భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
రైతులకు అందుబాటులోకి సేవలు
మంత్రి తుమ్మల ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం భూసార పరీక్ష కేంద్రాలపై ఆయన తమ నివాసంలో సమీక్ష నిర్వహించారు. 2021 నాటికి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 9 పరీక్ష కేంద్రాలు, ప్రాంతీయ భూసార పరీక్షకేంద్రం ఒకటి, సంచార భూసార పరీక్షా కేంద్రం మరొకటి, మార్కెట్ యార్డుల్లో 14 భూసార పరీక్షా కేంద్రాలు పనిచేశాయని ఆ తర్వాత వాటిని మూసి వేశారని తెలిపారు. ప్రస్తుతం పరీక్ష కేంద్రాలు అందుబాటులోకి తేవడం ద్వారా సాగు ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. వచ్చే వానాకాలంలోపు మినీ సాయిల్ టెస్టింగ్ కిట్లను రైతు వేదికలలో సహకార సంఘాలు, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్