బడి ఈడులో జబ్బు.. నడి వయసులో ముప్పు!
ప్రతి వంద మంది పురుషుల్లో 23 మందికి బహుళ వ్యాధులుండగా.. మహిళల్లో 27 % కంటే ఎక్కువ మందికి రెండుకు మించి జబ్బులున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.
చిన్నప్పటి అనారోగ్యం.. పెద్దయ్యాక దుష్ప్రభావం
25 శాతం మందిలో రెండు.. అంతకంటే ఎక్కువ జబ్బులు
బాధితుల్లో మహిళలే అధికం
50 ఏళ్లు దాటిన వారిపై ఐసీఎంఆర్ అధ్యయనం
తాజాగా బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితం
ప్రతి వంద మంది పురుషుల్లో 23 మందికి బహుళ వ్యాధులుండగా.. మహిళల్లో 27 % కంటే ఎక్కువ మందికి రెండుకు మించి జబ్బులున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 100 మందిలో 21 మంది బహుళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే.. పట్టణ వాసుల్లో ఆ సంఖ్య 35గా ఉంది.
ఈనాడు, హైదరాబాద్: చిన్నతనంలో తరచూ అస్వస్థతకు గురయ్యేవారా? తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడి.. నెల రోజులకు పైగా బడికి వెళ్లలేకపోయారా? అయితే ఇలాంటి వారు నడివయసు దాటాక బహుళ (రెండు.. అంతకంటే ఎక్కువ) దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ముప్పు పొంచి ఉంది. బాల్యంలో ఏవైనా జబ్బులతో బాధపడి.. ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన వారిలో 25 శాతం మందికి బహుళ వ్యాధులు సోకుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బు, క్యాన్సర్, పక్షవాతం, మానసిక రుగ్మతలు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, క్షయ, ఎముకల బలహీనత, అధిక కొలెస్ట్రాల్, దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం, దీర్ఘకాల నోటి వ్యాధులు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి బాధితుల్లో పురుషుల కంటే మహిళలే అధికం. ‘బాల్యంలో అనారోగ్యం.. నడి వయసులో దాని దుష్ప్రభావం’ అనే అంశంపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన పరిశోధనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన పత్రం తాజాగా ‘బ్రిటిష్ మెడికల్ జర్నల్ (బీఎంజే)’లో ప్రచురితమైంది.
అధ్యయనం సాగిందిలా..
దేశవ్యాప్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. ఒక్కొక్క విభాగం/అంశం వారీగా ప్రతి 100 మందిలో ఎంత మంది ఉన్నారని లెక్కగట్టారు. 50 ఏళ్లు పైబడిన 51,481 మందిపై ఈ పరిశోధన చేశారు. వీరిలో 50-59 ఏళ్ల మధ్య వయస్కులు 19,835 (38.53 శాతం), 60-69 ఏళ్ల వారు 18,807 (36.53 శాతం), 70 ఏళ్లు పైబడినవారు 12,839 (24.94 శాతం) మంది ఉన్నారు. వీరిలో పురుషులు 23,942 (46.51 శాతం), మహిళలు 27,539 (53.49 శాతం).
ప్రస్తుతం వారిలో ఏయే జబ్బులున్నాయో అధ్యయనంలో ప్రధానంగా కనుక్కున్నారు. చిన్నతనంలో ఏవైనా జబ్బుల బారినపడ్డారా? అని అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య కారణాలతో బాల్యంలో నెల రోజులు.. అంతకంటే ఎక్కువ రోజులు పాఠశాలకు వెళ్లకుండా ఉండాల్సి వచ్చిందా? అనేది ఆరా తీశారు. వారి ప్రస్తుత, బాల్యంలోని ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్నారు. వీటన్నింటి మధ్య సారూప్యతను విశ్లేషించారు.
ఆటలు తగ్గినా ముప్పే
జీవనశైలి వ్యాధులకు చిన్నప్పటి జీవన విధానం కూడా ఒక కారణమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. బాల్యంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 33 శాతం మందిని 50 ఏళ్లు దాటాక జీవనశైలి వ్యాధులు చుట్టుముట్టాయి. బాల్యంలో ఆటలకు దూరంగా ఉండడం, సుకుమారంగా పెరగడం, నడక, పరుగు తదితర శారీరక శ్రమ తెలియకపోవడం వల్ల వయసు పెద్దయ్యాక వారిలో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయని అధ్యయనం విశ్లేషిస్తోంది. చిన్నతనంలో పేదరికంలో ఉన్న వారిలో 21 శాతం మందికి.. 50 ఏళ్లు దాటాక బహుళ వ్యాధులు సోకినట్లు తేలింది. ప్రస్తుత ఆర్థిక స్థితి బాగా ఉన్నవారినీ దీర్ఘకాలిక వ్యాధులు వేధిస్తున్నాయి.
పరిశోధన ఫలితాలు ఇలా..
50 ఏళ్లు పైబడిన వారిలో..
- 45% మందికి దీర్ఘకాలిక వ్యాధులు లేవు.
- ఒకే దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతున్న వారు 30 శాతం, బహుళ వ్యాధిగ్రస్థులు 25 శాతం.
- బాల్యంలో అనారోగ్యం వల్ల నెల రోజులకు పైగా బడికి గైర్హాజరైన వారు 53 శాతం.
- వీరిలో 50 ఏళ్లు దాటాక.. బహుళ దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించిన వారు 35 శాతం.
- బాల్యంలో ఆరోగ్యం బాగున్న వారిలోనూ.. 50 ఏళ్లు దాటాక దీర్ఘకాలిక వ్యాధుల బారినపడిన వారు 24 శాతం.
- వివాహితుల్లో 24 శాతం.. అవివాహితులు, జీవిత భాగస్వామి లేని వారిలో 27 శాతం బహుళ వ్యాధులకు గురయ్యారు.
- ఏ పనీ చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉన్న వారిలో జబ్బులు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం చెబుతోంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 17 శాతం, పని చేయకుండా ఉన్న వారిలో 31.8 శాతం మంది వ్యాధులబారిన పడ్డారు.
- వయసు పెరుగుతున్నకొద్దీ బహుళ దీర్ఘకాలిక జబ్బులు సోకే వారి సంఖ్య పెరుగుతోంది.
అతి పేదరికంలో ఉన్నవారిలో.. ఇప్పుడు బహుళ జబ్బులు 18 శాతం, పేదరికంలో ఉన్న వారిలో 21 శాతం, మధ్యతరగతి ఆర్థిక స్థితి ఉన్న వారిలో 25 శాతం, ధనవంతుల్లో 28 శాతం, బాగా ధనవంతుల్లో 36 శాతం మందికి.. రెండు అంత కంటే ఎక్కువ దీర్ఘకాలిక జబ్బులున్నట్లు గుర్తించారు.
బాల్యంలో ఆరోగ్య సంరక్షణ ముఖ్యం
బాల్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. 18 ఏళ్ల లోపు పిల్లలు వారానికి కనీసం ఐదు రోజులు.. మొత్తం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. అలా చేయని పిల్లలు మన దేశంలో 80 శాతం మంది ఉన్నారు. బాల్యంలో శారీరక శ్రమ చేయని వారికి భవిష్యత్తులో దీర్ఘకాలిక జబ్బులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ పరిశోధన పత్రం చెబుతోంది. పేదరికంలో ఉన్నవారు సహజంగా శారీరక శ్రమ చేస్తారు. అందుకే 50 ఏళ్లు దాటాక తక్కువగా దీర్ఘకాలిక జబ్బుల బారిన పడతారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల్లో వ్యాయామం తక్కువ కావడంతో వారిలో పెద్దయ్యాక దీర్ఘకాలిక జబ్బులు పెరుగుతున్నాయని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది. పేదరికం కారణంగా పౌష్టికాహార లోపం వల్ల కూడా తరచూ అనారోగ్యం బారినపడుతుంటారు. శిశువు పుట్టిన తొలి 1000 రోజుల్లో ఇచ్చే ఆహారం, టీకాలు, ఆరోగ్య సంరక్షణ ఎలా ఉంటుందో.. ఆ ప్రభావం తర్వాత వయసులో కనిపిస్తుంది. బాల్యంలో శుభ్రత కూడా చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. చేతులు శుభ్రంగా కడుక్కోవడంపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి.
డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో పట్టణ రాష్ట్రంగా తెలంగాణ
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరా, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. -
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. -
నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది. -
ఆశతో పెట్టుబడి.. మోసాలకు పట్టుబడి
రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
మత్తు అనర్థాలపై అవగాహన: ఐఎంఏ
మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య కమిటీ ప్రకటించింది. -
తగ్గిన గనులశాఖ ఆదాయం
రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది. -
తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రెండు, మూడు నెలల్లో… బీబీనగర్-గుంటూరు డబ్లింగ్ పనులు
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో లైన్ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. -
జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. -
థింపూలో ఏబీటీవో కార్యాలయం ప్రారంభం
భూటాన్ రాజధాని థింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల (ఏబీటీవో) కార్యాలయం ఆదివారం ప్రారంభమైంది. -
29, 30 తేదీల్లో వనదేవతల గద్దెలకు తాళాలు
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. -
నేటి నుంచే ‘టెట్’
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం ప్రారంభం కానుంది. జూన్ 2వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్కు 99,958 మంది, రెండో పేపర్కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు
యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
‘మత్తు’ నియంత్రణకు కదిలిన యంత్రాంగం
రాష్ట్రంలో నాటుసారాను మూడు నెలల్లో నిర్మూలించడంతోపాటు గంజాయిని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణ ప్రారంభించింది. -
వాతావరణ మార్పులతో ‘ఆర్థిక విధ్వంసం’
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. -
ప్రమాదంలో భావప్రకటన స్వేచ్ఛ
దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా.ఎస్.మురళీధర్ అన్నారు. -
ముంచుకొచ్చిన వానలు.. మొలకెత్తిన వడ్లు
ములుగు జిల్లా వెంకటాపూర్లోని కొనుగోలు కేంద్రంలో సన్న ధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయి. జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. -
ఆధార్ అనుసంధానం కాకున్నా..‘డెత్ క్లెయిమ్’లు పరిష్కరించండి
ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్వో వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. ట్రోలింగ్తో వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’