భారత్-కెనడా ఢీ అంటే ఢీ
ఖలిస్థానీ అంశంపై కొంతకాలంగా భారత్, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు మంగళవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
ముదిరిన ఖలిస్థానీ చిచ్చు
దౌత్యవేత్తలపై పరస్పరం బహిష్కరణాస్త్రాలు
టొరంటో/ దిల్లీ: ఖలిస్థానీ అంశంపై కొంతకాలంగా భారత్, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు మంగళవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రెండు దేశాలూ పరస్పరం తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నాయి. దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి. నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఈ వివాదానికి కారణమయ్యాయి. ఇవి అసంబద్ధ విమర్శలని మన దేశం కొట్టిపారేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో దిల్లీలోని కెనడా హైకమిషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ (45).. భారత్లో ‘మోస్ట్ వాంటెడ్’ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. అతడి తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జూన్ 18న పశ్చిమ కెనడాలోని సర్రే నగరంలో ఒక గురుద్వారా వెలుపల ఇద్దరు దుండగులు అతడిని కాల్చి చంపారు. ఈ వ్యవహారంలో భారత ఏజెంట్ల హస్తం ఉందని ట్రూడో సోమవారం ఆరోపించారు. ‘‘కెనడా పౌరుడు నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని విశ్వసనీయ ఆరోపణలు వచ్చాయి. కొన్ని వారాలుగా మన భద్రతా సంస్థలు దీనిపై వివరాలను సేకరిస్తున్నాయి. ఈ ఘటనపై మన ఆందోళనలను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కెనడా భూభాగంలో జరిగిన ఈ హత్యలో విదేశీ ప్రభుత్వాల ప్రమేయం.. మన సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే. ఇది స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య సమాజాలు అనుసరించే ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. తీవ్రమైన ఈ అంశంపై మన మిత్రపక్షాలను సంప్రదిస్తున్నాం. ఈ ఘటనపై దర్యాప్తునకు భారత ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నా’’ అని ట్రూడో కెనడా పార్లమెంటు దిగువ సభలో పేర్కొన్నారు. అనంతరం కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ స్పందిస్తూ.. కెనడాలోని భారత దౌత్యకార్యాలయంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ విభాగం (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్- రా) అధిపతి పవన్ కుమార్ రాయ్ను బహిష్కరించినట్లు తెలిపారు. తాజా వివాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సహా పలు దేశాల నేతలతో ట్రూడో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది.
దీటుగా స్పందించిన భారత్..
ట్రూడో వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ‘‘కెనడాలో జరిగిన హత్యలో భారత ప్రమేయం ఉందంటూ ఆ దేశం అసంబద్ధ, ప్రేరేపిత విమర్శలు చేస్తోంది. గతంలో ప్రధాని మోదీ వద్ద కూడా ట్రూడో ఇలాంటి ఆరోపణలు చేశారు. వాటిని నాడే పూర్తిగా ఖండించాం. చట్టబద్ధ పాలన పట్ల పూర్తి నిబద్ధతను ప్రదర్శించే ప్రజాస్వామ్య విధానం మాది. కెనడాలో ఆశ్రయం పొందుతూ, భారత సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా మారిన ఖలిస్థానీ ఉగ్రవాదులు, అతివాదుల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మా డిమాండ్లపై కెనడా ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. పైగా ఆ దేశ రాజకీయ నేతలు వేర్పాటువాద శక్తులకు బహిరంగ మద్దతు ఇవ్వడం ఆందోళనకరం. కెనడా భూభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న భారత వ్యతిరేక శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
అనంతరం.. భారత్లోని కెనడా హైకమిషనర్ కామెరూన్ మెక్కేను దిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి మన అధికారులు పిలిపించారు. ఒక సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు ఆయనకు తెలియజేశారు. బహిష్కరణకు గురైన దౌత్యవేత్త ఎవరన్నది అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఆయన కెనడా ఇంటెలిజెన్స్ సంస్థ అధికారి ఒలీవియర్ సిల్వెస్టర్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన ఐదు రోజుల్లోగా దేశాన్ని వీడి వెళ్లిపోవాలని భారత్ స్పష్టం చేసింది. కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ను ‘ఉగ్రవాది’గా 2020 జులైలో భారత్ ప్రకటించింది. దేశంలోని అతడి ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జప్తుచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
-
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
-
ఓటర్ స్లిప్ చూపించు.. రూ.3 వేలు తీసుకో..!
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
-
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!