నేత పేరిట మేత
తెలంగాణలో పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యార్థులకు ఏకరూపదుస్తు(యూనిఫాం)ల తయారీకి చేనేతకు బదులు పవర్లూమ్ వస్త్రాలను సరఫరాచేసి లబ్ధి పొందాలని కొన్ని చేనేత సహకార సంఘాలు యత్నించినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
చేనేతకు బదులు పవర్లూమ్లు
యూనిఫాం వస్త్రాల తయారీలో కొన్ని సొసైటీల నిర్వాకం
మూడురెట్ల లాభార్జనకు మోసాలు
తనిఖీల్లో గుర్తింపు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యార్థులకు ఏకరూపదుస్తు(యూనిఫాం)ల తయారీకి చేనేతకు బదులు పవర్లూమ్ వస్త్రాలను సరఫరాచేసి లబ్ధి పొందాలని కొన్ని చేనేత సహకార సంఘాలు యత్నించినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. చేనేత శాఖ అధికారులు ఆయా సంఘాల వద్ద గల నిల్వలను ప్రయోగశాలలో తనిఖీ చేయించగా... అసలు గుట్టు రట్టయింది. దీంతో వాటిపై చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఏటా రాష్ట్ర విద్యా, సంక్షేమ శాఖలు తమ పరిధిలోని విద్యార్థులకు రూ.160 కోట్ల విలువైన ఏకరూప దుస్తులను రాష్ట్ర చేనేత సహకార సంస్థ(టెస్కో) ద్వారా తయారు చేయిస్తున్నాయి. టెస్కో అధికారులు చేనేత సంఘాలకు ఆర్డర్లు ఇచ్చి వీటిని తయారు చేయిస్తారు. నూలును వస్త్రాలుగా మార్చి సంఘాలు మీటర్ల లెక్కన టెస్కోకు సరఫరా చేస్తారు. అధికారులు వాటిని దుస్తులుగా కుట్టించి విద్యార్థులకు అందజేస్తారు. ఇందుకు చేనేత వస్త్రాలను మాత్రమే వినియోగించాలి. ఈ ఏడాది సంఘాలకు ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఉన్నతాధికారులు వస్త్రాల నాణ్యతను పరిశీలించాలని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. కొన్ని చోట్ల వస్త్రాలు నాణ్యంగా లేకపోవడం, పరిశీలిస్తుండగానే చిరిగిపోవడంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో ఉన్నతాధికారులు జిల్లాలవారీగా వస్త్రాల నమూనాలను తెప్పించి వాటిని బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. అక్కడి శాస్త్రవేత్తలు వాటిని పరిశీలించగా విస్మయకర అంశాలు వెలుగుచూశాయి.
17 సొసైటీల్లో 10 పవర్లూమే
మొత్తం 17 సొసైటీల నుంచి వచ్చిన వస్త్రాల నమూనాలను పరిశీలించగా అందులో 10 సొసైటీలవి పవర్లూమ్ వస్త్రాలే అని తేలింది. పవర్లూమ్ వస్త్రాలపై డిజైన్ ప్రింట్లు వేసి సరఫరా చేశారని గుర్తించారు. చేనేత వస్త్రాలు నాణ్యంగా ఉంటాయి. వాటిని సాగదీయడానికి అవకాశం ఉండదు. కానీ, సొసైటీలు ఇచ్చిన నమూనా వస్త్రాలను సాగదీసినట్లు తేలింది.
చేనేత శాఖ విచారణ..
బెంగళూరు ప్రయోగశాల తేల్చిన ఫలితాలతో రాష్ట్ర చేనేత శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల తనిఖీలు నిర్వహించింది. అక్రమంగా లాభాలు ఆర్జించేందుకే సొసైటీలు ఇలా చేనేతకు బదులు పవర్లూమ్ను వినియోగించినట్లు గుర్తించింది. ప్రస్తుతం చేనేత శాఖ మీటర్ వస్త్రానికి రూ.101 చెల్లిస్తోంది. అదే పవర్లూమ్ వస్త్రం మీటర్ ధర రూ.37 మాత్రమే. ఇలా చేనేతకు బదులు పవర్లూమ్ వస్త్రాలు అందజేసి మూడొంతుల లాభాలను ఆర్జించేందుకు సొసైటీలు ఈ మోసానికి పాల్పడ్డట్లు తనిఖీల్లో నిర్ధారణ అయింది. ఆయా సొసైటీలపై చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు బెంగళూరు ప్రయోగశాలలో తేలిన ఫలితాలపై తమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో పలు చేనేత సంఘాలు ఏకరూపదుస్తులలోనేగాక ఇతరత్రా వస్త్రాల తయారీలోనూ ఇలా అక్రమాలకు పాల్పడ్డాయనే అనుమానంతో విస్తృతస్థాయి విచారణ జరిపేందుకు సమాయత్తమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు