Justin Trudeau: జీ20 సదస్సు సందర్భంగా ప్రెసిడెన్షియల్ సూట్ను తిరస్కరించిన ట్రూడో..!
జీ20 సదస్సు సందర్భంగా కూడా కెనడా ప్రధాని వ్యవహారశైలి భిన్నంగా ఉన్నట్లు తెలిసింది. ఆయనకు ఏర్పాటు చేసిన ప్రెసిడెన్షియల్ సూట్ను కూడా వాడుకొనేందుకు ఇష్టపడలేదు.
దిల్లీ/టొరంటో: జీ20 సదస్సులో (G20 Summit) భాగంగా భారత్కు వచ్చిన కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రెసిడెన్షియల్ సూట్లో ఉండేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనిపై అప్పట్లో భారత నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు భారత్కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కెనడా ప్రధాని కోసం భారత ప్రభుత్వం దిల్లీలోని ‘ది లలిత్’ హోటల్లో ప్రెసిడెన్షియల్ సూట్ను బుక్ చేసింది. కానీ, ఆయన అందులో ఉండేందుకు నిరాకరించారు. దానికి బదులుగా సాధారణ గదిలో బస చేశారని ప్రెసిడెన్షియల్ సూట్ భద్రతను పర్యవేక్షించిన ఉన్నతాధికారి ఒకరు జాతీయ వార్తా సంస్థకు వెల్లడించారు.
నిజ్జర్ హత్య.. కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలి: అమెరికా
జీ20 సదస్సు అతిథుల కోసం దిల్లీలోని 30 ప్రముఖ హెటళ్లలో గదులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశాధ్యక్షులు, ప్రధానుల కోసం భద్రతా వర్గాల సూచనల మేరకు ప్రెసిడెన్షియల్ సూట్లను సిద్ధం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐటీసీ మౌర్య షెరటాన్లో, చైనా ప్రధాని లీ చియాంగ్ తాజ్ ప్యాలెస్లో బస చేశారు. సదస్సు ముగిసిన తర్వాత కూడా కెనడా ప్రధాని ఆలస్యంగా స్వదేశానికి బయల్దేరిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 10న భారత్ నుంచి బయల్దేరాల్సి ఉండగా, విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో భారత ప్రభుత్వం కెనడా ప్రధాని కోసం ఎయిర్ ఇండియా వన్ను ఆఫర్ చేసింది. అయితే, కెనడా బృందం మాత్రం దీనిని తిరస్కరించి.. తమ విమానంలో తిరిగి వెళ్లేందుకు మొగ్గు చూపింది.
భారత్ హెచ్చరికలను తోసిపుచ్చిన కెనడా
భారత్ - కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను కెనడా తోసిపుచ్చింది. అన్ని దేశాల ప్రజలకు కెనడా సురక్షితమైందని ఆ దేశ ప్రజా భద్రతా వ్యవహారాల మంత్రి డొమినిక్ లెబ్లాంక్ అన్నారు. బుధవారం కెనడాలో పర్యటించే, నివసించే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో కొన్నిచోట్ల భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. అంతకముందు కెనడా ప్రభుత్వం సైతం భారత్లో పర్యటిస్తున్న తమ దేశ పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో భారత్ సైతం కెనడాలో ఉండే భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల