మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ   ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు.

Published : 28 Apr 2024 03:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ   ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. మే 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.

ప్రథమ సంవత్సరం

మే 24న ద్వితీయ భాష, 25న ఆంగ్లం మొదటి పేపర్‌, 28న మ్యాథ్స్‌-1ఎ,  బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌-1 పరీక్షలు, 29న మ్యాథ్స్‌-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1 పరీక్షలు, 30న ఫిజిక్స్‌-1, ఎకనామిక్స్‌-1 పరీక్షలు, 31న కెమిస్ట్రీ-1, కామర్స్‌-1 పరీక్షలు, జూన్‌ 1న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌-1, బ్రిడ్జికోర్స్‌ మ్యాథ్స్‌-1 పరీక్షలు, జూన్‌ 3న మోడరన్‌ లాంగ్వేజీ-1, జాగ్రఫీ-1 పరీక్షలు జరుగుతాయి.

ద్వితీయ సంవత్సరం

24న ద్వితీయ భాష, 25న ఆంగ్లం పేపర్‌-2, 28న మ్యాథ్స్‌-2, బోటనీ-2, పొలిటికల్‌ సైన్స్‌-2 పరీక్షలు, 29న మ్యాథ్స్‌-2బీ, జువాలజీ-2, హిస్టరీ-2 పరీక్షలు, 30న ఫిజిక్స్‌-2, ఎకనామిక్స్‌-2 పరీక్షలు, 31న కెమిస్ట్రీ-2, కామర్స్‌-2 పరీక్షలు, జూన్‌ 1న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌-2, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్‌-2 పరీక్షలు, జూన్‌ 3న మోడరన్‌ లాంగ్వేజీ-2, జాగ్రఫీ-2 పరీక్షలు జరుగుతాయి. జూన్‌ 4 నుంచి 8వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌బోర్డు తెలిపింది. దీంతో పాటు ఇంటర్‌ ఒకేషనల్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని