Jaishankar: ఉగ్రవాది.. ఏ భాషలోనైనా ఉగ్రవాదే: జైశంకర్
రష్యాతో భారత్కు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్- రష్యా సంబంధాల (India- Russia Ties)పై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కోతో దిల్లీకి ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మూడు రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్న జైశంకర్ ఆదివారం అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమై మాట్లాడారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో.. చైనా వైపు రష్యా మళ్లుతుందనే భావననూ తోసిపుచ్చారు. అదే విధంగా.. ఉగ్రవాది ఏ భాషలోనైనా ఉగ్రవాదేనని, ఏ దేశం కూడా సొంత వివరణలతో దాన్ని సమర్థించకూడదన్నారు.
‘‘నా అనుభవాలు, లెక్కల ప్రకారం.. రష్యా ఎల్లప్పుడూ భారత్తో సానుకూల సంబంధాలు కలిగి ఉంది. ఇరు దేశాలూ పరస్పర ప్రయోజనాలను పట్టించుకునే విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకున్నాయి. రెండింటి మధ్య ఈ మాత్రం విశ్వాసం అవసరం’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. ఏ దేశంతో సంబంధాలనైనా భారత్ తన కోణం నుంచే చూడాలన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఆ తర్వాత వాషింగ్టన్తో భారత సమీకరణాలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా.. భారత్ కలిసి మెలిసి ఉండగలదని చెప్పారు.
ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు: పాక్పై జైశంకర్ మండిపాటు
జమ్మూకశ్మీర్లో ‘ఆర్టికల్ 370’ వ్యవహారంపై స్పందిస్తూ.. ఇది తాత్కాలిక నిబంధనేనని, దీని కారణంగా దేశానికి రెండు విధాల హాని కలిగిందని పేర్కొన్నారు. ‘‘ఒకటి.. వేర్పాటువాదం, హింస, ఉగ్రవాదానికి ఇది కారణమైంది. తద్వారా దేశ భద్రతకు సమస్యగా పరిణమించింది. రెండోది.. ఆ సమయంలో అనేక చట్టాలను ఈ ప్రాంతానికి విస్తరించకుండా నిరోధించింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి’’ అని చెప్పారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
మాస్కో ఉగ్రదాడి ఘటనపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో మాట్లాడినట్లు జైశంకర్ ట్వీట్ చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి పట్ల సంతాపం తెలియజేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. మాస్కోలో జరిగిన దాడిలో ఇప్పటి వరకు దాదాపు 133 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికే బాధ్యత స్వీకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్