ముందే ఎండిపోతున్న కంకులు
యాసంగి సీజన్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు చేదు అనుభవాలు మిగులుతున్నాయి. సీజన్ ఆరంభం నుంచీ చీడపీడలు పంటను వెంటాడుతుండగా, ప్రస్తుతం 17-18 జిల్లాల్లో పంట చివరిదశలో తెగుళ్లు వ్యాపించడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
మక్క పంటకు తెగుళ్ల బెడద
ఎకరాకు 10 క్వింటాళ్ల వరకూ తగ్గుతున్న దిగుబడి
ఈనాడు, హైదరాబాద్: యాసంగి సీజన్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు చేదు అనుభవాలు మిగులుతున్నాయి. సీజన్ ఆరంభం నుంచీ చీడపీడలు పంటను వెంటాడుతుండగా, ప్రస్తుతం 17-18 జిల్లాల్లో పంట చివరిదశలో తెగుళ్లు వ్యాపించడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఎకరాకు 40 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 30 క్వింటాళ్లే వస్తోందని చెబుతున్నారు. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. కోళ్లు, పశువులకు మేతగా, వివిధ పరిశ్రమల్లో ముడిసరకుగా దీని వినియోగం తప్పనిసరిగా మారటంతో ఈ పంట ప్రాధాన్యం పెరిగింది. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఈ యాసంగిలో పలుచోట్ల మక్కల వైపు మొగ్గుచూపారు.
6.66 లక్షల ఎకరాల్లో సాగు
యాసంగిలో మక్కల సాగు సాధారణ లక్ష్యం 5,11,521 ఎకరాలు కాగా... రైతులు 6,66,772 ఎకరాల్లో పంటను వేశారు. ఆరంభంలో కత్తెర పురుగు, కాండం తొలుచు పురుగులు వ్యాపించాయి. ప్రస్తుతం వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పంట కంకుల దశలో ఉండగా.. ఎండు తెగులు వ్యాపించింది. కంకులు పూర్తిస్థాయిలో పెరగకుండానే.. ఎండిపోయి రాలిపోతున్నాయి. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాల్లో పాలకంకులు తయారవుతుండగా... వాటిలో పాముపొడ, మచ్చ తెగులు వ్యాపించాయి. దీంతో కంకి ఎదుగుదల కోల్పోతోంది. పంటలను రక్షించుకునేందుకు పురుగుమందులు పిచికారీ చేసినా ఫలితం అంతగా ఉండడం లేదని రైతులు చెబుతున్నారు.
దిగుబడిపై ప్రభావం
మొక్కజొన్న ఎకరానికి సాధారణంగా 40 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుంది. ప్రస్తుతం తెగుళ్లు వ్యాపించినచోట 30 క్వింటాళ్లు, అంతకంటే తక్కువ దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. కొన్నిచోట్ల ఎకరంలో సగం మేరకు పంట దెబ్బతిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వ్యవసాయ శాఖ అప్రమత్తం
ఈ సమస్యపై వ్యవసాయశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రధానంగా మక్క కంకి ఎదిగే దశలో ఉన్న చోట ఆశిస్తున్న పాముపొడ, మచ్చ తెగుళ్లపై రైతులను చైతన్యవంతం చేయాలని సూచించింది. పంట క్షేత్రాలను సందర్శించి తెగుళ్ల నివారణ చర్యలను వెల్లడించాలని పేర్కొంది.
పెట్టుబడి వచ్చేలా లేదు
వరి కంటే మొక్కజొన్న మేలనుకొని సాగు చేశా. ఆది నుంచి తెగుళ్ల బాధతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎండు తెగులు బాగా దెబ్బతీసింది. పెట్టుబడి అయినా వస్తుందో రాదోననే అనుమానం ఉంది.
రాజమౌళి, రైతు, దుగ్గొండి, వరంగల్ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి