India-Canada: నిజ్జర్ హత్య.. కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలి: అమెరికా
India Canada diplomatic row: నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తేలాలంటే దర్యాప్తు జరగాలని అమెరికా అభిప్రాయపడింది. ఈ దర్యాప్తును భారత్ సహకరించాలని సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యతో భారత్, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు ఈ వివాదానికి తెరలేపాయి. దీనిపై తాజాగా అమెరికా (USA) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నిజ్జర్ హత్యపై కెనడా చేపట్టిన దర్యాప్తునకు భారత్ సహకరించాలని అమెరికా సూచించింది. (India Canada diplomatic row)
‘‘నిజ్జర్ హత్యతో భారత్ ఏజెంట్లకు సంబంధం ఉందంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టేందుకు ఒట్టావా చేస్తున్న ప్రయత్నాలకు మేం మద్దతిస్తున్నాం. పారదర్శకమైన, సమగ్ర దర్యాప్తుతోనే నిజానిజాలేంటో అందరికీ తెలుస్తాయని విశ్వసిస్తున్నాం. అందుకే, ఎలాంటి దర్యాప్తుకైనా భారత అధికారులు సహకరించాలని కోరుతున్నాం’’ అని శ్వేతసౌధం జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్ కెర్బీ విలేకరులతో అన్నారు. అటు భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చారు.
‘‘ఇలాంటి ఆరోపణలు (భారత్పై ట్రూడో వ్యాఖ్యలనుద్దేశిస్తూ) ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తాయి. అయితే, క్రియాశీలకమైన నేర విచారణతోనే అసలు నేరస్థులకు శిక్ష పడుతుందని మేం భావిస్తున్నాం. ఇలాంటి ఘటనల్లో ఎవరూ ఓ నిర్ధారణకు రాకముందే ఈ దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నాం. అంతర్జాతీయ చట్టాలు, సార్వభౌమత్వ విధివిధానాలను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అందుకే పారదర్శక దర్యాప్తు జరగడమే సబబు’’ అని గార్సెట్టీ వ్యాఖ్యానించారు.
కెనడాకు రాకపోకల్లో జాగ్రత్త సుమా: భారత్ అడ్వైజరీ
గత సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ పార్లమెంట్లో నిజ్జర్ హత్య గురించి మాట్లాడుతూ భారత్పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన అతడిని తమ దేశ పౌరుడిగా ట్రూడో పేర్కొనడం కూడా తీవ్ర దుమారం రేపింది. అంతేగాక, కెనడాలో మన దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు భగ్గుమన్నాయి. ట్రూడో ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్.. మన దేశంలోని కెనడా రాయబారిని కూడా బహిష్కరించింది. అంతేగాక, కెనడాలో పెరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులు, ఇక్కడి నుంచి ఆ దేశానికి వెళ్లబోతున్నవారు అప్రమత్తంగా ఉండాలని భారత్ అడ్వైజరీ జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!