Baltimore Incident: బాల్టిమోర్ వంతెన ఘటన.. ‘అమెరికా ఆర్థిక విపత్తు’
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిపోయిన ఘటనతో స్థానిక నౌకాశ్రయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయని మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ తెలిపారు.
వాషింగ్టన్: అమెరికాలోని (USA) బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిపోయిన ఘటన (Baltimore Bridge Collapse)తో స్థానిక నౌకాశ్రయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయని మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ తెలిపారు. ఈ పరిణామాలు కేవలం బాల్టిమోర్, మేరీల్యాండ్లపైనే కాకుండా మొత్తం అమెరికాపైనా ఆర్థికపరంగా ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనను ‘జాతీయ ఆర్థిక విపత్తు’గా పేర్కొన్నారు.
‘ఈ ఓడరేవు దేశాభివృద్ధిలో కీలకం..’
‘‘అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాల్లో బాల్టిమోర్ ఒకటి. గతేడాది ఇక్కడి నుంచి 11 లక్షల కంటెయినర్లు వెళ్లాయి. కార్లు, ట్రక్కులు, వ్యవసాయ పరికరాల ఎగుమతులకు దేశవ్యాప్తంగా ఇదే అతిపెద్ద ఓడరేవు. ప్రస్తుతం కార్యాకలాపాలు నిలిచిపోవడంతో.. దీని ప్రభావం కేవలం మేరీల్యాండ్కే పరిమితం కాదు. కెంటకీలో వ్యవసాయదారులు, ఒహైయోలో ఆటో డీలర్లు, టెనస్సీలో రెస్టారంట్లపైనా ప్రభావం పడుతుంది. ఈ నౌకాశ్రయం దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకం. అందుకే వీలైనంత త్వరగా రాకపోకలు పునరుద్ధరించడం అవసరం’’ అని వెస్ మూర్ తెలిపారు.
అమెరికాలో వంతెనను ఢీకొన్న బార్జ్..!
వంతెన శకలాలను తొలగించేందుకు అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. వెయ్యి టన్నుల బరువు ఎత్తగల భారీ క్రేన్ను రప్పించినట్లు మూర్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన నౌకపైనా దాదాపు నాలుగు వేల టన్నుల బరువైన వంతెన శకలాలు ఉన్నాయని, దీంతో అది అక్కడే చిక్కుకుపోయిందన్నారు. దాదాపు ఈఫిల్ టవర్ అంత పొడవైన ఆ నౌక (984 అడుగులు)ను తరలించడం ప్రస్తుతం అత్యంత సవాల్తో కూడుకున్న పని అని చెప్పారు. మరోవైపు.. ‘నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB)’ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోందని తెలిపారు.
నౌకాసిబ్బంది అప్రమత్తత భేష్..
నౌక ఢీకొనడంతో పటాప్స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన మొత్తం కుప్పకూలిన విషయం తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం.. మార్చి 25న అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. నౌకలో భారత సిబ్బంది ఉన్నారు. అయితే.. ప్రమాదానికి ముందే వారు అధికారులను అప్రమత్తం చేయడంతో వంతెనపై రాకపోకలను నిలిపేయగలిగారు. వారి అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడిందని వెస్ మూర్ తెలిపారు. లేకపోతే.. ఆ చీకట్లో వంతెన కూలిపోయిన తర్వాత కూడా వాహనాలు దూసుకొచ్చి నీళ్లలో పడిపోయేవన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం భారత సిబ్బందిపై ఇప్పటికే ప్రశంసలు కురిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.