ప్చ్.. ‘ముడి’పడడం లేదు!
ఉన్నత చదువులు.. సామాజిక మార్పులు వివాహ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలకు తగిన సంబంధాలు దొరకడం సమస్యగా మారింది.
మారిపోతున్న పెళ్లి అభిరుచులు
కొన్నింట రాజీపడి ముందుకెళ్దామనుకుంటే కుదరని జాతకాలతో తంటా
అబ్బాయిలకే కాదు... అమ్మాయిలకూ తగిన సంబంధం దొరక్క తల్లిదండ్రుల్లో ఆందోళన
ఈనాడు, హైదరాబాద్: ఉన్నత చదువులు.. సామాజిక మార్పులు వివాహ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలకు తగిన సంబంధాలు దొరకడం సమస్యగా మారింది. కులమతాల పట్టింపులు ఉన్నచోట్ల ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. జాతకాలు, కట్నకానుకలు, యువతీయువకుల ఎత్తు వంటివి కూడా బాగా ప్రభావం చూపుతున్నాయి. 18 ఏళ్లు నిండిన అమ్మాయికి, 21 సంవత్సరాలు నిండిన అబ్బాయికి పెళ్లి చేయవచ్చని చట్టం చెపుతున్నా.. ఆ తరవాత మరో పదేళ్లయినా పెళ్లి కాని యువతీ, యువకులు ఎంతోమంది కనిపిస్తున్నారు. వారికి పెళ్లి సంబంధాల అన్వేషణలో తల్లిదండ్రులు అలసిపోతున్నారు. ఇటీవల దాకా రైతులు, వేద పండితులకు సంబంధాలు రావడం కష్టంగా ఉందనే పరిస్థితులు ఉండగా ఇప్పుడు వారి సరసన ఉన్నత చదువులు చదివి.. మంచి వేతన ప్యాకేజీలతో ఉన్నతోద్యోగాలు చేస్తున్న యువతీ, యువకులు కూడా చేరుతున్నారని పలు మ్యారేజ్ బ్యూరోల ప్రతినిధులు ‘ఈనాడు’కు చెప్పారు. ‘‘తల్లిదండ్రుల్లో చాలామంది అమ్మాయి డాక్టరైతే... అబ్బాయి కూడా డాక్టరైతే బాగుంటుందని ఆలోచిస్తారు.
ప్యాకేజీ విషయంలోనూ అమ్మాయి కంటే అబ్బాయికి ఎక్కువగా ఉండాలని భావిస్తారు. ఇలాంటి మరెన్నో అంశాలు వయసు మీరకుండా పిల్లల పెళ్లి చేసేయాలనే పెద్దల సంకల్పానికి చాలాచోట్ల అవరోధాలుగా పరిణమిస్తున్నాయి. ఎంతో ఉన్నతస్థాయిలో ఉన్నా ఇప్పటికీ అత్యధిక శాతం కుటుంబాల వారు.. కులం, హోదా, జాతకాలు, ఆస్తులు, కట్నం వంటి విషయాల్లో ఏమాత్రం రాజీపడకపోవడం వల్ల పెళ్లిళ్లు చాలా ఆలస్యమవుతున్నాయి. కొన్ని కులాల్లో చూస్తే... ఒక కులంలో అనేక శాఖలు ఉంటాయి. కులం ఒకటైతే సరిపోదని.. శాఖ కూడా ఒకటే కావాలని పలువురు పేర్కొంటున్నారు. ఇలా వివిధ కారణాలతో సంబంధాలను తిరస్కరించడంతో పలువురు యువతీయువకులకు 30 ఏళ్లు దాటే వరకూ కూడా పెళ్లిళ్లు కావడం లేదని మా మ్యారేజ్ బ్యూరోల అంతర్గత సర్వేలు చెపుతున్నాయి. 30ఏళ్లు వచ్చిన తరవాత మెల్లగా రాజీపడటం మొదలవుతోంది’’ అని వారు వివరించారు.
నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నా...
గుంటూరుకు చెందిన ఓ అబ్బాయి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ఎంటెక్ చదివాడు. నెలకు రూ.2 లక్షల వేతనంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఏడాదిన్నర నుంచి సంబంధాలు వెదుకుతున్నా అమ్మాయి దొరకడం లేదని తండ్రి ‘ఈనాడు’తో ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పెళ్లి సంబంధం గురించి మాట్లాడగానే ఎన్ని రూ.కోట్ల ఆస్తి ఉంది అని చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు అడుగుతున్నారు. పెద్దగా ఆస్తి లేదనగానే కొంత మంది తిరస్కరించారు. ఇటీవల ఓ పేద కుటుంబానికి చెందిన బీటెక్ చదివిన అమ్మాయిని చేసుకుందామని అడిగితే అబ్బాయి అందంగా లేడని తిరస్కరించింది’ అని ఆయన వాపోయారు.
పెళ్లయ్యేనాటికి అన్ని హంగులు ఉండాలని...
ఇటీవలికాలంలో చాలామంది అబ్బాయిలు పెళ్లయ్యేనాటికల్లా రూ.లక్షల వేతనంతో ఉద్యోగంతోపాటు ఇల్లు, కారు వంటివన్నీ ఉండాలని 30 ఏళ్లు వయసు దాటేదాకా ఆగుతున్నారని మ్యారేజ్ బ్యూరోల వారు చెబుతున్నారు. అమ్మాయిలు కూడా పలు విషయాల్లో చాలా స్పష్టతతో ఉంటున్నారని వారు కోరుకున్న సంబంధం వచ్చేదాకా ప్రతి సంబంధాన్ని తిరస్కరిస్తున్నారని వివరించారు. ‘విజయవాడకు చెందిన ఓ అమ్మాయి ఎంటెక్ చదివి ఉద్యోగం చేస్తోంది. పీజీ చదివి నెలకు రూ.లక్షకుపైగా సంపాదించే అబ్బాయిని మాత్రమే చేసుకుంటానని ఇప్పటికే 16 సంబంధాలను ఆమె తిరస్కరించింది’ అని వివరించారు.
మన దేశంలో 2020-21లో బీటెక్లో ఐటీ, కంప్యూటర్ కోర్సుల్లో 5.33 లక్షల మంది అబ్బాయిలు చేరగా, అమ్మాయిలు 3.44 లక్షల మంది చేరారని కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాలు తెలియజేస్తున్నాయి.
ఐటీ, సాఫ్ట్వేర్లో అమ్మాయిల కొరత...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక శాతం అబ్బాయిలు బీటెక్ చదువుతుండగా.. వారిలో ఎక్కువమంది ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో స్థిరపడుతున్నారు. ఈ రంగాల్లో ఉన్న అమ్మాయి తమ జీవితంలోకి రావాలని కోరుకుంటుండటంతో సంబంధాలు కుదరడం లేదు. మరోవైపు మంచి పేరున్న విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ చదివి వేతన ప్యాకేజీ బాగున్న అబ్బాయిలకు అదేస్థాయి అమ్మాయి దొరకడం చాలా కష్టంగా ఉండగా, దీనికి పూర్తి వ్యతిరేకంగా మెడిసిన్ చదివిన అమ్మాయికి అంతేస్థాయి అబ్బాయి దొరకడం కష్టంగా ఉంది.
నర్సింగ్ హోం కట్టిస్తారా?
మెడిసిన్ చదివిన అబ్బాయిలు తక్కువ సంఖ్యలో ఉన్నందువల్ల.. ఎంబీబీఎస్, ఎండీ చదివిన అమ్మాయిలకు పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. ఎండీ చదివిన ఓ అమ్మాయికి ఇటీవల పేద రైతు కుటుంబానికి చెందిన ఓ మెడిసిన్ అబ్బాయి సంబంధం వచ్చింది. ‘‘మా అబ్బాయి ఎండీ చదివాడు కాబట్టి మా ఊర్లో స్థలం కొని నర్సింగ్హోం కట్టించి ఇవ్వాలి. రూ.ఎన్ని కోట్ల ఆస్తి ఉంది? ఎంత కట్నం ఇస్తారు’’ అని అబ్బాయి తల్లి అడగటంతో ఏం చెప్పాలో అర్థం కాలేదని అమ్మాయి తండ్రి ‘ఈనాడు’కు తెలిపారు. దీంతో ఆ అబ్బాయికి రెండేళ్లుగా సంబంధం కుదరడం లేదని మ్యారేజ్ బ్యూరో ప్రతినిధి తెలిపారు.
సర్కారు నౌకరీకీ ఆకర్షణ లేదు...
ఒకప్పుడు ప్రభుత్వంలో గుమస్తా ఉద్యోగం చేసే అబ్బాయిని పెళ్లాడడానికి అమ్మాయిలు.. అల్లుడిగా తెచ్చుకోవడానికి తల్లిదండ్రులు చాలా ఆసక్తి చూపేవారు. ఇప్పడు పరిస్థితులు చాలావరకు మారాయని ఓ మ్యారేజ్ బ్యూరో ప్రతినిధి తెలిపారు. ఉన్నత చదువులు చదివి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగులను పెద్దగా ఇష్టపడటం లేదని వివరించారు. అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ)గా పనిచేస్తున్న భర్తకి గ్రామీణ ప్రాంతాలకు బదిలీ అవుతోందని తెలిసి భార్య అయిన సాఫ్ట్వేర్ అమ్మాయి మూడేళ్లకల్లా విడాకులకు దరఖాస్తు చేసి వెళ్లిపోయిందని ఆయన ఓ ఉదంతాన్ని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే