్లో పోస్టింగులు..
కొత్తగా ఎంపికైన గురుకుల టీచర్లు, అధ్యాపకులకు వచ్చే జూన్ (2024-25 విద్యాసంవత్సరం)లో పోస్టింగులు ఇవ్వాలని సొసైటీలు నిర్ణయించాయి. ఇటీవల 7,800 నియామకాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్) అమలవుతుండటంతో కొన్ని జిల్లాల అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. ఇప్పటికే నియామక పత్రాలు తీసుకున్నవారికి పోస్టింగులు ఇస్తే సీనియారిటీ సమస్య వస్తుందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్లో సొసైటీల వారీగా వెబ్కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఇవ్వాలని సంక్షేమాధికారులు నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ వ్యవస్థనూ ‘వదల్లేదు!’
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రతి రాజ్యాంగబద్ధ వ్యవస్థపైనా జగన్ దాడికి దిగారు. తన అనుయాయుల్ని, అనుచరగణాన్ని ఉసిగొల్పారు. న్యాయవ్యవస్థపైనా దాడి చేయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై దాడికి దిగారు. కార్యనిర్వాహక వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, అధికారుల్ని భయభ్రాంతుల్ని చేసి చెప్పినట్టల్లా ఆడించారు. -
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అపోలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునీత నర్రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ఫెలోషిప్నకు ఎన్నికయ్యారు. -
ఓటేసేందుకు వైఎస్ భాస్కరరెడ్డికి అనుమతి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏడో నిందితుడైన వై.ఎస్.భాస్కరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. 13న వెళ్లి అదే రోజు తిరిగి హైదరాబాద్ రావాలని స్పష్టం చేసింది. -
ఇదీ సంగతి!
-
గాలివాన బీభత్సం
రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. ఆదివారం మధ్యాహ్నం తరువాత గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురిశాయి. -
విద్యుత్ వినియోగంలో 6వ స్థానంలో తెలంగాణ
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో 9,009 మిలియన్ యూనిట్ల వినియోగంతో తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచింది. -
కాళేశ్వరం పంప్హౌస్ల మునకపై ఆరా
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు పంప్హౌస్లకు సంబంధించిన వివరాలు అందజేయాలని నీటి పారుదల శాఖ ఇంజినీర్లకు విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సూచించారు. -
ఐఐటీల్లోనూ పాలిటెక్నిక్ విద్యార్థులకు సీట్లు?
పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులు నేరుగా ఐఐటీల్లో బీటెక్ రెండో ఏడాదిలో చేరొచ్చా?.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఐఐటీ హైదరాబాద్ సైతం అందుకు కృషి చేస్తున్నాయి. -
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డిలతోపాటు పలు జిల్లాల పరిధిలో ఆదివారం గాలి వాన, పిడుగులు పడిన ఘటనల్లో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరా తీశారు. -
15న సీపీగెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) నోటిఫికేషన్ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. -
ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’ విడుదల
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం ప్రాథమిక ‘కీ’ని ఆదివారం విడుదల చేశారు. రెస్సాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచామని, అభ్యంతరాలుంటే ఈ నెల 14న ఉదయం 10 గంటలలోపు వెబ్సైట్ నుంచే పంపించాలని కన్వీనర్ డీన్కుమార్, కో-కన్వీనర్ విజయకుమార్రెడ్డి తెలిపారు. -
యాదాద్రిపై భక్తజన సందోహం!
దైవదర్శనాలు.. స్వామివారి కల్యాణం.. దీపారాధనలు.. మొక్కులు, వాహన పూజలు.. పుణ్య స్నానాలతో పంచనారసింహులు కొలువైన మహా పుణ్యక్షేత్రం యాదాద్రి ఆదివారం భక్తజన సందోహంగా మారింది. -
వీనులవిందుగా ‘రవీంద్రుని’ గీతాలాపన
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం 11 రాష్ట్రాల్లో ఒకేరోజు, ఒకే సమయంలో.. ఒకేసారి ఒక్కోచోట 100 మంది గాయకుల చొప్పున రవీంద్రనాథ్ ఠాగూర్ విరచిత 20 గీతాలను మధురంగా ఆలపించి ఆయనకు నివాళులర్పించారు. -
ముఖ్యమంత్రి ‘ఆట’విడుపు..!
కొద్దిరోజులుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) మైదానంలో విద్యార్థులతో కలిసి సందడి చేశారు. -
అంగన్వాడీ సిలబస్ మరింత సరళం!
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ కేంద్రాల్లో మరింత నాణ్యమైన పూర్వప్రాథమిక విద్యను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయనుంది. -
సీఎంకు హైకోర్టు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు
న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టు బార్ అసోసియేషన్ ఆదివారం కృతజ్ఞతలు తెలిపింది. -
బ్యాట్ పట్టిన అసదుద్దీన్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం వరకు ప్రచారంలో విరామం లేకుండా గడిపిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. -
అన్ని షిఫ్టుల కార్మికులకు వేతనంతో కూడిన సెలవు నేడు
పార్లమెంటు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ ఉపఎన్నిక నేపథ్యంలో సోమవారం కర్మాగారాల కార్మికుల్లో అన్ని షిఫ్టుల వారికీ వేతనంతో కూడిన సెలవును కార్మికశాఖ ప్రకటించింది.