china: భారత్తో సరిహద్దు వివాదం మా ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబించదు: చైనా
భారత్తో సంబంధాలను కేవలం సరిహద్దు వివాదం దృష్టితోనే చూడలేమని చైనా అభిప్రాయపడింది. పరస్పర విశ్వాసం పెంపొందించుకోవడం చాలా ముఖ్యమని తెలిపింది.
ఇంటర్నెట్డెస్క్: భారత్తో సరిహద్దు వివాదం ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిగా ప్రతిబింబించదని చైనా (china) పేర్కొంది. ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ దీనిని వెల్లడించారు. ఇరు పక్షాల మధ్య అపనమ్మకాన్ని తొలగించి విశ్వాసాన్ని పెంచుకొనేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో బలగాల మోహరింపు వల్ల ఇరు పక్షాలకు ఉపయోగం లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై వెన్బిన్ మాట్లాడుతూ ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు వివాదానికి తగిన స్థానం ఇవ్వాలన్నారు.
‘‘సరిహద్దు వివాదం వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడమే ద్వైపాక్షిక ప్రయోజనాలను కాపాడుతుందని ఇరు దేశాలు బలంగా నమ్ముతున్నాయి. భారత్-చైనా మధ్య ఉన్న ఒప్పందాలు, నాయకుల మధ్య అవగాహనను ఉభయపక్షాలు కొనసాగిస్తాయని నమ్ముతున్నాను. దౌత్య, సైనిక మార్గాల్లో కమ్యూనికేషన్లను కొనసాగించాలి. సరిహద్దు వివాదంలో ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలి. పరస్పర విశ్వాసం పెంచుకొని అపోహలను తొలగించుకోవాలి. సంప్రదింపుల వేదికను ఏర్పాటు చేసుకొని సహకరించుకోవాలి. అడ్డంకులను సృష్టించకుండా చూసుకోవాలి’’ అని వాంగ్ పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్ కూడా చైనాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
హిందూ మహాసముద్రంలో బంగ్లాదేశ్ నౌక హైజాక్
ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ‘‘ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను అమలును పర్యవేక్షించుకోవడం సమష్టి ప్రయోజనాలకు సంబంధించిన అంశం. రెండు దేశాల మధ్య గత నాలుగేళ్లుగా చూస్తున్న ఉద్రిక్తతల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు’’ అని వ్యాఖ్యానించారు. పొరుగుదేశం రాతపూర్వక ఒప్పందాలను పాటించకపోవడం ఆందోళనకర విషయమన్నారు. సరిహద్దుల్లో 2020లో చోటుచేసుకున్న రక్తపాతానికి చైనానే కారణమన్నారు. టోక్యోలో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన రైసినా రౌండ్టేబుల్ ప్రారంభ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిపై నేడు చైనా ప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి