Heavy rains: తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు.
వడ్లను ముంచెత్తిన అకాల వర్షాలు
పలు జిల్లాల్లో అన్నదాతలకు తీవ్ర నష్టం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లకు చెందిన రైతు పేరాల నిరంజన్కు చెందిన
రెండెకరాల వరి పంట వర్షానికి నేలవాలింది. రూ.30 వేలకు పైగా నష్టమొచ్చిందని ఆయన వాపోతున్నారు
ఈనాడు, మహబూబాబాద్, పెద్దపల్లి - ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి: అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వాన... రాష్ట్రంలోని అనేక కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల కుప్పలను ముంచెత్తింది. కొన్నిచోట్ల ధాన్యం కొట్టుకుపోయింది. అనేకచోట్ల పెద్దఎత్తున తడిసింది. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం కష్టించి పండించిన వడ్లు తమ కళ్ల ముందే వర్షార్పణం కావడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
తూకంలో జాప్యం... టార్పాలిన్లు కప్పేలోపే...
పెద్దపల్లి జిల్లా ధర్మారం, జూలపల్లి, పెద్దపల్లి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. రైతులు సర్దుకుని టార్పాలిన్లు కప్పేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక్కడ కేంద్రాలకు వారం క్రితమే ధాన్యం తెచ్చినప్పటికీ నిర్ణీత తేమ శాతం రాలేదంటూ నిర్వాహకులు తూకం వేయడంలో జాప్యం చేశారని రైతులు వాపోయారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీపురం కొనుగోలు కేంద్రంలో వర్షాలకు 200 క్వింటాళ్ల వడ్లు తడిసిపోయాయి.
రంగు మారుతోంది... మొలకెత్తుతోంది
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. పరదాలు కప్పినా రాశుల కింది నుంచి వరదనీరు వెళ్లడంతో ధాన్యం కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. వరుస వానలతో ధాన్యం తడిసి రంగు మారుతోంది. హనుమకొండ జిల్లాలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు మొలకెత్తాయి. భూపాలపల్లిలో 20%, ములుగులో 30%, వరంగల్ జిల్లా పాకాల ఆయకట్టు పరిధిలో 40% వరకు పంట కోత కోయాల్సిన వరి పొలాలున్నాయి.
పది రోజుల్లో మూడుసార్లు వానలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పది రోజుల్లో మూడుసార్లు వర్షాలు కురిశాయి. జిల్లావ్యాప్తంగా యాసంగిలో 83 వేల ఎకరాల్లో వరి వేశారు. ఇంకా 15 వేలకుపైగా ఎకరాల్లో కోతలు కోయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టుకున్న ధాన్యం వర్షానికి తడిసిపోయింది. జిల్లావ్యాప్తంగా 25 వేల టన్నుల ధాన్యం కల్లాల్లోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
వారం రోజులుగా తడుస్తోంది
వారం రోజుల కిందట వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాం. తేమశాతం తగ్గాలని ఆరబోశాం. వర్షానికి అంతా తడిసిపోయింది. వర్షం కురిసినప్పుడల్లా ధాన్యంపై కవర్లు కప్పుతున్నాం. ఎండ కాసినప్పుడు ఆరబోస్తున్నాం. మరోసారి వర్షం పడితే వడ్లన్నీ మొలకెత్తుతాయనే భయంగా ఉంది.
దోలె పద్మ, మోరంచపల్లి, భూపాలపల్లి మండలం
3 క్వింటాళ్లు కొట్టుకుపోయాయి
నాకున్న 4.5 ఎకరాల్లో వరి వేస్తే 70 క్వింటాళ్ల ధాన్యం వచ్చింది. మూడ్రోజుల కిందట ధర్మారం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. తేమ తగ్గడానికి ఇక్కడే ఆరబోశా. హఠాత్తుగా వాన పడటంతో టార్పాలిన్లు తెచ్చేలోగానే మూడు క్వింటాళ్ల వడ్లు కొట్టుకుపోయాయి. మిగిలింది తడిసిపోయింది. మొత్తం ఎండాలంటే ఎన్ని రోజులు పడుతుందో..
నూనె రాజేశం, ధర్మారం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!