తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి.
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత
ఖమ్మం, ములుగు జిల్లాల్లో వడగాలులు
నేడు.. రేపు ఎండల తీవ్రత: ఐఎండీ
ఈనాడు, హైదరాబాద్: తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. ఆదివారం కూడా ఆరు జిల్లాలు పొగలుగక్కాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ఈ జిల్లాలోని చాలా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లోని పలు మండలాల్లో 45 నుంచి 45.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మహబూబాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఎండ తీవ్రత కొనసాగింది. ఖమ్మం, ములుగు జిల్లాల్లో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని, కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది.
వడదెబ్బతో ఇద్దరి మృతి
జన్నారం, నర్సాపూర్ రూరల్, న్యూస్టుడే: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీకి చెందిన మేడిశెట్టి మహేశ్(42), మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నరసయ్య(57) ఆదివారం వడదెబ్బతో మృతి చెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ వ్యవస్థనూ ‘వదల్లేదు!’
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రతి రాజ్యాంగబద్ధ వ్యవస్థపైనా జగన్ దాడికి దిగారు. తన అనుయాయుల్ని, అనుచరగణాన్ని ఉసిగొల్పారు. న్యాయవ్యవస్థపైనా దాడి చేయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై దాడికి దిగారు. కార్యనిర్వాహక వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, అధికారుల్ని భయభ్రాంతుల్ని చేసి చెప్పినట్టల్లా ఆడించారు. -
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అపోలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునీత నర్రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ఫెలోషిప్నకు ఎన్నికయ్యారు. -
ఓటేసేందుకు వైఎస్ భాస్కరరెడ్డికి అనుమతి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏడో నిందితుడైన వై.ఎస్.భాస్కరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. 13న వెళ్లి అదే రోజు తిరిగి హైదరాబాద్ రావాలని స్పష్టం చేసింది. -
ఇదీ సంగతి!
-
గాలివాన బీభత్సం
రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. ఆదివారం మధ్యాహ్నం తరువాత గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురిశాయి. -
విద్యుత్ వినియోగంలో 6వ స్థానంలో తెలంగాణ
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో 9,009 మిలియన్ యూనిట్ల వినియోగంతో తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచింది. -
కాళేశ్వరం పంప్హౌస్ల మునకపై ఆరా
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు పంప్హౌస్లకు సంబంధించిన వివరాలు అందజేయాలని నీటి పారుదల శాఖ ఇంజినీర్లకు విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సూచించారు. -
ఐఐటీల్లోనూ పాలిటెక్నిక్ విద్యార్థులకు సీట్లు?
పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులు నేరుగా ఐఐటీల్లో బీటెక్ రెండో ఏడాదిలో చేరొచ్చా?.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఐఐటీ హైదరాబాద్ సైతం అందుకు కృషి చేస్తున్నాయి. -
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డిలతోపాటు పలు జిల్లాల పరిధిలో ఆదివారం గాలి వాన, పిడుగులు పడిన ఘటనల్లో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరా తీశారు. -
15న సీపీగెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) నోటిఫికేషన్ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. -
ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’ విడుదల
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం ప్రాథమిక ‘కీ’ని ఆదివారం విడుదల చేశారు. రెస్సాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచామని, అభ్యంతరాలుంటే ఈ నెల 14న ఉదయం 10 గంటలలోపు వెబ్సైట్ నుంచే పంపించాలని కన్వీనర్ డీన్కుమార్, కో-కన్వీనర్ విజయకుమార్రెడ్డి తెలిపారు. -
యాదాద్రిపై భక్తజన సందోహం!
దైవదర్శనాలు.. స్వామివారి కల్యాణం.. దీపారాధనలు.. మొక్కులు, వాహన పూజలు.. పుణ్య స్నానాలతో పంచనారసింహులు కొలువైన మహా పుణ్యక్షేత్రం యాదాద్రి ఆదివారం భక్తజన సందోహంగా మారింది. -
వీనులవిందుగా ‘రవీంద్రుని’ గీతాలాపన
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం 11 రాష్ట్రాల్లో ఒకేరోజు, ఒకే సమయంలో.. ఒకేసారి ఒక్కోచోట 100 మంది గాయకుల చొప్పున రవీంద్రనాథ్ ఠాగూర్ విరచిత 20 గీతాలను మధురంగా ఆలపించి ఆయనకు నివాళులర్పించారు. -
ముఖ్యమంత్రి ‘ఆట’విడుపు..!
కొద్దిరోజులుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) మైదానంలో విద్యార్థులతో కలిసి సందడి చేశారు. -
అంగన్వాడీ సిలబస్ మరింత సరళం!
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ కేంద్రాల్లో మరింత నాణ్యమైన పూర్వప్రాథమిక విద్యను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయనుంది. -
సీఎంకు హైకోర్టు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు
న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టు బార్ అసోసియేషన్ ఆదివారం కృతజ్ఞతలు తెలిపింది. -
బ్యాట్ పట్టిన అసదుద్దీన్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం వరకు ప్రచారంలో విరామం లేకుండా గడిపిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. -
అన్ని షిఫ్టుల కార్మికులకు వేతనంతో కూడిన సెలవు నేడు
పార్లమెంటు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ ఉపఎన్నిక నేపథ్యంలో సోమవారం కర్మాగారాల కార్మికుల్లో అన్ని షిఫ్టుల వారికీ వేతనంతో కూడిన సెలవును కార్మికశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
-
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు