కొలిక్కిరాని కోటిపల్లి వాగు ‘కోట్లా’ట!
వికారాబాద్ జిల్లాలోని కోటిపల్లి వాగు మధ్యతరహా ప్రాజెక్టు ఆధునికీకరణ ప్రక్రియ పనుల ప్రతిపాదనలు కొలిక్కిరావడం లేదు. 2022 నుంచి ప్రతిపాదనల దశలోనే ప్రక్రియ నిలిచిపోతోంది.
2023 ఆగస్టులో రూ.38 కోట్లకు ప్రతిపాదనలు
ఈ ఏడాది మార్చిలో రూ.64 కోట్లకు పెరుగుదల
ప్రాజెక్టు ఆధునికీకరణ అంచనాల తీరు
ఈనాడు, హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలోని కోటిపల్లి వాగు మధ్యతరహా ప్రాజెక్టు ఆధునికీకరణ ప్రక్రియ పనుల ప్రతిపాదనలు కొలిక్కిరావడం లేదు. 2022 నుంచి ప్రతిపాదనల దశలోనే ప్రక్రియ నిలిచిపోతోంది. భారీగా నిధులు అవసరమంటూ క్షేత్రస్థాయి నుంచి అంచనాలు వస్తుండగా.. వాస్తవంగా ఎంత ఖర్చవుతుందో ఇప్పటికీ తేలడం లేదు. ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు చేయాలని నీటిపారుదల శాఖను వికారాబాద్ ఎమ్మెల్యే, శాసనసభాపతి ప్రసాద్కుమార్ గత మార్చి నెలలో కోరడంతో దస్త్రం తిరిగి తెరపైకి వచ్చింది. అయితే, 2022 నుంచి పొంతన లేకుండా అంచనాలు వస్తుండటంతో ప్రాజెక్టు పనులు ముందుకు కదలడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
సగం ఆయకట్టుకూ అందని నీరు
వికారాబాద్ జిల్లా ధరూరు, పెద్దేముల్ మండలాల్లోని 9,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 1962లో కాగ్నా నదిపై కోటిపల్లి వాగు ప్రాజెక్టు నిర్మించారు. రెండు టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉంది. ప్రాజెక్టును నిర్మించిన తర్వాత ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఆధునికీకరించలేదు. కాలువలు, తూములు చాలావరకు శిథిలమయ్యాయి. వాటిని బాగు చేయాల్సి ఉంది. కట్టకు మరమ్మతులు అవసరం. వీటి దుస్థితి కారణంగా ప్రస్తుతం సగం ఆయకట్టుకు కూడా సాగునీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు.
ప్రతిపాదనల మధ్య పొంతనేదీ?
ప్రాజెక్టు ఆధునికీకరణ పనులపై ఇంజినీర్లు పంపుతున్న ప్రతిపాదనల మధ్య పొంతన ఉండటం లేదు.
- 2022 జూన్ 28న అప్పటి ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రాజెక్టు ఆధునికీకరణ చేపట్టాలంటూ నాటి సీఎంకు లేఖ రాశారు. 2011-12లో జైకా నిధులు రూ.24.75 కోట్లకు ప్రతిపాదనలు పంపినా.. మంజూరు కాలేదని పేర్కొన్నారు. డ్యాం, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల ఆధునికీకరణకు నిధులు విడుదల చేయాలని కోరారు.
- 2022 జూన్ 29న సీఈ కార్యాలయం(హైదరాబాద్) రూ.124.95 కోట్లు మంజూరు చేయాలంటూ నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు సమర్పించింది.
- 2022 సెప్టెంబరు 21న ఈ ప్రాజెక్టుపై అధ్యయనానికి నీటిపారుదల శాఖ సలహాదారు, సీడీవో విభాగాల అధికారులను ఈఎన్సీ పంపించారు. పరిశీలనల అనంతరం ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.39.32 కోట్లు చాలని తేల్చారు. ఈ మేరకు పరిపాలన అనుమతులు కోరుతూ ఈఎన్సీ కార్యాలయానికి సీఈ కార్యాలయం లేఖ రాసింది.
- ప్రాజెక్టు ఆధునికీకరణకు భారీగా నిధులు కావాలంటూ క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ప్రతిపాదనలపై 2022లో నాటి ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది.
- 2023 ఆగస్టు 14న 2022-23 ఎస్ఎస్ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్) ప్రకారం రూ.38.54 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నాటి ఈఎన్సీ కార్యాలయం ప్రతిపాదనలు పంపించింది. ఆ దస్త్రం ఆర్థికశాఖ వద్ద పరిశీలనలో ఉండగా.. శాసనసభ ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారింది.
- ఈ ఏడాది మార్చి 6న ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.110 కోట్లు మంజూరు చేయాలంటూ నీటిపారుదల శాఖకు సీఈ కార్యాలయం ప్రతిపాదన పంపింది.
- మార్చి 15న ప్రాజెక్టు పనులకు 2023-24 ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం రూ.64.20 కోట్లకు పరిపాలన అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి ఈఎన్సీ కార్యాలయం దస్త్రం పంపించింది. ఆ ఫైల్ ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఏటా ఇదే తంతు..
కోటిపల్లి వాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు సంబంధించి ఇష్టారీతిన స్ట్రక్చర్లను ప్రతిపాదిస్తుండటం, క్షేత్రస్థాయి ఇంజినీర్లు పంపుతున్న అంచనాలకు రాష్ట్రస్థాయి అధికారులు ఆమోదిస్తున్న మొత్తానికి పొంతన లేకపోవడం చర్చగా మారింది. రూ.వంద కోట్లకు పైగా అంచనాలు పంపితే ఒకసారి రూ.34 కోట్లకు.. మరోసారి రూ.64 కోట్లకే తుది దస్త్రాలు సిద్ధం కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిస్తున్న అంచనా నిధుల్లో పెద్దఎత్తున వ్యత్యాసం ఉంటుండటంపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఏటా అంచనాలు రూపొందించడంతోనే సరిపోతోందని, కనీసం ఈ వర్షాకాలంలోనైనా పనులు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్