Greg Ross: సీఈవో ఉద్యోగాన్ని వదులుకొని.. ట్రక్కు డ్రైవర్గా చేరి..!
ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్ రాస్ అనే వ్యక్తి సీఈవో ఉద్యోగానికి రాజీనామా చేసి ట్రక్కు డ్రైవర్గా జీవితం ప్రారంభించారు. గత 12 ఏళ్లుగా ఆయన అలాగే సాధారణ జీవనం సాగిస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఆయన ఓ సినిమాహాళ్ల సంస్థకు సీఈవో. అప్పటికే 60 ఏళ్లు. ఈ వయసులో సాహసోపేత నిర్ణయాలు తీసుకునేందుకు ఎవరైనా వెనకాడతారు. మంచి జీతం, హోదాలను వదిలిపెట్టి సాధారణ జీవితం గడపాలని కోరుకోరు. కానీ, అస్ట్రేలియాకు (Australia) చెందిన గ్రెగ్ రాస్ (Greg Ross) అనే వ్యక్తి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాన్ని వదిలిపెట్టి ట్రక్కు డ్రైవర్గా జీవితం ప్రారంభించారు. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. గత 12 ఏళ్లుగా ఇలాగే జీవనం సాగిస్తున్నారు.
గ్రెగ్ రాస్.. గతంలో విలాసవంతమైన కార్లు విక్రయించే సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పని చేశారు. అప్పట్లోనే జీవితంలో ఏదో కోల్పోయామన్న భావన, అలసత్వం ఆయన మనసులో అలముకున్నాయి. పిల్లలు చిన్నవాళ్లు కావడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాలేదు. కాలక్రమంలో ఆయన ఓ సినిమా హాళ్ల సంస్థకు సీఈవోగా సేవలందించే స్థాయి వరకు ఎదిగారు. గౌరవప్రదమైన జీతం, హోదా, సకల సౌకర్యాలు. ఇలా ఎన్ని ఉన్నా.. ఆయన మనసులో ఏదో వెలితి. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సాధారణంగా, ఒత్తిడికి దూరంగా గడపాలనుకున్నాడు. పిల్లలు కూడా స్థిరపడటంతో కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు లేవు. కానీ, అప్పటికే ఆయనకు 60 ఏళ్లు నిండాయి. ఉద్యోగానికి రాజీనామా చేసి, ట్రక్కు డ్రైవర్గా పని చేస్తానని కుటుంబ సభ్యులకు చెప్తే..వాళ్లు ససేమిరా అన్నారు. కానీ, రాస్ మాత్రం పట్టు వదల్లేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఓ రవాణా కంపెనీలో ట్రక్కు డ్రైవర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
కొన్ని రోజులకు ఆ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. దరఖాస్తులో గత అనుభవం పేర్కొనక పోవడంతో ఆ సంస్థ సిబ్బంది దాని గురించి ప్రశ్నించారు. గ్రెగ్ రాస్ తన గతం గురించి వారికి వివరించారు. ఆశ్చర్యపోయిన సిబ్బంది.. కేవలం రాత్రిపూట మాత్రమే ట్రక్కు నడిపేందుకు అనుమతిచ్చారు. అతడి డ్రైవింగ్ చూసి పగలు కూడా నడిపేందుకు అవకాశం ఇచ్చారు. క్రమంగా రెగ్యులర్ ఉద్యోగిగా నియమితులైన గ్రెగ్ రాస్... ప్రస్తుతం పెద్ద పెద్ద ట్రక్కులు సైతం అవలీలగా డ్రైవ్ చేస్తున్నారట. ఐదు ట్రైలర్లతో 190 అడుగుల పొడవు, రెండు ఇంజిన్లు, 480 టన్నులను మోసుకెళ్లగలిగే సామర్థ్యమున్న ట్రక్కును నడపడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు.
గ్రెగ్ రాస్కు ప్రస్తుతం 72 ఏళ్లు. 20 ఏళ్ల క్రితం రాస్ థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స చేసిన వైద్యులు కేవలం 3 నెలలు మాత్రమే బతికే అవకాశముందని చెప్పారు. అలాంటి వ్యక్తి క్యాన్సర్ను జయించి.. సీఈవో ఉద్యోగాన్ని విడిచిపెట్టి.. ట్రక్కు డ్రైవర్గా జీవించడం సాహసమనే చెప్పాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!