India-Canada: జీ20కి ముందే భారత్ను నిందించాలని.. కెనడా నాడే భంగపాటుకు గురై..!
India-Canada: ఖలిస్థానీ నేత నిజ్జర్ హత్యను బహిరంగంగా ఖండించాలని గతంలో కెనడా అమెరికా సహా కొన్ని మిత్రదేశాలను కోరినట్లు తెలుస్తోంది. అయితే, అందుకు వారు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఒట్టావా: ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ నిజ్జర్ హత్య వెనుక భారత్ (India) హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Canada PM Justin Trudeau) చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే, ఈ వ్యాఖ్యలకు కొద్ది వారాల ముందే కెనడా.. భారత్ను నిందించాలని ప్రయత్నించి భంగపాటుకు గురైనట్లు తెలుస్తోంది. నిజ్జర్ హత్యను బహిరంగంగా ఖండించాలని అమెరికా సహా ఫైవ్ఐస్ గ్రూపులోని మిత్రదేశాలను కెనడా కోరిందట. అయితే, అందుకు ఆ దేశాల నుంచి స్పందన కరవైనట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం తాజాగా వెల్లడించింది.
హర్దీప్ సింగ్ నిజ్జర్ (45).. భారత్లో ‘మోస్ట్ వాంటెడ్’ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. అతడి తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జూన్ 18న పశ్చిమ కెనడాలోని సర్రే నగరంలో ఒక గురుద్వారా వెలుపల ఇద్దరు దుండగులు అతడిని కాల్చి చంపారు. అయితే, ఈ హత్య వెనుక భారత ఏజెన్సీల పాత్ర ఉందని భావించిన కెనడా.. జీ20 సదస్సుకు కొద్ది వారాల ముందు దిల్లీపై నిందలు మోపాలని ప్రయత్నించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. భారత్ తీరును ఖండించేందుకు అమెరికా సహా మిత్రదేశాలు కలిసి రావాలని కోరినట్లు తెలుస్తోంది.
భారత్-కెనడా ఢీ అంటే ఢీ.. దౌత్యవేత్తలపై పరస్పరం బహిష్కరణాస్త్రాలు
జీ20 సదస్సుకు కొద్ది వారాల ముందు ఫైవ్ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్ సీనియర్ అధికారులతో కెనడా రహస్యంగా చర్చలు జరిపినట్లు సదరు మీడియా కథనం వెల్లడించింది. ఈ అలయన్స్లో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, కెనడా సభ్యదేశాలుగా ఉన్నాయి. నిజ్జర్ హత్యను బహిరంగంగా ఖండించాలని కెనడా.. ఆ దేశాలను కోరినట్లు తెలిపింది. అయితే, కెనడా వినతిని ఆ దేశాలు తిరస్కరించాయి. ఈ హత్య విషయాన్ని బహిరంగంగా లేవనెత్తేందుకు నిరాకరించినట్లు ఆ కథనం పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన జీ20 సదస్సుకు హాజరైన కెనడా.. భారత్ సహా మిత్రదేశాల అధినేతలతో కూడా అంటీముట్టనట్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జీ20 సదస్సు ముగిసిన వారం రోజుల తర్వాత భారత్పై ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేగాక, భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన నిజ్జర్ను.. తమ దేశ పౌరుడిగా ట్రూడో పేర్కొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..