ట్రూడో ఆరోపణలను విభేదించడానికి కారణం లేదు: ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ చీఫ్
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) భారత్పై చేసిన ఆరోపణలను ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ చీఫ్ సమర్థించేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి కెనడా-భారత్ వివాదం ముదిరే సూచనలు కన్పిస్తున్నాయి.
కాలిఫోర్నియా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ట్రూడో చేసిన వ్యాఖ్యలను తాజాగా ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మైక్ బర్జెస్( Australian intel chief Mike Burgess) సమర్థించడం గమనార్హం. ట్రూడో ప్రకటనతో విభేదించేందుకు తనకు ఎటువంటి కారణం కనిపించడం లేదన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఫైవ్ ఐస్ కూటమి(Five Eyes) భాగస్వాముల సమావేశంలో పాల్గొన్న సమయంలో విలేకర్ల వద్ద ఈ విధంగా స్పందించారు.
‘కెనడా ప్రభుత్వం(Canada) చేసిన వ్యాఖ్యలతో విభేదించేందుకు ఎటువంటి కారణం కనిపించడం లేదు. అవి తీవ్రమైన ఆరోపణలు. అలాంటి చర్యలకు ఏ దేశమూ పాల్పడకూడదు’ అని బర్జెస్ వ్యాఖ్యానించారు. అలాగే భారత ఏజెంట్ల తదుపరి లక్ష్యం ఆస్ట్రేలియా అవుతుందా? అని ప్రశ్నించగా.. ‘ఇలాంటి విషయాలపై నేను బహిరంగంగా ఊహాగానాలు చేయను. అది సరైన పద్ధతి కాదనుకుంటున్నాను. మా దేశంలో ఇతర ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయని లేదా ఆ రకంగా ప్రణాళికలు వేస్తున్నాయని గుర్తిస్తే.. అటువంటి పరిస్థితులను మేము సమర్థవంతంగా డీల్ చేస్తామని చెప్పగలను’ అని అన్నారు.
ఇజ్రాయెల్ బలైంది వాస్తవమే.. కానీ..: బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
దాదాపు నెలక్రితం ట్రూడో చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భారత్లోని కెనడా(Canada)కు చెందిన సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఆ దేశ దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకోవాలని డిమాండ్ చేసింది. ఆ డిమాండ్కు తగ్గట్టే.. కొందరు దౌత్యవేత్తలను తగ్గించుకున్నట్లు ఇటీవల కెనడా తెలిపింది. మరోపక్క ఈ దౌత్యపరమైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్, కెనడా విదేశాంగమంత్రులు అమెరికాలో రహస్యంగా భేటీ అయినట్లు ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ఈ భేటీ గురించి ఇరు దేశాల విదేశాంగ శాఖల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కాగా.. ‘ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్’లో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా సభ్యదేశాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..