గల్ఫ్ కార్మికులకు బోర్డు
గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ
ఏజెంట్ల మోసాల కట్టడికి చర్యలు
కార్మికులు మరణిస్తే.. రూ.5 లక్షల బీమా
సెప్టెంబరు 17లోగా సమస్యలన్నింటికీ పరిష్కారం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ
ఈనాడు, హైదరాబాద్: గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికుల హక్కులు, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దీని కోసం జ్యోతిరావ్ఫులే ప్రజా భవన్లో సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇక్కడ పాస్పోర్ట్ కౌంటరును, కార్మికుల తరఫున ఏ దేశంతోనైనా సంప్రదించే పకడ్బందీ వ్యవస్థను నెలకొల్పుతామన్నారు. హోటల్ తాజ్డెక్కన్లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్మికులకు పలు హామీలిచ్చారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానం రూపొందిస్తున్నామని, త్వరలోనే కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి, వారి సలహాలతో తుదిరూపు ఇస్తామని పేర్కొన్నారు. ఏజెంట్ల మోసాల కట్టడికి చర్యలు తీసుకుంటామని, వారికి చట్టబద్ధత ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు. గల్ఫ్ కార్మికులకు బీమాను కూడా అమలు చేస్తామని, కార్మికుడు మరణించిన సందర్భంలో.. అతడి కుటుంబానికి రూ.5 లక్షల బీమాను అందజేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. సెప్టెంబరు 17లోగా గల్ఫ్ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. కేంద్రంతో మాట్లాడేవాళ్లు ఉండాలి. పార్లమెంటులో మీ గొంతు వినిపించేందుకు నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ను, జీవన్రెడ్డి అన్నను గెలిపించండి. చెప్పిన అన్ని పనులు చేసి పెట్టే బాధ్యత నాది’ అని రేవంత్రెడ్డి తెలిపారు.
కేరళ, ఫిలిప్పీన్స్ విధానాల అధ్యయనం
‘ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువమంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. ముఖ్యంగా జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్లో అత్యధికంగా ఉన్నారు. వీరి లావాదేవీలు నిర్వహించడానికి కొన్ని బ్యాంకులే ప్రత్యేకంగా ఏర్పడ్డాయంటే పరిస్థితి అర్థమవుతుంది. చాలా రోజుల నుంచి గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి వింటున్నాం. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే రాజకీయపార్టీలు స్పందిస్తాయనే అపోహ మీకుంది. కొన్నిసార్లు అది వాస్తవం కూడా. గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల విషయంలో కేరళ రాష్ట్రం, ఫిలిప్పీన్స్ దేశం అమలు చేస్తున్న విధానాలనూ అధ్యయనం చేశాం. కార్మికుల హక్కులు కాపాడేందుకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వమే ఇతర దేశాల వ్యవస్థలను సంప్రదిస్తుంది. ఉద్యోగం ఇచ్చిన సంస్థతో చర్చలు జరుపుతుంది. దీనివల్ల కార్మికుల మనోస్థైర్యం పెరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తాం. గల్ఫ్ వెళ్లే వారికి ఒక వారం రోజులు శిక్షణ అందించేలా చర్యలు చేపడతాం. వారు వెళ్తున్న దేశాలు, అక్కడి యాజమాన్యం, పరిస్థితులపై అవగాహన కల్పిస్తాం. ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయాలను వివరిస్తాం. విదేశాలకు వెళ్లిన వారు తమ స్వస్థలంలో కొనుక్కున్న ఆస్తులకు రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం. వారి తల్లిదండ్రులకు వైద్యం, ఇతరత్రా సాయం చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. చనిపోయిన కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. అండగా ఉంటుంది. మీ సమస్యలను వినడానికి కూడా ఓపిక లేకపోతే.. మీ ఓట్లు అడగడానికి అర్హత లేదనేది నా అభిప్రాయం’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
పార్లమెంటులో ప్రస్తావించే అవకాశమివ్వండి: జీవన్రెడ్డి
నిజామాబాద్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి మాట్లాడుతూ.. ‘స్థానికంగా ఉపాధి పొందలేని వారు గల్ఫ్లో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. భార్యాపిల్లలను, తల్లిదండ్రులను వదిలేసి దేశం కాని దేశానికి వెళ్తుండడం బాధాకరం. గత పదేళ్లలో గల్ఫ్ కార్మికులు చెమటోడ్చి స్వదేశానికి రూ.2 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చారు. కానీ గత భారాస ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మీ సమస్యలను పార్లమెంటులోనూ ప్రస్తావించేలా నాకు అవకాశం కల్పించండి’ అని కోరారు.
సమస్యలు విన్నవించిన కార్మికులు
ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు పలు సమస్యలను ప్రస్తావించారు. ‘గల్ఫ్లోని జైళ్లలో మగ్గుతున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం న్యాయవాదులను ఏర్పాటు చేసి విడిపించేందుకు కృషిచేయాలి. ఏజెంట్ల మోసాలను అరికట్టాలి. మన కార్మికులపై గల్ఫ్లో వివక్ష చూపుతున్నారు. అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి పరిష్కరించాలి. సౌదీ కార్మికులకు రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. అవి రాకుండానే కొందరు చనిపోయారు కూడా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో విన్నవించాం. కానీ ఫలితం రాలేదు. ఆ బకాయిలు ఇప్పించాలి. మహిళా కార్మికులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. దీనిపై దృష్టిపెట్టాలి’ అని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, టీపీసీసీ విదేశీ వ్యవహారాల అధ్యక్షుడు వినోద్, టీపీసీసీ ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్ కన్వీనర్ మంద భీమ్రెడ్డి, గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు నరేశ్రెడ్డి, రవి గౌడ్, సీహెచ్ ప్రవీణ్, నరసింహ, మీర్ అయూబ్ అలీఖాన్, రాజు తదితరులు పాల్గొన్నారు. రూ.5 లక్షల బీమా ప్రకటించినందుకు ధన్యవాదాలు చెబుతూ కార్మిక సంఘాల ప్రతినిధులు సీఎంను సన్మానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
ఐసీయూలో పనిచేయని ఏసీలు
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని అత్యంత కీలక విభాగమైన ఐసీయూలో ఏసీలు పని చేయడంలేదు. గత కొన్ని రోజులుగా పని చేయకున్నా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. రెండు ఐసీయూ వార్డులో కలిపి మొత్తం ఆరు ఏసీలున్నాయి. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలు ఏప్రిల్ 30 నాటికి పంపించాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతివెస్లీ సోమవారం ఆదేశాలు జారీచేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
వివేకా హత్యలో సునీల్
మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. -
ఓయూలో నీటి కొరత.. విద్యుత్తు కోతలు!
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటికొరత.. విద్యుత్తు కోతల అంశం వివాదంగా మారింది. ఈ రెండింటి కారణంగా మే 1 నుంచి విద్యార్థుల వసతి గృహాలను మూసేస్తామంటూ చీఫ్ వార్డెన్ కొమరెల్లి శ్రీనివాస్ మార్చి 18న జారీ చేసిన ఉత్తర్వు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఉత్తర్వును ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. -
తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రకటన
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికి గాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
భానుడు.. భీకరం
రాష్ట్రంలో మంగళవారం నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది. -
రాజకీయ వేడి నడుమ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతత
‘ఓ వైపు మండుతున్న ఎండలు.. మరో వైపు రాజకీయ వేడి.. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వారికి సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను, సాంత్వన చేకూరుస్తాయి’ అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. -
కన్హా శాంతివనంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు
రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు సోమవారం హైదరాబాద్ సమీపంలోని ప్రపంచ ఆధ్యాత్మిక శాంతి కేంద్రం కన్హా శాంతివనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. -
ఇంకా చిక్కని చిరుత
ఎయిర్పోర్ట్ రన్వే మైదానంలో ప్రహరీ దూకిన చిరుతను బంధించడానికి అటవీ శాఖ, విమానాశ్రయంలో భద్రతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం అదనంగా మరో బోనును ఏర్పాటు చేసి, అనుమానిత ప్రాంతాల్లో 10 ట్రాప్ కెమెరాలను బిగించారు. -
తాండూరు కందులకు రికార్డు ధర
వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాలు నాణ్యమైన కందులకు గరిష్ఠంగా రూ.12,705 ధర వచ్చింది. మార్కెట్ చరిత్రలో రికార్డు ధరగా నమోదైందని వ్యవసాయ మార్కెట్ పర్యవేక్షకులు హబీబ్ తెలిపారు. -
కేయూలో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి
కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం సభ్యులపై దాడికి పాల్పడ్డ ఏబీవీపీ, బజరంగ్దళ్ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. -
మే 24న పాలిసెట్
పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్’ మే 24న నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా సమన్వయాధికారిణి, మాసబ్ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్.రాజేశ్వరీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
‘టెయిల్పాండ్’ నీటి తరలింపుపై వివరణ ఇవ్వండి
తమ అనుమతి లేకుండా నాగార్జునసాగర్ దిగువన ఉన్న టెయిల్పాండ్ నుంచి నీటిని తరలించడంపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు ఏపీ నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాసింది. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎక్సైజ్ అధికారుల బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేం హైకోర్టు
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపునిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది.