అంబానీ ఇంట పెళ్లికి కరీంనగర్‌ ఫిలిగ్రీ ఉత్పత్తులు

దేశంలోనే అరుదైన కళల్లో కరీంనగర్‌ ఫిలిగ్రీ ఒకటి. వెండి తీగతో కళాకారులు ఆవిష్కరించే అద్భుతమైన ఉత్పత్తులు జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాయి. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ, నీతా దంపతుల కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం సందర్భంగా ఫిలిగ్రీ మరోసారి చర్చనీయాంశమైంది.

Published : 23 May 2024 05:17 IST

నగల పెట్టె

దేశంలోనే అరుదైన కళల్లో కరీంనగర్‌ ఫిలిగ్రీ ఒకటి. వెండి తీగతో కళాకారులు ఆవిష్కరించే అద్భుతమైన ఉత్పత్తులు జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాయి. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ, నీతా దంపతుల కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం సందర్భంగా ఫిలిగ్రీ మరోసారి చర్చనీయాంశమైంది. ముకేశ్‌ దంపతులు దేశవ్యాప్తంగా ఉన్న చేనేత హస్తకళా రూపాలను దేశ విదేశాలకు చెందిన అతిథులకు బహుమతులుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో దాదాపు 400 వస్తువులకు ఆర్డర్‌ చేసినట్లు కరీంనగర్‌ ఫిలిగ్రీ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు ఎర్రోజు అశోక్, కార్యదర్శి గద్దె అశోక్‌కుమార్‌లు తెలిపారు. జులైలో ఈ పెళ్లి జరగనుంది. జ్యుయలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్‌ బౌల్స్, తదితర వస్తువులకు ఆర్డర్‌ ఇచ్చారు. గతేడాది జరిగిన జీ-20 సదస్సులో వివిధ దేశాల అధ్యక్షులు కోటుకు అలంకరించుకునేందుకు అశోకచక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి కళాకారులే తయారు చేసి పంపించారు. 

కళాకారులు తయారు చేసిన ప్లేటు 

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని