the San Jose: 200 టన్నుల బంగారంతో నీట మునిగిన నౌక.. సముద్రగర్భంలో నిధి కోసం ముమ్మర వేట..!
దాదాపు 200 టన్నుల బంగారం, రత్నాలతో ప్రయాణిస్తున్న ఓ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఓవైపు ఆ సంపద కోసం న్యాయపోరాటం జరుగుతుండగానే.. ఆ నిధిని వెలికితీసేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: టన్నుల కొద్దీ బంగారం, రత్నాలతో స్పానిష్కు బయల్దేరిన ఓ నౌక దాదాపు 300 ఏళ్ల క్రితం శత్రు దాడిలో దెబ్బతిని సముద్రంలో మునిగిపోయింది. నాటినుంచి అత్యంత విలువైన ఆ నిధి సముద్రగర్భంలోనే నిక్షిప్తమై ఉంది. కొన్నేళ్ల కిందట దానిని గుర్తించినా.. వాటాల్లో తేడా వచ్చి ఎవరూ వెలికి తీయలేదు. తాజాగా దానిని దక్కించుకొనేందుకు ఓ దేశం వేగంగా పావులు కదుపుతుండటం వార్తల్లో నిలిచింది.
కరేబియన్ సముద్రంలో మునిగిన శాన్జోస్ అనే పురాతన నౌకను తాము పరిశోధించడం మొదలుపెడతామని కొలంబియా ఇటీవల ప్రకటించింది. ఈ ప్రకటనతో అమెరికా, స్పెయిన్, పెరూ సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందుకో కారణం ఉంది. 1708వ సంవత్సరంలో స్పెయిన్కు చెందిన నౌక పెరూలోని దాదాపు 200 టన్నుల బంగారం, వెండి, రత్నాలను తీసుకొని కొలంబియాకు బయల్దేరింది. తూర్పున ఉన్న కరీబియన్ తీర నుంచి ప్రయాణం మొదలు పెట్టిన ఈ నౌకపై శత్రువులు దాడి చేయడంతో 600 మంది సిబ్బందిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఆ సంపద మొత్తం నాటినుంచి సముద్రగర్భంలో 600 మీటర్ల లోతున నౌక శిథిలాల కిందే ఉండిపోయింది. దీనికి ఉన్న దాదాపు 64 భారీ రాగి తుపాకులు కూడా అక్కడే పడిపోయి ఉన్నాయి. ఆ సమయంలో ఈ నౌకతో పాటు బంగారంతో ఉన్న మరో నౌక దాడి నుంచి తప్పించుకొంది.
తాజాగా కొలంబియా ప్రభుత్వం ఈ నిధి నిక్షిప్తమై ఉన్న ఓడపై పరిశోధన చేపట్టినట్లు ఇటీవల ప్రకటించింది. దీనిలోభాగంగా ది కొలంబియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ (ఐసీఏఎన్హెచ్) సంస్థ ప్రత్యేకమైన రిమోట్ సెన్సర్లను వాడి నౌకను ఫొటోగ్రఫీ చేయనుంది. దీని ఆధారంగా తర్వాత శోధన కొనసాగుతుందని పేర్కొంది. అనంతరం ఈ నౌక నుంచి పురాతన వస్తువులు, సంపదను వెలికితీస్తాయన్నారు. ఇక ఈ నౌక మునిగిపోయిన ప్రదేశాన్ని ఇప్పటికే ఐసీఏఎన్హెచ్ రక్షిత పురాతత్వ ప్రదేశంగా ప్రకటించింది.
అసలు ఈ సంపదపై హక్కులు ఎవరివీ..
1981లో అమెరికాకు చెందిన సముద్ర గర్భాన్వేషణ సంస్థ సీసెర్చి ఆర్మడా(ఎస్ఎస్ఏ) ఈ నౌక శకలాలు కనుగొన్నట్లు ప్రకటించింది. కొలంబియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైంది. ఆ దేశ పార్లమెంట్ ఈ నిధిపై పూర్తి హక్కును ప్రకటించింది. కేవలం 5శాతం ఫీజు కింద ఎస్ఎస్ఏ సంస్థకు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ఆ సంస్థ అమెరికా కోర్టులో కేసు వేయగా.. రెండుసార్లు ఆ సంపదపై కొలంబియాదే హక్కు అని తేల్చిచెప్పింది.
ఆ తర్వాత 2015లో తాము శాన్జోస్ నౌక శకలాలను స్వయంగా కనుగొన్నామని కొలంబియా ప్రకటించింది. భారీ రాగి తుపాకులు వంటి పరికరాలు అక్కడ ఉన్నట్లు పేర్కొంది. ఇందుకోసం బ్రిటిష్, అమెరికా కంపెనీల సాయం తీసుకొన్నట్లు వెల్లడించింది. దీంతో ఎస్ఎస్ఏ సంస్థ పర్మినెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో 10 బిలియన్ డాలర్లకు కొలంబియాపై కేసు వేసింది. మరోవైపు స్పెయిన్, పెరూ ప్రభుత్వాలు కూడా ఆ నౌకపై యాజమాన్య హక్కులు తమవే అని చెబుతున్నాయి. కానీ, ఈ నౌక మునిగిపోయిన ప్రాంతాన్ని కొలంబియా, ఎస్ఎస్ఏ కంపెనీ ఇప్పటివరకు అత్యంత గోప్యంగా ఉంచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. -
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన