China: చైనా అత్యుత్సాహం.. ఫుట్బాల్ మ్యాచ్ ప్రసారాలపైనా ఆంక్షలు!
కరోనా కేసుల నియంత్రణ కోసం చైనా తీసుకుంటున్న నిర్ణయాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఫుట్బాల్ ప్రపంచకప్ మ్యాచ్ ప్రసారాలపై కూడా ఆంక్షలు విధించింది.
బీజింగ్: చైనాలో కరోనా కేసుల నియంత్రణ కోసం ఆ దేశ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖతార్ వేదికగా జరుగుతున్న ఫుట్బాల్ ప్రపంచకప్ మ్యాచ్ల ప్రసారాలపై ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా మ్యాచ్ ప్రసారాల్లో మాస్క్ ధరించని ప్రేక్షకుల ముఖాలను దగ్గరగా చూపించవద్దని ఆ దేశ బ్రాడ్కాస్టింగ్ సంస్థలను ఆదేశించింది.
ఆదివారం జరిగిన జపాన్-కోస్టారికా మ్యాచ్కు సంబంధించి మాస్క్ లేకుండా గ్యాలరీలో కేరింతలు కొడుతున్న ప్రేక్షకుల వీడియోలకు బదులు ఆటగాళ్లు, స్టేడియంలోని అధికారుల ఫొటోలను సీసీటీవీ స్పోర్ట్స్ ప్రసారం చేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. చైనా సోషల్ మీడియా యాప్లలో ప్రత్యక్ష ప్రసారమైన మ్యాచ్కు, టీవీ ఛానెళ్లలో ప్రసారమైన మ్యాచ్కు మధ్య వ్యత్యాసం ఉండంతో పలువురు యూజర్లు సైతం సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
గత నాలుగు రోజులుగా చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ కట్టడిలో భాగంగా చైనా ప్రభుత్వం ‘జీరో కొవిడ్’ విధానాన్ని అమలుచేస్తోంది. ఇందుకోసం లాక్డౌన్, క్వారంటైన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తోంది. వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు మూతపడటంతో ఆర్థికవ్యవస్థ ప్రమాదంలో పడుతుందనే ఆందోళన పెరిగింది. మరోవైపు ఆంక్షల నడుమ జీవనం సాగించాల్సి రావడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. దీంతో చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. తాజాగా ఫుట్బాల్ మ్యాచ్లో ప్రసారాలపై ఆంక్షలు విధించడం ఆ దేశంలో పరిస్థితులకు అద్దం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ