‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు.
పనులను పదేపదే చూపడంతోపాటు పరిశీలన లోపాలు
హైదరాబాద్ సర్కిల్ సీఈకి మెమో ఇచ్చిన నీటిపారుదలశాఖ
‘ఈనాడు’ కథనానికి స్పందన
ఈనాడు, హైదరాబాద్: ‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. కోటిపల్లి వాగు ప్రాజెక్టు ఆధునికీకరణకు సంబంధించి నీటిపారుదల శాఖ నిబంధనలకు అతీతంగా.. అసాధారణ రీతిలో హైదరాబాద్ సర్కిల్ సీఈ అంచనాలను సమర్పించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం’ అని నీటిపారుదల శాఖ పేర్కొంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు కోటిపల్లి వాగు ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించిన అంచనాల ప్రతిపాదనలు పొంతన లేకుండా ఉండటంపై తాజాగా హైదరాబాద్ సీఈ ధర్మాకు మెమో జారీ చేసింది. ఈ నెల 14వ తేదీన ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘కొలిక్కిరాని కోటిపల్లి వాగు ‘కోట్లా’ట!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. దీనిపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని ఈఎన్సీని ఆదేశించినట్టు సమాచారం. స్పందించిన ఈఎన్సీ అనిల్కుమార్ సీఈకి మెమో జారీ చేసినట్లు తెలిసింది.
భిన్న అంచనాలతో చర్చనీయాంశం
కోటిపల్లివాగు వాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల అంచనాల రూపకల్పన ప్రక్రియ 2022 నుంచి కొనసాగుతోంది. పలుమార్లు వివిధ మొత్తాలతో అంచనాలు రూపొందడం వివాదాస్పదమైంది. చివరిగా రూ.38.54 కోట్లలో పూర్తిచేసేందుకు నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో శాసన సభాపతి ప్రసాద్కుమార్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం రెండు టీఎంసీలకు పెంచి, ఇతర మరమ్మతులతో కలిపి రూ.110 కోట్లను మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో చీఫ్ ఇంజినీరు(సీఈ) అంతే మొత్తానికి ప్రతిపాదనలు రూపొందించి అంచనాలను ఈఎన్సీకి సమర్పించారు. అనంతరం పరిశీలన చేపట్టిన ఈఎన్సీ కార్యాలయం రూ.64.20 కోట్లకు అంచనాలను కుదించి ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు సమర్పించడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తగిన సాంకేతిక, క్షేత్రస్థాయి పరిశీలనలు, సర్వేలు లేకుండానే రూ.110 కోట్లకు ప్రతిపాదనలు సమర్పించారంటూ ఈఎన్సీ కార్యాలయం సీఈ, క్షేత్రస్థాయి ఇంజినీర్లను తప్పుపడుతూ తాజాగా మెమో జారీ చేసింది.
మెమోలో ముఖ్యాంశాలిలా..
- సీఈ సమర్పించిన అంచనా వ్యయం నీటిపారుదల శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉంది.
- ప్రతిపాదనల్లో పేర్కొన్న పనుల్లో కొన్నింటిని పలుమార్లు (డూప్లికేట్) చేర్చారు.
- నీటి మట్టం స్థాయులపై సర్వే సహా ఎలాంటి సాంకేతిక అంశాలు పరిగణనలోకి తీసుకోకుండానే జలాశయంలో పూడిక తీతకు సంబంధించిన అంశాలు జోడించారు.
- హెడ్వర్క్స్, ఆప్రాన్ తదితర మరమ్మతులకు సంబంధించి డిజైన్స్ విభాగం ఆమోదంతో పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ సలహాదారు సూచనలు చేయగా, అవేమీ పరిగణనలోకి తీసుకోలేదు.
- కాలువ పొడవునా కిలోమీటరుకు 350 పాట్ హోల్స్కు ప్రతిపాదనలు పంపారు. సరైన ప్రాతిపదిక లేకుండానే ఈ అంశాన్ని పొందుపరిచారు.
- శాఖ నిబంధనలు అనుసరిస్తూ పూర్తిస్థాయిలో సిద్ధమైన అంచనాలను మాత్రమే పంపాలని ఈఎన్సీ కార్యాలయం గతంలో పలుమార్లు ఆదేశించింది. ఆ ఆదేశాలను సీఈ పరిగణనలోకి తీసుకోలేదు.
- క్షేత్రస్థాయితోపాటు కార్యాలయంలోని ఇంజినీర్లు విచక్షణ లేకుండా వ్యవహరించడం ఇబ్బందులు సృష్టించింది. బాధ్యులైన ఇంజినీర్లందరూ వివరణ సమర్పించేలా చర్యలు తీసుకుని మరోసారి ప్రతిపాదనలు సమర్పించాలి’’ అని మెమోలో పేర్కొన్నట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?