Zelenskyy: మిలిటరీ వేడుకపై దాడిలో 19మంది సైనికులు మృతి.. విచారణకు ఉక్రెయిన్ ఆదేశం
ఓ అవార్డుల వేడుకపై రష్యా జరిపిన దాడుల్లో తమ 19 మంది సైనికులు మృతి చెందిన ఘటనపై ఉక్రెయిన్ దర్యాప్తు ప్రారంభించింది.
కీవ్: ఉక్రెయిన్ (Ukraine)లో ఇటీవల ఓ మిలిటరీ అవార్డుల వేడుకపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 19 మంది సైనికులు మృతి చెందడం తీవ్ర కలవరం రేపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy) ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే, ఈ ఘటనను నివారించదగ్గ విషాదంగా పేర్కొన్నారు. జపోరిజియాలో యుద్ధక్షేత్రానికి సమీపంలో ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించడంపై స్థానికంగా పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రక్షణశాఖ మంత్రి రుస్తెం ఉమెరోవ్ ఆదేశాల మేరకు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది.
ఇటీవల జపోరిజియాలో ‘రాకెట్ ఫోర్సెస్, ఆర్టిలరీ డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవార్డుల వేడుకలో జకార్పట్టియాలోని 128వ ప్రత్యేక పర్వత ప్రాంత దాడుల బ్రిగేడ్ సైనికులు పాల్గొన్నారు. పెద్దఎత్తున మిలిటరీ సిబ్బందితో కిటకిటలాడిన ఈ కార్యక్రమంపై రష్యా క్షిపణి దాడి జరిపింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు నివారించేందుకుగానూ ఈ వ్యవహారంపై ఉక్రెయిన్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. సరిహద్దుకు సమీపంలో ఈ వేడుకను నిర్వహించారని పేర్కొన్న ఉన్నతాధికారులు.. దీనికి బాధ్యులైనవారిని గుర్తిస్తామని తెలిపారు.
నరమేధానికి నెల రోజులు.. భీకర యుద్ధంలో 11వేలు దాటిన మరణాలు
అంతకుముందు ఉక్రెయిన్ ఓడరేవు నగరం ఒడెసాపై మాస్కో జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు. యునెస్కో వారసత్వ జాబితాలోని ఒడెసా ‘నేషనల్ ఆర్ట్ మ్యూజియం’ కూడా ఈ దాడుల్లో దెబ్బతింది. అనేక కళాఖండాలకు నెలవైన దీనికి 124 ఏళ్ల చరిత్ర ఉంది. అటు రష్యా ఆక్రమిత క్రిమియాలోని కెర్చ్ నగరంపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో.. ఓ అత్యాధునిక యుద్ధనౌక ధ్వంసం అయిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారంగానే ఒడెసాపై మాస్కో సేనలు విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ అధికారులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం