Greg Ross: సీఈవో ఉద్యోగాన్ని వదులుకొని.. ట్రక్కు డ్రైవర్గా చేరి..!
ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్ రాస్ అనే వ్యక్తి సీఈవో ఉద్యోగానికి రాజీనామా చేసి ట్రక్కు డ్రైవర్గా జీవితం ప్రారంభించారు. గత 12 ఏళ్లుగా ఆయన అలాగే సాధారణ జీవనం సాగిస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఆయన ఓ సినిమాహాళ్ల సంస్థకు సీఈవో. అప్పటికే 60 ఏళ్లు. ఈ వయసులో సాహసోపేత నిర్ణయాలు తీసుకునేందుకు ఎవరైనా వెనకాడతారు. మంచి జీతం, హోదాలను వదిలిపెట్టి సాధారణ జీవితం గడపాలని కోరుకోరు. కానీ, అస్ట్రేలియాకు (Australia) చెందిన గ్రెగ్ రాస్ (Greg Ross) అనే వ్యక్తి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాన్ని వదిలిపెట్టి ట్రక్కు డ్రైవర్గా జీవితం ప్రారంభించారు. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. గత 12 ఏళ్లుగా ఇలాగే జీవనం సాగిస్తున్నారు.
గ్రెగ్ రాస్.. గతంలో విలాసవంతమైన కార్లు విక్రయించే సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పని చేశారు. అప్పట్లోనే జీవితంలో ఏదో కోల్పోయామన్న భావన, అలసత్వం ఆయన మనసులో అలముకున్నాయి. పిల్లలు చిన్నవాళ్లు కావడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాలేదు. కాలక్రమంలో ఆయన ఓ సినిమా హాళ్ల సంస్థకు సీఈవోగా సేవలందించే స్థాయి వరకు ఎదిగారు. గౌరవప్రదమైన జీతం, హోదా, సకల సౌకర్యాలు. ఇలా ఎన్ని ఉన్నా.. ఆయన మనసులో ఏదో వెలితి. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సాధారణంగా, ఒత్తిడికి దూరంగా గడపాలనుకున్నాడు. పిల్లలు కూడా స్థిరపడటంతో కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు లేవు. కానీ, అప్పటికే ఆయనకు 60 ఏళ్లు నిండాయి. ఉద్యోగానికి రాజీనామా చేసి, ట్రక్కు డ్రైవర్గా పని చేస్తానని కుటుంబ సభ్యులకు చెప్తే..వాళ్లు ససేమిరా అన్నారు. కానీ, రాస్ మాత్రం పట్టు వదల్లేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఓ రవాణా కంపెనీలో ట్రక్కు డ్రైవర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
కొన్ని రోజులకు ఆ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. దరఖాస్తులో గత అనుభవం పేర్కొనక పోవడంతో ఆ సంస్థ సిబ్బంది దాని గురించి ప్రశ్నించారు. గ్రెగ్ రాస్ తన గతం గురించి వారికి వివరించారు. ఆశ్చర్యపోయిన సిబ్బంది.. కేవలం రాత్రిపూట మాత్రమే ట్రక్కు నడిపేందుకు అనుమతిచ్చారు. అతడి డ్రైవింగ్ చూసి పగలు కూడా నడిపేందుకు అవకాశం ఇచ్చారు. క్రమంగా రెగ్యులర్ ఉద్యోగిగా నియమితులైన గ్రెగ్ రాస్... ప్రస్తుతం పెద్ద పెద్ద ట్రక్కులు సైతం అవలీలగా డ్రైవ్ చేస్తున్నారట. ఐదు ట్రైలర్లతో 190 అడుగుల పొడవు, రెండు ఇంజిన్లు, 480 టన్నులను మోసుకెళ్లగలిగే సామర్థ్యమున్న ట్రక్కును నడపడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు.
గ్రెగ్ రాస్కు ప్రస్తుతం 72 ఏళ్లు. 20 ఏళ్ల క్రితం రాస్ థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స చేసిన వైద్యులు కేవలం 3 నెలలు మాత్రమే బతికే అవకాశముందని చెప్పారు. అలాంటి వ్యక్తి క్యాన్సర్ను జయించి.. సీఈవో ఉద్యోగాన్ని విడిచిపెట్టి.. ట్రక్కు డ్రైవర్గా జీవించడం సాహసమనే చెప్పాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్