British Museum: 256 ఏళ్ల బ్రిటిష్ మ్యూజియం చరిత్రకు మచ్చ.. 1,800 పురాతన వస్తువుల చోరీ!
British Museum: లండన్లోని ప్రఖ్యాత బ్రిటిష్ మ్యూజియంలో 1,800 వస్తువులు చోరీకి గురైనట్లు నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు.
లండన్: ప్రఖ్యాత బ్రిటిష్ మ్యూజియంలో (British Museum) దాదాపు 1,800 పురాతన వస్తువులు చోరీకి గురైనట్లు దాని నిర్వాహకులు కోర్టుకు వెళ్లారు. సంరక్షణాధికారి పీటర్ హిగ్స్ వాటిని అపహరించి ఆన్లైన్లో విక్రయానికి ఉంచినట్లు ఆరోపించారు. అతణ్ని 2023 జులైలోనే విధుల్లో నుంచి తొలగించారు. దాదాపు దశాబ్దకాలం పాటు మ్యూజియంలోని రత్నాలు, బంగారు ఆభరణాలు సహా ఇతర వస్తువులను మాయం చేసి హిగ్స్ తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేసినట్లు దావాలో పేర్కొన్నారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి హీథర్ విలియమ్స్.. నాలుగు వారాల్లోగా తన దగ్గర ఉన్న వస్తువులను మ్యూజియానికి అప్పజెప్పాలని హిగ్స్ను ఆదేశించారు. ‘ఈబే’, ‘పేపాల్’ ఖాతాల్లోని లావాదేవీల వివరాలను బహిర్గతం చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు 356 వస్తువులను రికవరీ చేసినట్లు మ్యూజియం అధికారులు కోర్టుకు వెల్లడించారు. అపహరణకు గురైనవన్నీ చారిత్రక, సాంస్కృతికంగా చాలా ప్రాధాన్యం ఉన్న వస్తువులని తెలిపారు. నకిలీ పత్రాలను సృష్టించి మ్యూజియం రికార్డులను తారుమారు చేయడం సహా తన పేరు మార్చుకొని హిగ్స్ వాటిని విక్రయించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
ఆ తండ్రికి రూ.వందల కోట్ల ఆస్తి..సామాన్యుడిలా పెరిగిన కుమారుడు
మ్యూజియం (British Museum)లోని గ్రీస్, రోమ్ విభాగాల్లో దాదాపు రెండు దశాబ్దాలు పనిచేసిన హిగ్స్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అనారోగ్యం కారణంగా మంగళవారం విచారణకు హాజరు కాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అపహరణపై పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకు వారు హిగ్స్పై ఎలాంటి నేరాభియోగాలను మోపలేదు. చోరీ విషయం వెలుగులోకి వచ్చిన ఆగస్టులోనే మ్యూజియం డైరెక్టర్ హార్ట్విగ్ ఫిషర్ రాజీనామా చేశారు. ఈబేలో మ్యూజియం కలెక్షన్ విక్రయానికి ఉన్నట్లు ఓ చరిత్రకారుడు హెచ్చరించినప్పటికీ తాను ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయానని క్షమాపణలు చెప్పారు.
ఈ చోరీ ఉదంతం వల్ల 256 ఏళ్ల మ్యూజియం (British Museum) చరిత్రకు మచ్చ ఏర్పడిందని ఛైర్మన్ ఆఫ్ ట్రస్టీస్ జార్జ్ ఒస్బోర్న్ అన్నారు. సెంట్రల్ లండన్లోని బ్లూమ్స్బరీ జిల్లాలో ఉన్న ఈ మ్యూజియాన్ని 18వ శతాబ్దంలో ఏర్పాటు చేశారు. ఈజిప్టు మమ్మీలు, పురాతన గ్రీకు విగ్రహాల నుంచి 12వ శతాబ్దపు చైనీస్ కవిత్వంతో కూడిన శాసనాలు, కెనడాలో స్థానిక ప్రజలు తయారు చేసిన మాస్క్ల వరకు వేలాది చారిత్రక వస్తువులు ఇక్కడ ఉన్నాయి. బ్రిటన్లోని అతిపెద్ద పర్యాటక ప్రదేశాల్లో ఇదొకటి. ఏటా దాదాపు 60 లక్షల మంది సందర్శిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల