Tummala: ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ
ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న తెలంగాణను బియ్యం ఎగుమతుల్లోనూ త్వరలో మొదటిస్థానానికి చేరుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
అన్ని విధాలా ప్రభుత్వ ప్రోత్సాహం
వ్యవసాయ మంత్రి తుమ్మల
ఏటేటా పెరగనున్న సాగు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ప్రారంభం
ఉత్తమ బాస్మతి బియ్యం ఎగుమతులకు గాను ఐసీఐ అందించిన పురస్కారంతో
మంత్రులు ఉత్తమ్, తుమ్మల. చిత్రంలో ఐసీఐ అధ్యక్షుడు జెరెమీ జివింగర్
ఈనాడు, హైదరాబాద్: ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న తెలంగాణను బియ్యం ఎగుమతుల్లోనూ త్వరలో మొదటిస్థానానికి చేరుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో పండే తెలంగాణ సోనా తదితర రకాలకు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం ఉందని, అందుకు అనుగుణంగా మరిన్ని రకాలను రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ఎగుమతుల ద్వారా రైతులు అన్నివిధాలా లబ్ధి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై వెంటనే నిషేధాన్ని ఎత్తివేసి ప్రోత్సాహం అందించాలని కోరారు. హైదరాబాద్లో రెండు రోజుల ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సును శుక్రవారం తుమ్మల, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ‘తెలంగాణ సాగులో అద్భుతాలు సాధిస్తోంది. గత ఏడాది రాష్ట్రంలోని 1.2 కోట్ల ఎకరాల్లో వరి సాగవగా.. 26 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి జరిగింది. బియ్యం ఎగుమతుల్లో తెలంగాణ ప్రధాన భాగస్వామిగా ఉంది. రాష్ట్రంలో దాదాపు 220 రకాల ధాన్యం ఉత్పత్తి జరుగుతోంది. ధాన్యం ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఇటీవలే క్వింటాలు ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించాం. ఈ సదస్సు ఎగుమతులకు విస్తృతమైన మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రపంచస్థాయిలోని కీలకమైన వర్తకులతో స్థానిక వ్యాపారులు కలిసి పని చేసే అవకాశం లభిస్తుంది’ అని తుమ్మల తెలిపారు.
వ్యవసాయానికి అన్ని విధాలా మద్దతు
రాష్ట్రంలో రైతు అనుకూల కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, వారి ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు వ్యవసాయానికి అన్ని విధాలుగా మద్దతు అందిస్తున్నామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తన ప్రసంగంలో తెలిపారు. దేశంలోనే అత్యధికంగా అన్నదాతలు పండించిన ధాన్యాన్ని సర్కార్ కనీస మద్దతు ధరకు సేకరిస్తోందని పేర్కొన్నారు. ‘తెలంగాణ వరి ఉత్పత్తి థాయ్లాండ్తో సమానం. రాష్ట్రంలో మూడువేల అత్యాధునిక రైస్ మిల్లులు ఉన్నాయి. రాష్ట్రంలో నీటిపారుదల వనరులు పెరుగుతుండడంతో వరిసాగు ఏటేటా వృద్ధి చెందుతోంది. తెలంగాణ ప్రభుత్వం బియ్యం ఎగుమతిపై చర్చలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఉన్న కొన్ని పరిమితులపై కేంద్రాన్ని ఒప్పించేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణలో ఆధునిక మిల్లింగ్ పద్ధతుల ద్వారా నాణ్యమైన బియ్యం ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని ఉత్తమ్ చెప్పారు. రాష్ట్ర ప్రణాళికామండలి ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. అన్నదాతలు ప్రత్యక్ష లాభాలను పెంపొందించేందుకు ఇజ్రాయెల్లో నెలకొల్పిన ఉత్తమ విధానాలపై చర్చించేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, వ్యాపారుల సహకారంతో కమోడిటీ బోర్డులను ప్రవేశపెట్టాలని కేంద్రానికి సూచించారు. వరిసాగును సులభతరం చేసే మార్గాలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అంతర్జాతీయ ఆహారధాన్యాల సంస్థ (ఐసీఐ) అధ్యక్షుడు జెరెమీ జివింగర్, ఐసీఐ సలహాదారు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, జాతీయ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య అధ్యక్షుడు ప్రేమ్గార్గ్, జాతీయ బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు, ఐసీఏఆర్ అనుబంధ ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు, రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు, ఆదర్శరైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచ బియ్యం మార్కెట్, హైబ్రిడ్ బియ్యం పరిశ్రమ, ఆహారభద్రతపై బియ్యం విధానాల ప్రభావం తదితర అంశాలపై తొలిరోజు చర్చాగోష్ఠులు జరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శనను మంత్రులు ప్రారంభించారు. వివిధ స్టాళ్లను వారు సందర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ