Canada: నిజ్జర్ కేసులో భారత్ సహకారంపై దృష్టి: కెనడా
నిజ్జర్ హత్యకేసులో భారత్పై ఒత్తిడి పెంచాలనే ప్రయత్నాలను కెనడా మానుకోలేదు. తాము ఇంకా భారత్ సహకారం కోసం ఎదురు చూస్తున్నామని తాజాగా మరోసారి వెల్లడించింది.
ఇంటర్నెట్డెస్క్: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసు దర్యాప్తులో భారత్ సహకారం కోసం కృషి చేస్తున్నట్లు కెనడా తెలిపింది. తాజాగా శాన్ ప్రాన్సిస్కోలో జరిగిన ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశంలో కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మేరి ఈ మేరకు వెల్లడించారు. ‘‘ మా దృష్టి దర్యాప్తుపైనే ఉంది. దానికి సంబంధించి పురోగతి ఉంది. ప్రస్తుతానికి దర్యాప్తు జరిగేలా చూడటంపైనే కెనడా దృష్టి పెట్టింది. కెనడా గడ్డపై కెనడా వాసి హత్యకు గురైతే దర్యప్తు ఎంత కీలకమో మా ప్రభుత్వం గతంలోనే పేర్కొంది. ఇప్పుడు అది సజావుగా జరిగేట్లు చూడటమే మా లక్ష్యం. దర్యాప్తు జరుగుతోంది’’ అని పేర్కొన్నారు.
ఇక భారత్లో పెట్టుబడులు, వ్యాపారంపై మేరి స్పందిస్తూ.. ‘‘కెనడా వాసులు భారత్లో వ్యాపారాలు కొనసాగిస్తారు. వాణిజ్య మంత్రిగా మా పౌరులు, సంస్థలు భారత్లో పెట్టే పెట్టుబడులు, వ్యాపారాలకు అవసరమైన సదుపాయాలు కల్పించేలా చేయడమే నా విధి’’ అని పేర్కొన్నారు.
బుధవారం భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తన యూకే పర్యటనలో భాగంగా మాట్లాడుతూ.. ఉగ్రవాది నిజ్జర్ హత్యకేసులో కెనడా ఇంత వరకు ఎటువంటి ఆధారాలను పంచుకోలేదని ప్రకటించారు. తాజాగా మరో సారి ఆయన స్పందిస్తూ.. తగిన ఆధారాలను కెనడా సమర్పిస్తే విచారణ జరిపేందుకు సిద్ధమేనని పునరుద్ఘాటించారు. బ్రిటన్లో ప్రధాని రిషి సునాక్తో ఆయన చర్చలు జరిపారు. అనంతరం లండన్ నుంచి బయల్దేరే ముందు విలేకరులతో మాట్లాడడంతో పాటు ‘రాయల్ ఓవర్సీస్ లీగ్’ వద్ద ముఖాముఖిలో పాల్గొన్నారు. తమపై ఆరోపణలు చేసిన కెనడా.. ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు. ‘‘భారత్ నుంచి ఖలిస్థాన్ విడిపోవడాన్ని ప్రోత్సహించేలా రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం కావడానికి కెనడా రాజకీయాలు ఆస్కారమిచ్చాయి. అలాంటి వ్యక్తులకు కెనడా రాజకీయాల్లో స్థానం కల్పించారు. వాక్ స్వాతంత్య్రానికి కొన్ని పరిమితులు, బాధ్యతలు ఉంటాయి. అవి దుర్వినియోగం అవుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం తప్పు. దానిపై బ్రిటన్ కూడా అప్రమత్తంగా ఉండాలి. కెనడాలో మా దౌత్యవేత్తల్ని బహిరంగంగా బెదిరించినవారిపై అక్కడి వర్గాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని ఆరోపించారు.
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. భారత్ దాదాపు 40 మంది కెనడా దౌత్యవేత్తలను వెనక్కి పంపించింది. మరోవైపు కెనడాలోని భారత దౌత్యవేత్తలకు తరచూ బెదిరింపులు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్