Al Qaida: కరడుగట్టిన అల్ ఖైదా ఉగ్రవాది మృతి.. అతడి తలపై రూ.40 కోట్ల రివార్డు
Al Qaida: అల్ ఖైదా యెమెన్ శాఖకు నాయకత్వం వహిస్తున్న ఖలీద్ అల్-బటర్ఫీ మృతిచెందినట్లు ఆ ఉగ్రసంస్థ ప్రకటించింది. అతడి మృతదేహాన్ని చూపిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.
వాషింగ్టన్: ఉగ్రసంస్థ అల్-ఖైదా యెమెన్ శాఖ నాయకుడు ఖలీద్ అల్-బటర్ఫీ మృతిచెందినట్లు మిలిటెంట్ గ్రూప్ ఆదివారం ప్రకటించింది. అతడి మృతికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అల్-ఖైదా (Al Qaida) జెండాలో చుట్టి ఉన్న మృతదేహాన్ని చూపుతూ ఆదివారం ఓ వీడియో విడుదల చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అతని వయసు 40 ఏళ్ల వరకు ఉంటుందని అంచనా.
ఖలీద్ తలపై అమెరికా గతంలో దాదాపు రూ.40 కోట్ల రివార్డు ప్రకటించింది. అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకరమైన గ్రూపుగా యెమెన్ శాఖ అవతరించినట్లు చెబుతుంటారు. ఇకపై సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఉగ్రసంస్థ తాజా వీడియోలో వెల్లడించింది. పలుసార్లు అమెరికాపై దాడికి పిలుపునిచ్చిన కారణంతో అక్కడి ప్రభుత్వం ఇతడిపైనా దాదాపు రూ.50 కోట్ల రివార్డు ప్రకటించింది.
అమెరికాలో ఓ వాణిజ్య విమానాన్ని పేల్చివేసేందుకు అల్ ఖైదా యెమెన్ శాఖ 2009లో విఫలయత్నం చేసింది. 2015లో ఫ్రాన్స్లో జరిగిన దాడులు తమ పనే అని ప్రకటించింది. అప్పటి నుంచి అమెరికా ఈ గ్రూప్ను అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తూ వస్తోంది. 2020లో అమెరికా డ్రోన్ దాడిలో ఈ ఉగ్రసంస్థ నాయకుడు ఖాసీం అల్-రిమీ హతమయ్యాడు. అతడి నాయకత్వంలోనే సౌదీలోని అమెరికా నావికాస్థావరంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించారు. అతడి మృతి తర్వాత ఖలీద్ అల్-బటర్ఫీ బాధ్యతలు తీసుకున్నాడు.
సౌదీ అరేబియాలో పుట్టిపెరిగిన ఖలీద్ అల్-బటర్ఫీ 1999లో అఫ్గానిస్థాన్కు మకాం మార్చాడు. అక్కడ తాలిబన్లతో కలిసి అమెరికా సైన్యంపై దాడులకు పాల్పడ్డాడు. 2010లో అల్ఖైదాలో చేరాడు. యెమెన్లోని అబ్యాన్ ప్రావిన్స్ ఆక్రమణలో కీలక పాత్ర పోషించినట్లు అమెరికా తెలిపింది. 2020లోనే అతడు అగ్రరాజ్య సైనికుల చేతికి చిక్కినట్లు వార్తలు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి