బడి ఈడులో జబ్బు.. నడి వయసులో ముప్పు!
ప్రతి వంద మంది పురుషుల్లో 23 మందికి బహుళ వ్యాధులుండగా.. మహిళల్లో 27 % కంటే ఎక్కువ మందికి రెండుకు మించి జబ్బులున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.
చిన్నప్పటి అనారోగ్యం.. పెద్దయ్యాక దుష్ప్రభావం
25 శాతం మందిలో రెండు.. అంతకంటే ఎక్కువ జబ్బులు
బాధితుల్లో మహిళలే అధికం
50 ఏళ్లు దాటిన వారిపై ఐసీఎంఆర్ అధ్యయనం
తాజాగా బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితం
ప్రతి వంద మంది పురుషుల్లో 23 మందికి బహుళ వ్యాధులుండగా.. మహిళల్లో 27 % కంటే ఎక్కువ మందికి రెండుకు మించి జబ్బులున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 100 మందిలో 21 మంది బహుళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే.. పట్టణ వాసుల్లో ఆ సంఖ్య 35గా ఉంది.
ఈనాడు, హైదరాబాద్: చిన్నతనంలో తరచూ అస్వస్థతకు గురయ్యేవారా? తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడి.. నెల రోజులకు పైగా బడికి వెళ్లలేకపోయారా? అయితే ఇలాంటి వారు నడివయసు దాటాక బహుళ (రెండు.. అంతకంటే ఎక్కువ) దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ముప్పు పొంచి ఉంది. బాల్యంలో ఏవైనా జబ్బులతో బాధపడి.. ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన వారిలో 25 శాతం మందికి బహుళ వ్యాధులు సోకుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బు, క్యాన్సర్, పక్షవాతం, మానసిక రుగ్మతలు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, క్షయ, ఎముకల బలహీనత, అధిక కొలెస్ట్రాల్, దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం, దీర్ఘకాల నోటి వ్యాధులు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి బాధితుల్లో పురుషుల కంటే మహిళలే అధికం. ‘బాల్యంలో అనారోగ్యం.. నడి వయసులో దాని దుష్ప్రభావం’ అనే అంశంపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన పరిశోధనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన పత్రం తాజాగా ‘బ్రిటిష్ మెడికల్ జర్నల్ (బీఎంజే)’లో ప్రచురితమైంది.
అధ్యయనం సాగిందిలా..
దేశవ్యాప్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. ఒక్కొక్క విభాగం/అంశం వారీగా ప్రతి 100 మందిలో ఎంత మంది ఉన్నారని లెక్కగట్టారు. 50 ఏళ్లు పైబడిన 51,481 మందిపై ఈ పరిశోధన చేశారు. వీరిలో 50-59 ఏళ్ల మధ్య వయస్కులు 19,835 (38.53 శాతం), 60-69 ఏళ్ల వారు 18,807 (36.53 శాతం), 70 ఏళ్లు పైబడినవారు 12,839 (24.94 శాతం) మంది ఉన్నారు. వీరిలో పురుషులు 23,942 (46.51 శాతం), మహిళలు 27,539 (53.49 శాతం).
ప్రస్తుతం వారిలో ఏయే జబ్బులున్నాయో అధ్యయనంలో ప్రధానంగా కనుక్కున్నారు. చిన్నతనంలో ఏవైనా జబ్బుల బారినపడ్డారా? అని అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య కారణాలతో బాల్యంలో నెల రోజులు.. అంతకంటే ఎక్కువ రోజులు పాఠశాలకు వెళ్లకుండా ఉండాల్సి వచ్చిందా? అనేది ఆరా తీశారు. వారి ప్రస్తుత, బాల్యంలోని ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్నారు. వీటన్నింటి మధ్య సారూప్యతను విశ్లేషించారు.
ఆటలు తగ్గినా ముప్పే
జీవనశైలి వ్యాధులకు చిన్నప్పటి జీవన విధానం కూడా ఒక కారణమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. బాల్యంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 33 శాతం మందిని 50 ఏళ్లు దాటాక జీవనశైలి వ్యాధులు చుట్టుముట్టాయి. బాల్యంలో ఆటలకు దూరంగా ఉండడం, సుకుమారంగా పెరగడం, నడక, పరుగు తదితర శారీరక శ్రమ తెలియకపోవడం వల్ల వయసు పెద్దయ్యాక వారిలో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయని అధ్యయనం విశ్లేషిస్తోంది. చిన్నతనంలో పేదరికంలో ఉన్న వారిలో 21 శాతం మందికి.. 50 ఏళ్లు దాటాక బహుళ వ్యాధులు సోకినట్లు తేలింది. ప్రస్తుత ఆర్థిక స్థితి బాగా ఉన్నవారినీ దీర్ఘకాలిక వ్యాధులు వేధిస్తున్నాయి.
పరిశోధన ఫలితాలు ఇలా..
50 ఏళ్లు పైబడిన వారిలో..
- 45% మందికి దీర్ఘకాలిక వ్యాధులు లేవు.
- ఒకే దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతున్న వారు 30 శాతం, బహుళ వ్యాధిగ్రస్థులు 25 శాతం.
- బాల్యంలో అనారోగ్యం వల్ల నెల రోజులకు పైగా బడికి గైర్హాజరైన వారు 53 శాతం.
- వీరిలో 50 ఏళ్లు దాటాక.. బహుళ దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించిన వారు 35 శాతం.
- బాల్యంలో ఆరోగ్యం బాగున్న వారిలోనూ.. 50 ఏళ్లు దాటాక దీర్ఘకాలిక వ్యాధుల బారినపడిన వారు 24 శాతం.
- వివాహితుల్లో 24 శాతం.. అవివాహితులు, జీవిత భాగస్వామి లేని వారిలో 27 శాతం బహుళ వ్యాధులకు గురయ్యారు.
- ఏ పనీ చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉన్న వారిలో జబ్బులు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం చెబుతోంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 17 శాతం, పని చేయకుండా ఉన్న వారిలో 31.8 శాతం మంది వ్యాధులబారిన పడ్డారు.
- వయసు పెరుగుతున్నకొద్దీ బహుళ దీర్ఘకాలిక జబ్బులు సోకే వారి సంఖ్య పెరుగుతోంది.
అతి పేదరికంలో ఉన్నవారిలో.. ఇప్పుడు బహుళ జబ్బులు 18 శాతం, పేదరికంలో ఉన్న వారిలో 21 శాతం, మధ్యతరగతి ఆర్థిక స్థితి ఉన్న వారిలో 25 శాతం, ధనవంతుల్లో 28 శాతం, బాగా ధనవంతుల్లో 36 శాతం మందికి.. రెండు అంత కంటే ఎక్కువ దీర్ఘకాలిక జబ్బులున్నట్లు గుర్తించారు.
బాల్యంలో ఆరోగ్య సంరక్షణ ముఖ్యం
బాల్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. 18 ఏళ్ల లోపు పిల్లలు వారానికి కనీసం ఐదు రోజులు.. మొత్తం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. అలా చేయని పిల్లలు మన దేశంలో 80 శాతం మంది ఉన్నారు. బాల్యంలో శారీరక శ్రమ చేయని వారికి భవిష్యత్తులో దీర్ఘకాలిక జబ్బులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ పరిశోధన పత్రం చెబుతోంది. పేదరికంలో ఉన్నవారు సహజంగా శారీరక శ్రమ చేస్తారు. అందుకే 50 ఏళ్లు దాటాక తక్కువగా దీర్ఘకాలిక జబ్బుల బారిన పడతారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల్లో వ్యాయామం తక్కువ కావడంతో వారిలో పెద్దయ్యాక దీర్ఘకాలిక జబ్బులు పెరుగుతున్నాయని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది. పేదరికం కారణంగా పౌష్టికాహార లోపం వల్ల కూడా తరచూ అనారోగ్యం బారినపడుతుంటారు. శిశువు పుట్టిన తొలి 1000 రోజుల్లో ఇచ్చే ఆహారం, టీకాలు, ఆరోగ్య సంరక్షణ ఎలా ఉంటుందో.. ఆ ప్రభావం తర్వాత వయసులో కనిపిస్తుంది. బాల్యంలో శుభ్రత కూడా చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. చేతులు శుభ్రంగా కడుక్కోవడంపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి.
డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM