KCR: కేసీఆర్కు కమిషన్ నోటీసు
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం అంశాల్లో తీసుకున్న నిర్ణయాలపై మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నోటీసు జారీచేసింది.
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై 15లోపు సమాధానాలు పంపాలని నిర్దేశం
భద్రాద్రిలో సబ్క్రిటికల్ టెక్నాలజీతో ఏటా రూ.300 కోట్ల నష్టం
ఛత్తీస్గఢ్లో ప్లాంటు నిర్మాణం పూర్తికాకుండానే ఆ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం
మీడియా సమావేశంలో వెల్లడించిన ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి
ఈనాడు - హైదరాబాద్
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం అంశాల్లో తీసుకున్న నిర్ణయాలపై మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నోటీసు జారీచేసింది. ఈ నెల 15లోగా రాతపూర్వకంగా సమాధానాలు పంపాలని నిర్దేశించింది. ఈ విషయాన్ని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి స్వయంగా వెల్లడించారు. సమాధానం ఇచ్చేందుకు జులై నెలాఖరుదాకా సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరినట్లు తెలిపారు. కమిషన్ కార్యాలయంలో మంగళవారం జస్టిస్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడారు. విచారణలో ఇప్పటివరకు గుర్తించిన అంశాలను వివరించారు. ‘‘యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం టెండరు పద్ధతిలో కాకుండా నామినేషన్ విధానంలో చేపట్టడం సహా విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడినట్టు ప్రాథమికంగా గుర్తించాం. ఆయా అంశాల్లో సమగ్ర సమాచారం కోసం ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు 25 మంది అధికారులు, ప్రజాప్రతినిధులకు లేఖలు రాశాం. ఇంధన శాఖలో గత భారాస ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్య కార్యదర్శులు సురేష్ చందా, అర్వింద్కుమార్, ఎస్.కె.జోషి, అజయ్ మిశ్రలతో పాటు ట్రాన్స్కో-జెన్కో మాజీ సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావును విచారించి వివిధ అంశాలపై వివరాలు సేకరించాం. ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ ఉద్యోగి రఘు, ఈ రంగ నిపుణులు వేణుగోపాల్ కూడా కొంత సమాచారం అందించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అమలు చేశాం తప్ప జెన్కోగానీ, ఇతర విద్యుత్ సంస్థలుగానీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. తాను కొద్దికాలం మాత్రమే పనిచేశానని.. ఈ మూడింటి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సురేష్ చందా వివరణ ఇచ్చారు. ఎస్.కె.జోషి, అర్వింద్కుమార్లు మంగళవారం విచారణకు హాజరై కొంత సమాచారం ఇచ్చారు.
తొలుత ఒక జీవో.. తర్వాత మరొకటి
రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందన్న కారణంగా రెండు వేల మెగావాట్లను దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థల వద్ద కొనుగోలు చేసేందుకు తొలుత ఒక జీవో ఇచ్చారని, రెండు నెలల అనంతరం దేశంలో ఎక్కడి నుంచైనా కరెంటు కొనుగోలు చేయవచ్చంటూ ఆ జీవోను మార్చి మరొకటి ఇచ్చారని ఎస్.కె.జోషి కమిషన్కు వివరించారు.
‘అత్యవసరం’లో అనుమానాలు
టెండరు ప్రక్రియ లేకుండా ఒప్పందం ఎందుకు చేసుకున్నారని.. ఆ సమయంలో విధుల్లో ఉన్న అధికారులను ప్రశ్నించాం. కరెంటు కొరత వల్ల అత్యవసరంగా కొనుగోలు చేయాల్సి వచ్చినందున నేరుగా ఒప్పందం చేసుకున్నట్లు వారు చెప్పారు. అప్పటి ప్రభుత్వ నిర్ణయం మేరకు అలా చేసినట్టు చెప్పారు. ఆ దిశగా దస్త్రాలు పరిశీలించగా.. మరో ఆసక్తికర అంశం వెల్లడైంది. ఒప్పందం చేసుకునే సమయంలో ఛత్తీస్గఢ్లో విద్యుత్ కేంద్రం నిర్మాణ దశలో ఉందని తేలింది. చివరికి మూడేళ్ల తర్వాత 2017లో కరెంటు సరఫరా మొదలుపెట్టిన ఆ రాష్ట్రం నాలుగు సంవత్సరాలపాటు కొనసాగించి.. ఆ తర్వాత ఆపేసినట్టు గుర్తించాం. ఈ మొత్తం వ్యవహారంలో ఎంత నష్టం వాటిల్లింది? నిర్ణయం ఎక్కడ జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉంది.
భద్రాద్రి నిర్మాణంపైనా సందేహాలు
భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం విషయంలోనూ అనేక అనుమానాలున్నాయి. దాన్ని సబ్క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాలని అప్పటి భారాస ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బొగ్గు అదనపు కొనుగోలు రూపంలో ఏటా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల నష్టం రావడమే కాకుండా వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం జరుగుతుండగా, భద్రాద్రిని మాత్రం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. సత్వరమే నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో ఆ సాంకేతికత వైపు వెళ్లినట్లు అప్పటి అధికారులు చెప్పారు. కానీ భద్రాద్రి ప్రారంభానికి ముందే కొత్తగూడెంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఒక యూనిట్ నిర్మాణం జరిగినా.. ఆ విషయాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నది ప్రశ్న. మరోవైపు యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని టెండరు ప్రక్రియతో కాకుండా నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. దీనిపై భెల్ మాజీ, ప్రస్తుత సీఎండీల నుంచి వివరణ అడిగాం. ఇప్పటివరకు యాదాద్రిలో విద్యుదుత్పత్తి ప్రారంభం కాలేదు. త్వరలో ప్రారంభిస్తామంటున్నారు. ఇటీవల నేను వెళ్లి పరిశీలిస్తే యాదాద్రి ప్లాంటుకు బొగ్గు తరలించడానికి అవసరమైన రైల్వే లైన్ నిర్మాణం కూడా పూర్తికాలేదని తేలింది’’ అని జస్టిస్ నరసింహారెడ్డి వివరించారు.
ముందే హెచ్చరిస్తూ అర్వింద్కుమార్ లేఖ..
‘ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల రాష్ట్రంపై భారీగా ఆర్థికభారం పడే అవకాశాలున్నాయని అప్పట్లో రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శిగా ఉన్న అర్వింద్కుమార్ 2016 నవంబరులో తెలంగాణ ఈఆర్సీకి లేఖ రాశారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేస్తే డబ్బు ఆదా అవుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత తాను బదిలీ అయ్యానని, ఏం జరిగిందో తనకు తెలియదని అర్వింద్కుమార్ మంగళవారం కమిషన్కు తెలిపారు. ఆయన బదిలీ అయ్యాక ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకోవడానికి దస్త్రాలు పరిశీలిస్తున్నాం.
అర్వింద్కుమార్ లేఖపై ఈఆర్సీ కూడా దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. రెండు రాష్ట్రాలు విద్యుత్ ఒప్పందం చేసుకున్నప్పుడు విక్రయ ధరను నిర్ణయించే అధికారం కేంద్ర రెగ్యులేటరీ కమిషన్కి ఉంటుంది. ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు ఒప్పందం విషయంలో ధర నిర్ణయాధికారం ఆ రాష్ట్ర ఈఆర్సీకే ఇవ్వడానికి అప్పటి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో అధికంగా చెల్లింపులు చేయాల్సి వచ్చినట్టు కమిషన్ దృష్టికి వచ్చింది’ అని జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!