Odisha police pigeon : ఒడిశాలో పోలీసు పావురాలు.. విధి నిర్వహణలో సత్తా చాటాయి!
భారత దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు నుంచే ఒడిశా (Odisha) పోలీసు విభాగంలో కొన్ని పావురాలు పని చేస్తున్నాయి. వాటి సేవలను ఎలా వినియోగించుకున్నారో తెలుసుకోండి.
భారత దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal nehru) 1948 ఏప్రిల్ 13న ఒడిశా రాష్ట్రం (Odisha) సంబల్పూర్ జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ్నుంచి ఆయన 265 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్ వెళ్లాలనుకున్నారు. తన పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కటక్ అధికారులకు ఒక అత్యవసర సందేశం పంపించాల్సి వచ్చింది. ఎలా అని నెహ్రూ వాకబు చేస్తుండగా.. స్థానిక పోలీసులు ఓ పావురాన్ని తీసుకొచ్చి దాంతో ఆ సందేశం పంపిస్తామని చెప్పారు. ఆయన ఎగాదిగా చూసి అప నమ్మకంగానే దాంతో వర్తమానం పంపించారు. ఉదయం ఆరు గంటలకు బయలుదేరిన ఆ పావురం 11.20 కల్లా కటక్ చేరింది. అది తెచ్చిన సందేశంలో సూచించిన ప్రకారం వెంటనే అక్కడ చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. మధ్యాహ్నం తరువాత కటక్ వెళ్లిన ప్రధాని ఆ పావురాన్ని, తాను రాసిన సందేశాన్ని చూసి ఆశ్చర్యపోయారు.. ఆనందించారు. అంతటి గొప్ప ఘన చరిత్ర కలిగిన పోలీసు పావురాల నైపుణ్యం, వాటి సేవల గురించి తెలుసుకోండి మరి.
రెండు కేంద్రాల్లో పెంపకం
ఒడిశా రాష్ట్రం పోలీసు విభాగంలో కొన్ని దశాబ్దాలుగా పావురాలు పని చేస్తున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో వాటి సేవలను వినియోగించుకున్నారు. ఎన్నికలు, ప్రకృతి విపత్తులు ఇలా వివిధ సందర్భాల్లో అవి ముఖ్యమైన సందేశాలను చేరవేశాయి. ఇప్పటికీ కటక్లోని ఒడిశా పోలీస్ హెడ్క్వార్టర్స్లో 105, అనుగుల్ పోలీసు శిక్షణ కళాశాలలో 44 హోమర్ రకం పావురాలను పెంచుతున్నారు.
బ్రిటిష్ హయాంలో ప్రారంభం
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1946వ సంవత్సరంలో ఒడిశాలో పావురాల సేవలను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి వాటిని వార్తా వాహినులుగా అనేక సందర్భాల్లో వినియోగించారు. 1954లో దిల్లీలో ఇంటర్నేషనల్ పోస్టల్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అప్పట్లో ఈ పావురాలు ప్రదర్శించిన నైపుణ్యాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 1982లో ఒడిశాలో భారీ వరదలు వచ్చాయి. దాంతో అనేక చోట్ల రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఆ సమయంలోనూ పావురాలు ఎంతో కచ్చితత్వంతో సందేశాలను చేరవేసి భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని తప్పించాయి.
నక్సల్స్ కదలికలు తెలుసుకునేందుకు..
ఒడిశా రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువ. కొరాపుట్ జిల్లాలో వారి కదలికలను తెలుసుకొనేందుకు తొలిసారి కపోతాలతో ప్రయోగం చేశారు. అది విజయవంతం కావడంతో తరువాత 38 ప్రాంతాల్లో 1500 పావురాలను మోహరించారు. వివిధ జిల్లాల్లో 19 పావురాల కేంద్రాలను నెలకొల్పారు. ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఎస్సైలు, ఒక ఏఎస్సై, 35 మంది కానిస్టేబుళ్లను వాటి కోసం కేటాయించారు. 1990 నుంచి వైర్లైస్, టెలిగ్రాఫ్, టెలిఫోన్ వంటి కమ్యూనికేషన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో పావురాల వినియోగం తగ్గింది.
పోలీసులతో శిక్షణ
పావురాలు చాలా తెలివైనవి. వాటి చూపు తీక్షణంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులను బట్టి అవి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక సారి ఎగరడం మొదలుపెడితే 400 నుంచి 500 కిలోమీటర్ల దాకా ఆగవు. పావురాల పిల్లలు.. 4 నుంచి 6 వారాల వయసు రాగానే ఎగరడం నేర్చుకుంటాయి. ఆ సమయంలో అనుభవజ్ఞులైన పోలీసులు వాటికి శిక్షణనిస్తారు. అన్ని దిక్కులా.. 5 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టి తిరిగి గూటిని చేరుకునే నైపుణ్యం వాటికి అలవాటు చేస్తారు. దాంతో అవి పరిసరాలు, మార్గాలను మననం చేసుకుంటాయి. ప్రాథమిక శిక్షణ పూర్తయిన తరువాత కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో వదిలి.. అవే తిరిగొచ్చేలా చూస్తారు. అలా క్రమంగా దూరం పెంచుతూ పోతారు. శిక్షణా కాలంలో వాటికి బలవర్థకమైన ఆహారం, పానీయాలు అందజేస్తారు. అందువల్ల అవి బయట ఎక్కడా తినవు... తాగవు. పోలీసు శిక్షణ పొందిన కపోతం 7 నుంచి 12 ఏళ్లపాటు సేవలందిస్తుంది.
కాగ్ అభ్యంతరం తెలిపినా..
2008 మార్చి 31న పావురాల సందేశ సేవలను నిలిపివేశారు. కానీ, వాటిని పెంచడం, శిక్షణ ఇవ్వడం మాత్రం ఆపలేదు. ఈ ఆధునిక కాలంలో వాటిపై పెట్టే ఖర్చు అనవసరమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కొన్నేళ్ల కిందటే అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ, సీఎం నవీన్ పట్నాయక్ పావురాల శిబిరాలను కొనసాగించడానికే మొగ్గు చూపారు. కొన్ని ముఖ్యమైన సందేశాలు పంపించిన ఈ పావురాల ఘన వారసత్వం గురించి ప్రపంచానికి తెలియాలనేది ఆయన ఉద్దేశం. అందుకే రాష్ట్ర స్థాయి ఉత్సవాలు, స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల నాడు వాటితో ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
కపోతాలతో మూడు రకాల సేవలు
స్టాటిక్ : ఈ రకం సేవలో పావురాలు లక్షిత గమ్యం వైపు మాత్రమే ప్రయాణం చేస్తాయి. తుపానులు, వరదలు సంభవించిన సమయంలో వాటిని వినియోగిస్తారు.
బూమ్రాంగ్ : ఈ విధానంలో ఒక చోట నుంచి బయలుదేరిన పావురం నిర్దేశిత ప్రాంతంలో సందేశం చేరవేసి తిరిగి యథా స్థానానికి రావాల్సి ఉంటుంది. శిక్షణ కాలంలో ఇవి వెళ్లాల్సిన చోట ఆహారం, తిరిగి రావాల్సిన ప్రదేశంలో తాగునీరు ఉంచుతారు.
మొబైల్ : అవసరాన్ని బట్టి పోలీసు బలగాలు పావురాలను తమ వెంట తీసుకెళ్తాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను వాటి ద్వారా హెడ్క్వార్టర్కు నివేదిస్తారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్