రహస్యంగా రూ.వందలకోట్ల ఆస్తి.. కుమారుడికి తెలియకుండా దాచిన తండ్రి..!
కుమారుడికి తెలియకుండా ఓ తండ్రి రూ.వందల కోట్ల ఆస్తిని దాచిపెట్టాడు. ఎందుకంటే..?
ఇంటర్నెట్డెస్క్: వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని తన కుమారుడికి తెలియకుండా రహస్యంగా ఉంచాడో తండ్రి. 20 ఏళ్లు వచ్చిన తర్వాతే తమ సంపద గురించి అతడికి వెల్లడించాడట. ఏటా రూ. 690 కోట్ల విలువైన వ్యాపారం చేసే మాలా ప్రిన్స్ బ్రాండ్ వ్యవస్థాపకుడి (multimillionaire in China) కుటుంబ కథ ఇది..!
చైనా (China)లో ప్రముఖ బ్రాండ్ మాలా ప్రిన్స్ వ్యవస్థాకుడు జాంగ్ యుడాంగ్. ఆయన కుమారుడు జాంగ్ జిలాంగ్. అతడు మీడియాతో మాట్లాడుతూ ఓ ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు. ‘‘నాకు 20 ఏళ్లు వచ్చేవరకు మా కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి నా తండ్రి అబద్ధం చెప్పారు. మా నాన్న స్థాపించిన ఈ బ్రాండ్ గురించి తెలిసినప్పటికీ, వ్యాపారం అప్పుల్లో ఉందని తరచూ చెప్పేవారు. పింగ్జియాంగ్ కౌంటీలోని ఒక మధ్యతరగతి ఇంట్లో నా జీవితం సాగింది. కుటుంబం పేరు ఉపయోగించకుండానే నా విద్యాభ్యాసం పూర్తిచేశాను. గ్రాడ్యుయేషన్ తర్వాత అప్పులు తీర్చేందుకు ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలనుకొన్నాను. అయితే గ్రాడ్యుయేషన్ సమయంలో మాకున్న సంపద గురించి నాన్న బయటపెట్టారు’ అని వెల్లడించారు. ఈ రహస్యం బయటపడిన తర్వాతే ఆ కుటుంబం రూ.11 కోట్ల విలువైన విల్లాలోకి మారింది. ఒక సాధారణ వ్యక్తిగా పెరిగితేనే.. జీవితంలో విజయం సాధించడం కోసం కష్టపడి పనిచేస్తారనేది యుడాంగ్ అభిప్రాయం. అదే సూత్రాన్ని తన కుమారుడి పెంపకంలో ఉపయోగించారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు మాలా ప్రిన్స్లో ఈ కామర్స్ విభాగంలో జిలాంగ్ పనిచేస్తున్నారు. తన పనితీరు నచ్చితేనే సంస్థ బాధ్యతలు కట్టబెట్టడం గురించి ఆలోచిస్తానని తండ్రి చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు చెబుతున్నది నమ్మశక్యంగా లేదని, కల్పితంలా ఉందని కామెంట్లు పెట్టారు. మరొకరేమో..‘‘నేను ఈ కథను నమ్ముతున్నాను. ఈ బ్రాండ్ ఇటీవలి కాలంలోనే యాడ్స్ ఇవ్వడం ప్రారంభించింది. ప్రిన్స్ గ్రాడ్యుయేట్ అవ్వడం వల్లేనేమో’’ అని రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
గాజా మురుగునీటి నమూనాల్లో పోలియో కారక వైరస్ అవశేషాలు గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. 10లక్షల టీకాలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. -
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్ అవుతోన్న తరుణంలో కమలా హారిస్(Kamala Harris)కు భారీగా మద్దతు లభిస్తోంది. -
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. -
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు