Qatar Airways: కుదుపుల బారిన మరో విమానం.. 12 మందికి గాయాలు!
దోహా నుంచి డబ్లిన్ వెళ్తోన్న ఖతర్ ఎయిర్వేస్ (Qatar Airways) విమానం ఆకాశంలో భారీ కుదుపులకు లోనైన ఘటనలో 12 మంది గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: సింగపూర్ ఎయిర్లైన్స్ ఘటన మరువక ముందే అలాంటిదే మరో ప్రమాదం నమోదైంది. ఖతర్లోని దోహా నుంచి ఐర్లాండ్లోని డబ్లిన్ వెళ్తోన్న ఖతర్ ఎయిర్వేస్ (Qatar Airways) విమానం ఆకాశంలో భారీ కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 12 మంది గాయపడ్డారు. డబ్లిన్ విమానాశ్రయం ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా ధ్రువీకరించింది. ఖతర్ ఎయిర్వేస్ సైతం.. కొద్దిమంది ప్రయాణికులు, సిబ్బందికి విమానంలో స్వల్ప గాయాలయ్యాయని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ఒక ప్రకటనలో తెలిపింది.
ఖతర్ ఎయిర్వేస్కు చెందిన విమానం (క్యూఆర్017) ఆదివారం దోహా నుంచి డబ్లిన్కు బయల్దేరింది. అయితే, మార్గమధ్యలో తుర్కియే గగనతలంపై ఉండగా తీవ్ర కుదుపులకు లోనైంది. అయితే, షెడ్యూల్ ప్రకారమే డబ్లిన్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అప్పటికే పైలట్లు సంబంధిత సమాచారాన్ని చేరవేయడంతో.. విమానాశ్రయంలో పోలీస్, అగ్నిమాపక విభాగం, సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మొత్తం ఆరుగురు ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది గాయపడినట్లు ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు, సిబ్బందికి పూర్తి సాయం అందజేస్తున్నట్లు తెలిపారు.
బస్సుల వలే విమానాల్లో ఆ కుదుపులెందుకు..!
మే 21న సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవడంతో ఓ వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. మరో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న ఎస్క్యూ321 విమానంలో ఈ ఘటన జరిగినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉక్రెయిన్ సమగ్రతను గౌరవించాలి
ఉక్రెయిన్లో శాంతిస్థాపన కోసం ప్రపంచ దేశాలు తాజాగా పిలుపునిచ్చాయి. ఆ దేశ ప్రాదేశిక సమగ్రతే.. రష్యా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందానికి ప్రాతిపదికగా ఉండాలని పేర్కొన్నాయి. -
అమెరికాలో కాల్పుల మోత.. ఇద్దరి మృతి
అమెరికాలోని టెక్సాక్లో జరిగిన ఓ వేడుకలో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరికొంత మంది గాయపడ్డారు. -
రష్యా నిర్బంధ కేంద్రంలో సిబ్బందిని బందీలుగా చేసుకొని కలకలం
రష్యాలో రోస్తోవ్ ప్రాంతంలోని ఓ నిర్బంధ కేంద్రంలో ఆదివారం తీవ్ర కలకలం చెలరేగింది. అక్కడి కొంతమంది ఖైదీలు.. ఇద్దరు సిబ్బందితోపాటు కొందరు సహచర ఖైదీలను తమ బందీలుగా చేసుకొని భయభ్రాంతులకు గురిచేశారు. -
తుది అంకానికి హజ్ యాత్ర
సౌదీ అరేబియాలో తీవ్రమైన వేసవితాపం నడుమ ఆదివారం ముస్లిం యాత్రికుల హజ్ యాత్ర తుది అంకానికి చేరుకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈదుల్ అధా (బక్రీద్) వేడుకలు మొదలయ్యాయి. -
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
భారత్తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని కెనడా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. జీ7 దేశాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
దక్షిణ గాజాలో పగటి పూట కాల్పుల విరామం
గాజాపై గత కొన్ని రోజులుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ గాజాలోని రఫాలో పగటిపూట యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించింది. -
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే.. దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’
-
ధార్ గ్యాంగ్.. మళ్లీ వచ్చేసింది
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/06/24)