Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ అనుమతుల్లోనే కుట్రకోణం
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్కు అనుమతి ప్రక్రియలో అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది.
ప్రభాకర్రావుకు జారీ అధికారం కట్టబెట్టడంలో గూడుపుఠాణి
ఇండియన్ టెలీగ్రాఫ్ చట్ట ఉల్లంఘనపై ఆరా
ఈనాడు, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్కు అనుమతి ప్రక్రియలో అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్కు అనుమతులు జారీ చేసే అధికారాన్ని అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) ఓఎస్డీ ప్రభాకర్రావుకు అప్పగించినట్లు అధికారులు గుర్తించారని సమాచారం. ఆనాటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోనే ఇది జరిగిందని దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. ఇండియన్ టెలీగ్రాఫ్ చట్టం రూల్ 419(ఎ) సెక్షన్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్కు అనుమతిచ్చే అధికారం రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఉంటుంది. అయితే ప్రజాభద్రతకు సంబంధించి ఆపరేషన్లు నిర్వహించినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో మాత్రం హోంశాఖ అనుమతి పొందే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. సంయుక్త కార్యదర్శి(ఐజీ) లేదా ఆపై స్థాయి ఉన్నతాధికారి ట్యాపింగ్కు అనుమతి ఇవ్వొచ్చని టెలీగ్రాఫ్ చట్టం చెబుతోంది. ఈమేరకు సర్వీస్ ప్రొవైడర్కు లేఖ రాసి అనుమతి తీసుకోవచ్చు. అయితే ఇది తాత్కాలిక అనుమతి మాత్రమే. ఇలా తీసుకున్న అనుమతి ద్వారా మూడు రోజులపాటు ట్యాపింగ్ చేయొచ్చు. అనివార్య పరిస్థితుల్లో గరిష్ఠంగా వారం రోజులు మాత్రమే కొనసాగించొచ్చు. ఆ తర్వాత తప్పనిసరిగా హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకొని కొనసాగించాలి. అనుమతి రాకపోతే సర్వీస్ ప్రొవైడర్లు ట్యాపింగ్ ప్రక్రియను నిలిపివేయాలి.
ప్రభాకర్రావుకు అధికారం ఇచ్చిందెవరు?
ఐజీగా ఉద్యోగ విరమణ పొంది ఓఎస్డీగా కొనసాగిన ప్రభాకర్రావుకు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అనుమతి ఇచ్చే అధికారం ఎవరు.. ఎలా కట్టబెట్టారన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం. ఇది టెలీగ్రాఫ్ చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందిన వారి సేవల్ని వినియోగించుకోవాల్సి వస్తే మరొకరి పర్యవేక్షణలోనే విధులు నిర్వర్తించే బాధ్యత అప్పగించాల్సి ఉంటుంది. ప్రభాకర్రావు విషయంలో అలా జరగలేదు. ఎస్ఐబీనే కాకుండా కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగంలోనూ చీఫ్ బాధ్యతల్నీ ఆయనకు అప్పగించారు. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఉల్లంఘన జరిగితే ఆయనను బాధ్యుడిని చేసే అవకాశం ఎలా ఉంటుందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాకర్రావుకు ఈ అధికారాన్ని అప్పగించడంలోనే గూడుపుఠాణి దాగి ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తుండటం తాజా అంశం. ఇదంతా ఎలా జరిగిందనేది తేలితే ట్యాపింగ్ కుట్ర కోణంలోని మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావచ్చు. ప్రభాకర్రావును విచారించడం ద్వారానే ఇందులో స్పష్టత వస్తుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఎస్ఐబీలో డీఐజీగా అడుగుపెట్టి..
వాస్తవానికి డీఐజీగా ఎస్ఐబీలో అడుగుపెట్టిన ప్రభాకర్రావు అక్కడే ఐజీగా పదోన్నతి పొంది 2020 జూన్లో రిటైరయ్యారు. అయితే ప్రభుత్వం ఆయన్ని పునర్నియమించి రెండేళ్లపాటు ఎస్ఐబీ ఓఎస్డీగా బాధ్యతలు అప్పగించింది. అంతటితో ఆగకుండా అదే ఏడాది అక్టోబరులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్చంద్ ఉద్యోగ విరమణ పొందడంతో పూర్తి అదనపు బాధ్యతల్ని సైతం ప్రభాకర్రావుకు అప్పగించింది. ఈ నియామకం అప్పట్లో సంచలనం కలిగించింది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనూ కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల్ని అలా రిటైరైన వారికి అప్పగించిన దాఖలాలు లేవు. 2021 ఆగస్టులో అదనపు డీజీపీ అనిల్కుమార్కు ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించేవరకు ప్రభాకర్రావు ఆ పోస్టులో కొనసాగారు. భారాస ప్రభుత్వం మారే వరకు ఎస్ఐబీ ఓఎస్డీగా కొనసాగారు. నాటి ప్రభుత్వం ఆయనకు అంతటి ప్రాధాన్యం ఇవ్వడంపై అప్పట్లోనే విమర్శలు చెలరేగాయి. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి అప్పట్లోనే ప్రభాకర్రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. ఎస్ఐబీ కేంద్రంగా ఆయన నేతృత్వంలో రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని బహిరంగ వేదికలపైనే ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు