Engineering Colleges: స్లైడింగ్ దందాకు కళ్లెం పడుతుందా?
ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ అవుతాయన్నది కాగితాలకే పరిమితమవుతోంది. వాటిని కూడా విద్యాశాఖ భర్తీ చేయకుండా కళాశాలల యాజమాన్యాల చేతుల్లో పెడుతోంది.
యాజమాన్యాల చేతుల్లోనే.. బ్రాంచి మార్పిడి వ్యవహారం
బి కేటగిరీ సీట్ల విషయంలోనూ వాటిదే ఇష్టారాజ్యం
ఏళ్లుగా పట్టించుకోని విద్యాశాఖ
ఈనాడు, హైదరాబాద్: ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ అవుతాయన్నది కాగితాలకే పరిమితమవుతోంది. వాటిని కూడా విద్యాశాఖ భర్తీ చేయకుండా కళాశాలల యాజమాన్యాల చేతుల్లో పెడుతోంది. రెండు లేదా మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత సీటు సాధించిన కళాశాలలోనే ఒక బ్రాంచి నుంచి మరో బ్రాంచికి మారేందుకు నిర్వహించే అంతర్గత స్లైడింగ్ను ప్రవేశాల కన్వీనర్ చేపట్టేందుకు అవకాశమున్నా విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా విద్యార్థులు పలు రకాలుగా నష్టపోతున్నారు.
వారికి లబ్ధి చేకూర్చేందుకే ఉదాసీనతా?
రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 70 శాతం కన్వీనర్, 30% యాజమాన్యం(బి కేటగిరీ) భర్తీచేసుకునేందుకు వీలుగా బీటెక్సీట్లు ఉంటాయి. ఆ ప్రకారం ఒక బ్రాంచిలో ఒక సెక్షన్కు 60 సీట్లుంటే 42 సీట్లు కన్వీనర్, 18 సీట్లు యాజమాన్యం భర్తీ చేసుకుంటాయి.
ప్రవేశాల కమిటీకి కన్వీనర్గా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వ్యవహరిస్తారు. రెండు లేదా మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత విద్యార్థులకు ఒక బ్రాంచి నుంచి మరో బ్రాంచికి మారేందుకు అంతర్గత స్లైడింగ్ను నిర్వహిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రక్రియను ఆయా కళాశాలల యాజమాన్యాలకే రాష్ట్ర సర్కారు వదిలేసింది. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు వచ్చిన వారు ఇక్కడ సీట్లను వదిలేస్తుంటారు. దాంతో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ సీట్లు సైతం పలు కళాశాలల్లో ఖాళీగా ఉంటాయి. అప్పటికే ఆ కళాశాలల్లో ఇతర బ్రాంచిలలో చేరిన వారు బ్రాంచి మారదామంటే చిక్కొచ్చిపడుతోంది. అలా మారితే వారికి ఫీజు రీఇంబర్స్మెంట్ వర్తించదు. దాంతో అనేక మంది మానుకుంటున్నారు. మరికొందరు అప్పోసొప్పో చేసి బ్రాంచి మారుతున్నారు. మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు రూ.6 లక్షల నుంచి రూ.14 లక్షలకు అమ్ముకుంటున్నాయి. ఏటా సుమారు 5 వేల మంది వరకు నష్టపోతున్నారు. యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చడానికే విద్యాశాఖ కొన్నేళ్లుగా ఈ సమస్యపై దృష్టి పెట్టడం లేద]న్న ఆరోపణలున్నాయి. గత రెండేళ్లుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు హడావుడి చేస్తున్నారు తప్ప చివరకు యాజమాన్యాలకే అప్పగిస్తున్నారు. కన్వీనర్ ఆధ్వర్యంలో చేపట్టాలంటే ప్రభుత్వ ఆమోదం కోసం దస్త్రం పంపాలని, ఒకవేళ పంపితే దానిపై నిర్ణయం వెలువడకపోతే సీట్ల భర్తీ ప్రక్రియ మరింత జాప్యమవుతుందన్న భావనతోనే గత రెండేళ్లుగా ఈ సమస్య పరిష్కారం కాలేదని తెలుస్తోంది.
ఈ సారైనా....
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ టైంటేబుల్ను ఖరారు చేసేందుకు శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఎప్సెట్ ప్రవేశాల కమిటీ సమావేశం జరగనుంది. విద్యాశాఖ కమిషనర్గా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కూడా సమావేశంలో పాల్గొననున్నారు. కన్వీనర్ ఆధ్వర్యంలో అంతర్గత స్లైడింగ్ చేపట్టే అంశంపై కూడా చర్చ జరగనుంది. ఈసారైనా విద్యార్థులకు న్యాయం జరుగుతుందా? లేదా? అన్నది చూడాలి. యాజమాన్య కోటా సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకోకుండా కట్టడి చేసే చర్యలు తీసుకుంటామని ఎప్సెట్ ఫలితాల సందర్భంగా బుర్రా వెంకటేశం వెల్లడించారు. దానిపై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు మాత్రం యాజమాన్య కోటా సీట్లను కళాశాలలే భర్తీ చేసుకోవాలని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులున్నాయని, ఇతర న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని చెబుతూ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి