తెలుగు నేలకు ఎండదెబ్బ!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణ మార్పులు.. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
రెండు రాష్ట్రాలపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రం
తెలంగాణలో తాజాగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
గత 53 ఏళ్ల పరిస్థితులపై క్లైమేట్ సెంట్రల్ సంస్థ అధ్యయనం
తెలంగాణలో 0.5, ఏపీలో 0.9 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు
ఈనాడు - హైదరాబాద్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణ మార్పులు.. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి రెండు మూడు రోజుల్లోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. మార్చిలో రెండు వారాలు కొంత ఊరట ఇచ్చినా.. చివరి వారం నుంచి మళ్లీ మంటలు మొదలయ్యాయి. రెండు మినహా అన్ని జిల్లాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం రాష్ట్రమంతటా ఎండల తీవ్రతను స్పష్టం చేస్తోంది. నిర్మల్, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, గద్వాల, ఆదిలాబాద్, నాగర్కర్నూల్ జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. నల్గొండ జిల్లాలోని నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీలు నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడమే కాకుండా రాత్రిపూట కూడా తీవ్రమైన వేడి కొనసాగుతోంది. 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే సూచించింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాడ్పుల తీవ్రత కొనసాగనుందని హెచ్చరించింది.
క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం ఇలా..
గత ఐదు దశాబ్దాల కాలంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నాయని అమెరికాకు చెందిన వాతావరణ అధ్యయన సంస్థ క్లైమేట్ సెంట్రల్ తాజాగా విశ్లేషించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదలను వివరించింది. వాతావరణ మార్పుల సూచిక (సీఎస్ఐ) ద్వారా ప్రాంతాల వారీగా అధ్యయనం చేసింది. జనవరి 1, 1970 నుంచి జూన్ 30 2023 వరకు 53 ఏళ్లపాటు.. భారతదేశంలో ఉష్ణోగ్రతల మార్పులను అత్యాధునిక కంప్యూటర్ విధానంలో విశ్లేషించింది. భారత్లో చిన్న ప్రాంతాలైన చండీగఢ్, లక్షద్వీప్, పుదుచ్చేరి మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిన తీరును అధ్యయనం చేసింది. దీని ప్రకారం.. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 1970వ సంవత్సరం వేసవి నుంచి 2023 ఏప్రిల్-జూన్ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. 1970తో పోలిస్తే.. గత ఏడాది తెలంగాణలో 0.5 డిగ్రీలు, ఏపీలో 0.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగింది. దేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉండగా, తెలంగాణ 28వ స్థానంలో ఉంది. మానవ ప్రమేయం వల్ల వాతావరణంలో కలిగే మార్పులు.. ఉష్ణోగ్రతల పెరుగుదలకు అధికంగా కారణమవుతున్నాయని అధ్యయనం వెల్లడించింది.
ఇంకా పెరిగే అవకాశం
ఆండ్రూ పెర్షింగ్, వైస్ ప్రెసిడెంట్, క్లైమేట్ సెంట్రల్, అమెరికా
అత్యధిక ఉష్ణోగ్రతలకు వాతావరణ మార్పులే కారణం. భారత్లో తీవ్రమైన ఎండల సీజన్ కొనసాగనుంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో సగటు కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల.. ఇటువంటి పరిస్థితులు ఇంకా ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువే
ఎ.శ్రావణి, సీనియర్ వెదర్ ఆఫీసర్, వాతావరణశాఖ, హైదరాబాద్
ఈ ఏడాది పూర్తిస్థాయిలో పొడి వాతావరణం కొనసాగుతుండటంతో పాటు మధ్య భారతంలో తుపాను వ్యతిరేక పరిస్థితులు కొనసాగుతుండటంతో ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. ఎల్ నినో ప్రభావంతో ఈసారి ఫిబ్రవరి నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి చివరి నుంచి దాని ప్రభావం మరింత పెరిగిపోయింది. రాష్ట్రంలో ఏప్రిల్ మూడు, నాలుగు వారాల్లో వడగాడ్పులు తీవ్రంగా వీచే అవకాశం ఉంది. అవి మే నెలలో కూడా కొనసాగుతాయి. ఈసారి 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చు. కొన్ని రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రుళ్లు ఉక్కపోత వాతావరణం కొనసాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ