British Museum: 256 ఏళ్ల బ్రిటిష్ మ్యూజియం చరిత్రకు మచ్చ.. 1,800 పురాతన వస్తువుల చోరీ!
British Museum: లండన్లోని ప్రఖ్యాత బ్రిటిష్ మ్యూజియంలో 1,800 వస్తువులు చోరీకి గురైనట్లు నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు.
లండన్: ప్రఖ్యాత బ్రిటిష్ మ్యూజియంలో (British Museum) దాదాపు 1,800 పురాతన వస్తువులు చోరీకి గురైనట్లు దాని నిర్వాహకులు కోర్టుకు వెళ్లారు. సంరక్షణాధికారి పీటర్ హిగ్స్ వాటిని అపహరించి ఆన్లైన్లో విక్రయానికి ఉంచినట్లు ఆరోపించారు. అతణ్ని 2023 జులైలోనే విధుల్లో నుంచి తొలగించారు. దాదాపు దశాబ్దకాలం పాటు మ్యూజియంలోని రత్నాలు, బంగారు ఆభరణాలు సహా ఇతర వస్తువులను మాయం చేసి హిగ్స్ తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేసినట్లు దావాలో పేర్కొన్నారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి హీథర్ విలియమ్స్.. నాలుగు వారాల్లోగా తన దగ్గర ఉన్న వస్తువులను మ్యూజియానికి అప్పజెప్పాలని హిగ్స్ను ఆదేశించారు. ‘ఈబే’, ‘పేపాల్’ ఖాతాల్లోని లావాదేవీల వివరాలను బహిర్గతం చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు 356 వస్తువులను రికవరీ చేసినట్లు మ్యూజియం అధికారులు కోర్టుకు వెల్లడించారు. అపహరణకు గురైనవన్నీ చారిత్రక, సాంస్కృతికంగా చాలా ప్రాధాన్యం ఉన్న వస్తువులని తెలిపారు. నకిలీ పత్రాలను సృష్టించి మ్యూజియం రికార్డులను తారుమారు చేయడం సహా తన పేరు మార్చుకొని హిగ్స్ వాటిని విక్రయించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
ఆ తండ్రికి రూ.వందల కోట్ల ఆస్తి..సామాన్యుడిలా పెరిగిన కుమారుడు
మ్యూజియం (British Museum)లోని గ్రీస్, రోమ్ విభాగాల్లో దాదాపు రెండు దశాబ్దాలు పనిచేసిన హిగ్స్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అనారోగ్యం కారణంగా మంగళవారం విచారణకు హాజరు కాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అపహరణపై పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకు వారు హిగ్స్పై ఎలాంటి నేరాభియోగాలను మోపలేదు. చోరీ విషయం వెలుగులోకి వచ్చిన ఆగస్టులోనే మ్యూజియం డైరెక్టర్ హార్ట్విగ్ ఫిషర్ రాజీనామా చేశారు. ఈబేలో మ్యూజియం కలెక్షన్ విక్రయానికి ఉన్నట్లు ఓ చరిత్రకారుడు హెచ్చరించినప్పటికీ తాను ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయానని క్షమాపణలు చెప్పారు.
ఈ చోరీ ఉదంతం వల్ల 256 ఏళ్ల మ్యూజియం (British Museum) చరిత్రకు మచ్చ ఏర్పడిందని ఛైర్మన్ ఆఫ్ ట్రస్టీస్ జార్జ్ ఒస్బోర్న్ అన్నారు. సెంట్రల్ లండన్లోని బ్లూమ్స్బరీ జిల్లాలో ఉన్న ఈ మ్యూజియాన్ని 18వ శతాబ్దంలో ఏర్పాటు చేశారు. ఈజిప్టు మమ్మీలు, పురాతన గ్రీకు విగ్రహాల నుంచి 12వ శతాబ్దపు చైనీస్ కవిత్వంతో కూడిన శాసనాలు, కెనడాలో స్థానిక ప్రజలు తయారు చేసిన మాస్క్ల వరకు వేలాది చారిత్రక వస్తువులు ఇక్కడ ఉన్నాయి. బ్రిటన్లోని అతిపెద్ద పర్యాటక ప్రదేశాల్లో ఇదొకటి. ఏటా దాదాపు 60 లక్షల మంది సందర్శిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు