Child Selling: అంగడి సరకులా 60 మంది శిశువుల విక్రయం
పసికందులకు అంగట్లో సరకులా ధర నిర్ణయించి అమ్మేస్తున్న అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టును మేడిపల్లి పోలీసులు రట్టు చేశారు.
దిల్లీ, పుణెల నుంచి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్మకం
స్టింగ్ ఆపరేషన్తో పిల్లల అక్రమ రవాణా గుట్టురట్టు
ముఠాలో 11 మంది అరెస్టు.. పరారీలో ప్రధాన నిందితులు
16 మంది చిన్నారులు శిశువిహార్కు తరలింపు
పాపను తీసుకెళ్లొద్దంటూ రోదిస్తున్న మహిళ
ఈనాడు, హైదరాబాద్: పసికందులకు అంగట్లో సరకులా ధర నిర్ణయించి అమ్మేస్తున్న అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టును మేడిపల్లి పోలీసులు రట్టు చేశారు. దిల్లీ, పుణెల నుంచి చిన్నారుల్ని తీసుకొచ్చి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠాలోని 11 మందిని అరెస్టు చేశారు. వీరు రెండు మూడేళ్లుగా సుమారు 60 మందిని విక్రయించినట్లు తేల్చారు. ప్రస్తుతానికి వారి నుంచి కొనుగోలు చేసిన 16 మందిని గుర్తించారు. సదరు దంపతుల నుంచి ఆయా చిన్నారుల్ని స్వాధీనం చేసుకొని శిశువిహార్కు తరలించేందుకు ప్రయత్నించగా పెంచుకున్న బంధాన్ని విడదీయొద్దంటూ కన్నీటిపర్యంతమవడంతో రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయ ప్రాంగణంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్జోషి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలోని రామకృష్ణానగర్లో ఫస్ట్ఎయిడ్ క్లినిక్ నిర్వహించే శోభారాణి, బోడుప్పల్కు చెందిన హేమలత, షేక్ సలీమ్, ఘట్కేసర్లోని అన్నోజిగూడకు చెందిన తల్లీకుమారులు బండారి పద్మ, హరిహరచేతన్లు ఓ ముఠాగా ఏర్పడి సంతానలేమితో బాధపడే దంపతుల్ని గుర్తిస్తారు. అధిక సంతానం, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులు తమకు తెలుసని, వారు పిల్లల్ని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతారు. వ్యక్తిని బట్టి ఒక్కో చిన్నారికి రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ధర చెబుతారు. ఎవరైనా కొనుగోలుకు అంగీకరిస్తే.. మరో ముఠాకు సమాచారం ఇస్తారు. ఇందులో విజయవాడకు చెందిన బలగం సరోజ, ముదావత్ శారద అలియాస్ షకీలా పఠాన్, పఠాన్ ముంతాజ్, జగన్నాథం అనురాధ, మహబూబ్నగర్కు చెందిన ముదావత్ రాజు, హైదరాబాద్ చర్లపల్లికి చెందిన యాత మమత ఉన్నారు. వీరు దిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణెకు చెందిన కన్నయ్యలను సంప్రదిస్తారు. వీరు తమ నగరాల్లో పిల్లలను సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి అప్పగిస్తారు. అయితే వీరు పేద తల్లిదండ్రుల వద్ద కొనుగోలు చేస్తున్నారా లేక కిడ్నాప్లు చేస్తున్నారా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఒక్కో చిన్నారికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కమీషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ పరారీలో ఉన్నారని, మిగతా 11 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
స్టింగ్ ఆపరేషన్తో బయటపడిందిలా..
శోభారాణి, హేమలత కలిసి చిన్నారుల్ని విక్రయిస్తున్నట్లు పీర్జాదిగూడలోని అక్షరజ్యోతి ఫౌండేషన్ నిర్వాహకులకు, సాయికుమార్ అనే యువకుడికి తెలిసింది. దీంతో మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి సాయంతో స్టింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. తమకు పిల్లలు కావాలని శోభారాణిని సంప్రదించగా బాబుకు రూ.6 లక్షలు, పాపకు రూ.4.5 లక్షలు అవుతుందని చెప్పింది. అడ్వాన్సు కింద రూ.10 వేలు తీసుకొని బిడ్డ కుదిరిన తరువాత చెబుతానని పంపింది. ఈ నెల 21న ఫోన్ చేసి పాప ఉందని, బుధవారం రావాలని సమాచారం ఇచ్చింది. ఈ మేరకు ఫౌండేషన్ నిర్వాహకులు ఆ రోజున వెళ్లగా శోభారాణి, హేమలత ఓ పాపను చూపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు చేరుకుని ఇద్దరినీ అరెస్టు చేశారు. చిన్నారిని స్వాధీనం చేసుకొని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని విచారించగా.. ఒక్కో లింకు బయటపడ్డాయి.
చిన్నారుల్ని కొన్నవారిపైనా కేసులు
అక్రమంగా చిన్నారుల్ని కొన్నట్లు తేలిన 16 మందిపైనా కేసులు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు. 11 మందిని అరెస్టు చేశారు. ఈ 16 మందిలో తెలంగాణకు చెందిన వారు 9 మంది, ఏపీకి చెందినవారు ఏడుగురు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.