‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు.
పనులను పదేపదే చూపడంతోపాటు పరిశీలన లోపాలు
హైదరాబాద్ సర్కిల్ సీఈకి మెమో ఇచ్చిన నీటిపారుదలశాఖ
‘ఈనాడు’ కథనానికి స్పందన
ఈనాడు, హైదరాబాద్: ‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. కోటిపల్లి వాగు ప్రాజెక్టు ఆధునికీకరణకు సంబంధించి నీటిపారుదల శాఖ నిబంధనలకు అతీతంగా.. అసాధారణ రీతిలో హైదరాబాద్ సర్కిల్ సీఈ అంచనాలను సమర్పించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం’ అని నీటిపారుదల శాఖ పేర్కొంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు కోటిపల్లి వాగు ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించిన అంచనాల ప్రతిపాదనలు పొంతన లేకుండా ఉండటంపై తాజాగా హైదరాబాద్ సీఈ ధర్మాకు మెమో జారీ చేసింది. ఈ నెల 14వ తేదీన ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘కొలిక్కిరాని కోటిపల్లి వాగు ‘కోట్లా’ట!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. దీనిపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని ఈఎన్సీని ఆదేశించినట్టు సమాచారం. స్పందించిన ఈఎన్సీ అనిల్కుమార్ సీఈకి మెమో జారీ చేసినట్లు తెలిసింది.
భిన్న అంచనాలతో చర్చనీయాంశం
కోటిపల్లివాగు వాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల అంచనాల రూపకల్పన ప్రక్రియ 2022 నుంచి కొనసాగుతోంది. పలుమార్లు వివిధ మొత్తాలతో అంచనాలు రూపొందడం వివాదాస్పదమైంది. చివరిగా రూ.38.54 కోట్లలో పూర్తిచేసేందుకు నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో శాసన సభాపతి ప్రసాద్కుమార్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం రెండు టీఎంసీలకు పెంచి, ఇతర మరమ్మతులతో కలిపి రూ.110 కోట్లను మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో చీఫ్ ఇంజినీరు(సీఈ) అంతే మొత్తానికి ప్రతిపాదనలు రూపొందించి అంచనాలను ఈఎన్సీకి సమర్పించారు. అనంతరం పరిశీలన చేపట్టిన ఈఎన్సీ కార్యాలయం రూ.64.20 కోట్లకు అంచనాలను కుదించి ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు సమర్పించడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తగిన సాంకేతిక, క్షేత్రస్థాయి పరిశీలనలు, సర్వేలు లేకుండానే రూ.110 కోట్లకు ప్రతిపాదనలు సమర్పించారంటూ ఈఎన్సీ కార్యాలయం సీఈ, క్షేత్రస్థాయి ఇంజినీర్లను తప్పుపడుతూ తాజాగా మెమో జారీ చేసింది.
మెమోలో ముఖ్యాంశాలిలా..
- సీఈ సమర్పించిన అంచనా వ్యయం నీటిపారుదల శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉంది.
- ప్రతిపాదనల్లో పేర్కొన్న పనుల్లో కొన్నింటిని పలుమార్లు (డూప్లికేట్) చేర్చారు.
- నీటి మట్టం స్థాయులపై సర్వే సహా ఎలాంటి సాంకేతిక అంశాలు పరిగణనలోకి తీసుకోకుండానే జలాశయంలో పూడిక తీతకు సంబంధించిన అంశాలు జోడించారు.
- హెడ్వర్క్స్, ఆప్రాన్ తదితర మరమ్మతులకు సంబంధించి డిజైన్స్ విభాగం ఆమోదంతో పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ సలహాదారు సూచనలు చేయగా, అవేమీ పరిగణనలోకి తీసుకోలేదు.
- కాలువ పొడవునా కిలోమీటరుకు 350 పాట్ హోల్స్కు ప్రతిపాదనలు పంపారు. సరైన ప్రాతిపదిక లేకుండానే ఈ అంశాన్ని పొందుపరిచారు.
- శాఖ నిబంధనలు అనుసరిస్తూ పూర్తిస్థాయిలో సిద్ధమైన అంచనాలను మాత్రమే పంపాలని ఈఎన్సీ కార్యాలయం గతంలో పలుమార్లు ఆదేశించింది. ఆ ఆదేశాలను సీఈ పరిగణనలోకి తీసుకోలేదు.
- క్షేత్రస్థాయితోపాటు కార్యాలయంలోని ఇంజినీర్లు విచక్షణ లేకుండా వ్యవహరించడం ఇబ్బందులు సృష్టించింది. బాధ్యులైన ఇంజినీర్లందరూ వివరణ సమర్పించేలా చర్యలు తీసుకుని మరోసారి ప్రతిపాదనలు సమర్పించాలి’’ అని మెమోలో పేర్కొన్నట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్