తగ్గిన గనులశాఖ ఆదాయం
రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది.
గతేడాది రూ.7,705 కోట్లు.. ఈసారి రూ.5,439 కోట్లు
నిర్దేశిత లక్ష్యంలో సాధించిన రాబడి 92 శాతం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది. మొత్తంమీద రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రూ.5,916.63 కోట్లతో పోలిస్తే గనులశాఖ 92 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు ఏడాది 2022-23లో ఆదాయ లక్ష్యం రూ.6,399 కోట్లు అయితే ఏకంగా రూ.7,705.54 కోట్ల ఆదాయం వచ్చింది.
బొగ్గు, సున్నపురాయి, గ్రానైట్, బైరటీస్, డోలమైట్, క్వార్ట్జ్, లేటరైట్, మొరం సహా 19 రకాలకు పైగా ఖనిజాలు రాష్ట్రంలో ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఈ ఏడాది గనులశాఖ పనితీరుపై సీఎం రేవంత్రెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించారు. అక్కడ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మొత్తం ఆదాయంలో 57.12 శాతం బొగ్గు, లైమ్స్టోన్, మాంగనీస్, స్టోయింగ్ శాండ్ వంటి పెద్ద ఖనిజాల ద్వారా వచ్చింది. వీటిలో బొగ్గు ఆదాయం రూ.2900 కోట్లు, మిగిలినవి రూ.212.65 కోట్లు కలిపి రూ.3112.65 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం రూ.3,166.13 కోట్లలో 98 శాతం సాధించినట్లయింది. మిగిలిన చిన్న ఖనిజాల ద్వారా రూ.1,395.50 కోట్లు వస్తాయని అంచనా వేయగా... రూ.1,653.70 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విషయంలో గనులశాఖ లక్ష్యాన్ని మించి 119 శాతం ఫలితాన్ని సాధించింది.
పెరగని ఇసుక రాబడి...
ఇసుక ఆదాయ లక్ష్యం రూ.1,355 కోట్లు కాగా వచ్చింది రూ.673.55 కోట్లు. అంటే లక్ష్యసాధన 50 శాతం మాత్రమే. 2022-23లో ఇసుకతో రూ.1,564.20 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశిస్తే రూ.757.32 కోట్ల ఆదాయం వచ్చింది. ఇసుక అక్రమాలను నియంత్రించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కొద్దిరోజుల పాటు అధికారులు హడావుడి చేసినా... ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత చూస్తే ఆశించిన మేర ఆదాయం రాలేదు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేది తెలంగాణలోనే. అయితే నదులు, వాగుల్లో ఇసుక అక్రమ తరలింపు కొనసాగుతుండటం, మరోవైపు భవన నిర్మాణాల జోరు తగ్గడం, హైదరాబాద్ చుట్టుపక్కల రాతి ఇసుక క్వారీలు..వంటి అంశాలు ఇసుక ఆదాయంపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
నెలాఖరుకు నిండనున్న శ్రీశైలం
కృష్ణా, గోదావరి నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లో అటు ఆలమట్టి, ఇటు తుంగభద్ర నుంచి నీటి విడుదల పెరగడంతో ఈ నెలాఖరుకు శ్రీశైలం నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కాగితాలు దాటని ఆదేశాలు.. ముంపు ముప్పులోనే పట్టణాలు
గత ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో 193 కాలనీలు నీట మునిగాయి.. వేల సంఖ్యలో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.. నీట మునిగిన కాలనీల నుంచి నాలుగైదు వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
మనబడికి సౌరకాంతులేవీ?
‘మనబడి’ పథకం కింద పాఠశాల భవనాలపై సౌరఫలకాల ఏర్పాటు అర్ధంతరంగా నిలిచిపోయింది. ముందుగా పెట్టుకున్న లక్ష్యంలో మూడో వంతు పనులు కాగానే నిధుల్లేవని పనులు ఆపేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?