ఆరంభంలోనే.. అట్టహాసంగా
లోక్సభ ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. కీలకమైన ఈ పర్వాన్ని అట్టహాసంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ నెల 18 నుంచి నామినేషన్లు
తొలి రోజుల్లోనే అత్యధికంగా దాఖలయ్యే అవకాశం
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. కీలకమైన ఈ పర్వాన్ని అట్టహాసంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా అదే రోజు ప్రారంభం అవుతుంది. 25 వరకు కొనసాగుతుంది. 26న పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుంది. 25 వరకు గడువు ఉన్నా ఎక్కువమంది తొలి రోజుల్లోనే దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ రోజులు మంచివిగా భావిస్తున్నారు. ఈ సారి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపాలు నామినేషన్ల ప్రక్రియను భారీగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. శాసనసభ ఎన్నికల అనంతరం జరుగుతున్న అతి ప్రధానమైన ఎన్నికలు కావడంతో సత్తా చాటేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని భావిస్తున్నాయి. ఈ ఘట్టాన్ని జనాల్ని ఆకట్టుకునేలా నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్, భారాస, భాజపా... ఈ మూడు పార్టీలు మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలకు ఇప్పటికే పేర్లను ప్రకటించింది. ఒకటిరెండు రోజుల్లో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్లకూ వెల్లడించే అవకాశం ఉంది. భారాస, భాజపా మొత్తం స్థానాలకు ప్రకటించాయి. పోటీచేసే వారిని చాలాచోట్ల నిర్ణయించేయడంతో ఎలాంటి గందరగోళానికి అవకాశం లేకుండా నామినేషన్లకు పక్కాగా ఏర్పాట్లు చేసుకునేందుకు వీలు కలిగిందని అభ్యర్థులు భావిస్తున్నారు. ర్యాలీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నామినేషన్లకు సీఎం, మంత్రులు.. కేటీఆర్, హరీశ్
కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్ సహా ఇతర మంత్రులు, కాంగ్రెస్ రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు. మహబూబ్నగర్, భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. భారాస అభ్యర్థుల నామినేషన్లలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు, మాజీ మంత్రి టి.హరీశ్రావు ఇతర నేతలు పాల్గొననున్నారని పార్టీ నేతలు తెలిపారు.
భాజపా రాష్ట్రాల సీఎంలు లేదా కేంద్ర మంత్రులు
భాజపా అభ్యర్థుల నామినేషన్ల అంశాన్ని జాతీయ పార్టీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఈ కార్యక్రమాలలో ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి లేదా కేంద్రమంత్రి ఒకరు స్వయంగా పాల్గొనేలా కార్యక్రమం రూపొందించారు. 17 మంది లోక్సభ అభ్యర్థుల కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొంటారనే అంశం రెండు రోజుల్లో ఖరారవుతుందని పార్టీ నేతలు తెలిపారు. భాజపా సీనియర్ నేత, కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ వంటి కీలక నేతలు హాజరుకానున్నారు.
కీలక నేతలు సిద్ధం..
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ ఈ నెల 19న నామినేషన్ వేయనున్నారు. పార్టీ ముఖ్యనేతలు డి.కె.అరుణ, ఈటల రాజేందర్లు 18న దాఖలు చేయనున్నారు. ఏఐసీసీ కార్యదర్శి, మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి 19న, భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి 22న వేయనున్నారు. ఖమ్మం భారాస అభ్యర్థి, సిటింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు 24న, ఆ పార్టీ ముఖ్యనేత, కరీంనగర్ అభ్యర్థి బి.వినోద్కుమార్ 20న దాఖలు చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్