నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది.
సలేశ్వరం ప్రాంతంలోరహదారి నిర్మాణం
పెద్దపులులు సంచరించే కోర్ ఏరియాలో పర్యాటక ప్యాకేజీ
ప్రస్తుతం ఏటా మూడ్రోజులే పర్యాటకులకు అనుమతి.. ఇక నుంచి 9 నెలలు
ఈనాడు, హైదరాబాద్: అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. ఇప్పటివరకు ఆ అడవిలోకి ఏడాదిలో మూడు రోజులే భక్తుల్ని, పర్యాటకుల్ని అనుమతిస్తున్నారు. అది కూడా సలేశ్వరం జాతర జరిగే సమయంలోనే. అయితే, ఇన్నాళ్లు కొనసాగిన అటవీ పరిరక్షణ, పెద్దపులుల సంరక్షణపై ప్రతికూల ప్రభావం చూపే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సలేశ్వరం వరకు ప్రకృతి పర్యాటకం(ఎకో టూరిజం) ప్యాకేజీ ప్రవేశపెట్టేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. దీనికి అనుమతి వస్తే.. ఏడాదిలో 9 నెలలపాటు సలేశ్వరం వరకు పర్యాటకుల రాకపోకలు సాగుతాయి. వాహనాల రాకపోకలు, మానవ సంచారంతో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్ల ప్రశాంత జీవనానికి ఆటంకం కలుగుతుంది. అత్యంత సురక్షిత ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.
ఆధ్యాత్మిక క్షేత్రం.. సలేశ్వరం
నాగర్కర్నూల్ జిల్లాలోని సలేశ్వరానికి పర్యావరణపరంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీశైలం రహదారిలో మన్ననూరు తర్వాత ఫర్హాబాద్ గేట్ నుంచి దట్టమైన అడవిలో దాదాపు 30 కి.మీ. దూరం వెళ్తే సలేశ్వరం వస్తుంది. సలేశ్వరం చుట్టుపక్కల ఎనిమిది నుంచి పది వరకు పెద్దపులులు ఉంటాయని అంచనా. దట్టమైన లోయలోని గుహలో లింగమయ్య దర్శనం కోసం పెద్దసంఖ్యలో భక్తులు వస్తారు. గతేడాది దాదాపు లక్షన్నర మంది రాగా, ఈసారి వడగాలుల కారణంగా 40 వేల మంది వరకు వచ్చారు. సలేశ్వరం జాతరకు ఏటా ఏప్రిల్లో మూడురోజుల పాటే అటవీశాఖ అనుమతిస్తోంది. అయితే, తాజాగా ప్రకృతి పర్యాటకం పేరుతో వానాకాలంలో మూడు నెలలు మినహా తొమ్మిది నెలలపాటు పర్యాటకులను అనుమతించే ప్రక్రియ మొదలుపెట్టింది. దీనికోసం వాహనాల రాకపోకల నిమిత్తం సలేశ్వరం క్షేత్రం ఉన్న ప్రాంతంలో చెట్లను తొలగించి మట్టి రహదారి నిర్మిస్తున్నారు. జీపు సఫారీతో పాటు.. ట్రెక్కింగ్ సహా మొత్తం ఆరు గంటల వ్యవధితో ప్రత్యేక ప్యాకేజీని అటవీశాఖ రూపొందిస్తోంది. ప్రస్తుతం రోజుకు 50-100 మందినే అనుమతిస్తామని చెబుతోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఆ తర్వాత ఒకవేళ రిసార్టుల వంటివి నిర్మిస్తే పెద్దపులులు, నల్లమల జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.
రాంపూర్ చెంచులతో తీర్మానానికి ప్రతిపాదన
సలేశ్వరం పక్కన రాంపూర్ చెంచుపెంట ఉంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ(డీఎల్సీ)లో సలేశ్వరం ఎకో టూరిజం ప్యాకేజీపై చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనను రాంపూర్ వాసుల ప్రజాభిప్రాయ సేకరణకు రెండు, మూడు రోజుల్లో పంపించనున్నట్లు సమాచారం. బీట్ అధికారి, స్థానిక ప్రజలతో కూడిన ఈడీసీ(ఎకో టూరిజం డెవలప్మెంట్ కమిటీ) ఆమోదం తర్వాత డీఎల్సీకి వస్తుంది. ఆ తర్వాత డీఎల్సీ నుంచి పీసీసీఎఫ్ (ప్రధాన అటవీ సంరక్షణ అధికారి)కి పంపించి.. ఆమోదముద్ర వేయించేలా ప్రణాళిక రూపొందించారు. ఎకో టూరిజంతో స్థానికులకు ఉపాధి లభిస్తుందన్న కారణంతో చెంచుల్ని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు, రాంపూర్తో పాటు మరికొన్ని చెంచుపెంటల్ని కోర్ ఏరియా నుంచి ఇతర ప్రాంతాలకు తరలించే కసరత్తు కూడా అటవీశాఖ చేస్తోందని తెలుస్తోంది.
అనుమతుల విషయం ఏంటి?
అమ్రాబాద్ టైగర్ రిజర్వులోని సలేశ్వరం ప్రాంతంలో పర్యాటకుల్ని అనుమతించాలంటే ఎన్టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) అనుమతి తీసుకోవాలి. నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు నుంచి ఆమోదం పొందాలి. అటవీ ప్రాంతంలో రోడ్డు మార్గం నిర్మిస్తున్న నేపథ్యంలో పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకోవాలి. ఇవేమీ లేకుండానే, ఈ ప్రక్రియను అనుసరించకుండానే అటవీశాఖ ముందుకు వెళ్తోందన్న ఆరోపణలున్నాయి.
జాతర ఒత్తిడి తగ్గించేందుకు..
జాతర సమయంలో లక్షల మందిని మూడ్రోజుల పాటే అనుమతించడం కంటే.. ఎకో టూరిజంతో 9 నెలలు అనుమతించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆ లోయలో ఒకేసారి రెండు వేల మందికి మించి పట్టరు. రద్దీతో గతేడాది ఇద్దరు మరణించారు. ఏపీలో శ్రీశైలం క్షేత్రం సమీపంలో ఇష్టకామేశ్వరి ఆలయ ప్రాంతం పెద్దపులుల కోర్ ఏరియానే. అక్కడ ఎకో టూరిజం ప్యాకేజీ ఉంది. సలేశ్వరంలో జాతర బదులు ఎకో టూరిజమే విధానమే ఉత్తమం.
రోహిత్ గొప్పిడి, డీఎఫ్వో, నాగర్కర్నూల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు