China-Taiwan: కొత్త అధ్యక్షుడి ప్రసంగం ఎఫెక్ట్.. తైవాన్కు చైనా ‘పనిష్మెంట్’..!
China-Taiwan: తైవాన్ ద్వీపాన్ని చైనా బలగాలు భారీగా చుట్టుముట్టాయి. నలువైపులా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు మొదలుపెట్టాయి.
బీజింగ్/తైపీ: తైవాన్ (Taiwan), చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ద్వీపంలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా (China) వ్యతిరేకిగా పేరొందిన లాయ్ చింగ్-తె విజయం సాధించిన సంగతి తెలిసిందే. గత సోమవారమే ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లాయ్ (new President Lai Ching-te).. తమను బెదిరించడం ఆపాలంటూ డ్రాగన్కు గట్టిగా చెప్పారు. దీంతో ఆగ్రహించిన బీజింగ్.. తైవాన్ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. ‘పనిష్మెంట్’ (Punishment Drills) పేరుతో వీటిని నిర్వహిస్తోంది.
గురువారం ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ఈ ద్వీపం చుట్టూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)కి చెందిన ఈస్ట్రన్ థియేటర్ కమాండ్ మిలిటరీ డ్రిల్స్ (Military Drills) ప్రారంభించిందని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ‘‘స్వాతంత్ర్యం కోసం తైవాన్ దళాల వేర్పాటువాద చర్యలకు శిక్షగానే మేం ఈ విన్యాసాలు చేపట్టాం. మా విషయంలో బయటి శక్తుల (అమెరికాను ఉద్దేశిస్తూ) జోక్యం, రెచ్చగొట్టే చర్యలకు ఇది మా హెచ్చరిక’’ అని ఈ కమాండ్ అధికార ప్రతినిధి లి షీ వెల్లడించారు.
బస్సుల వలే విమానాల్లో ఆ కుదుపులెందుకు..!
తైవాన్ జలసంధితో పాటు ఈ ద్వీపం మిగిలిన మూడు దిక్కుల్లో డ్రాగన్ రెండు రోజుల పాటు ఈ విన్యాసాలు కొనసాగించనుంది. ఆర్మీ, నేవీ, వాయుసేన, రాకెట్ దళాలు సంయుక్తంగా ఇందులో పాల్గొన్నాయి. లక్ష్యాలపై తమ దాడుల శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయి.
అలర్ట్ అయిన తైవాన్..
చైనా విన్యాసాల నేపథ్యంలో తైవాన్ అప్రమత్తమైంది. పరిస్థితులు తీవ్రంగా మారితే తక్షణమే ప్రతిస్పందించేందుకు వీలుగా యుద్ధ విమానాలను, క్షిపణులను సిద్ధంగా ఉంచింది. నేవీ, ఆర్మీ యూనిట్లను అలర్ట్ చేసింది. ఈ డ్రిల్స్ను తైవాన్ రక్షణ మంత్రి తీవ్రంగా ఖండించారు. ‘‘డ్రాగన్ అసంబద్ధ రెచ్చగొట్టే చర్యలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. మేం ఘర్షణలను కోరుకోవడం లేదు. కానీ ముప్పు ముంచుకొస్తే దేనికీ భయపడం’’ అని స్పష్టం చేశారు.
శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తున్న తైవాన్లో ఇటీవల నూతన అధ్యక్షుడు లాయ్ చింగ్-తె తన ప్రసంగంలో చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మమ్మల్ని భయపెట్టడం ఆపండి. సైన్యంతో రెచ్చగొట్టాలని చూడకండి. మా దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. తైవాన్ జలసంధిలో యథాతథ స్థితి ఉండేలా మేం కృషి చేస్తాం’’ అని అన్నారు. ఈ ద్వీపం తమ భూభాగమేనంటూ గత కొన్నేళ్లుగా వాదిస్తున్న డ్రాగన్కు ఈ వ్యాఖ్యలు మింగుడుపడలేదు. ఈ క్రమంలో ప్రతిచర్యకు దిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్ అవుతోన్న తరుణంలో కమలా హారిస్(Kamala Harris)కు భారీగా మద్దతు లభిస్తోంది. -
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. -
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్