Darien Gap: అక్కడ అత్యాచారాలు నిత్యకృత్యం.. శరణార్థులపై దారికాచి అఘాయిత్యాలు!
కొలంబియా, పనామాకు మధ్యలో అటవీ ప్రాంతం ఉంటుంది. దీన్నే డేరియన్ గ్యాప్ అంటారు. ఈ దారిలో డ్రగ్స్ ముఠాలు మహిళలపై పడి అత్యాచారాలకు పాల్పడుతుంటాయి.
Darien Gap | ఇంటర్నెట్ డెస్క్: చుట్టూ అడవి.. ఒక వందమంది వరకు ఉంటారు.. అందరి కళ్లలో దైన్యం.. ఆకలి తీర్చుకోవడం కోసం పుట్టిన గడ్డను వదిలి అమెరికాలో ఏదైనా ఉపాధి దొరుకుతుందన్న ఆశతో అన్నింటికీ తెగించి అక్రమ మార్గాల్లో వెళ్లేందుకు నడుస్తున్నారు. వీరిలో మహిళలుంటే అత్యంత తీవ్రమైన సమస్య పొంచి ఉంటుంది. దారిలో డ్రగ్స్ ముఠాలు వీరిపై పడి అత్యాచారాలకు పాల్పడుతుంటాయి. వీరిని ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండదు. ఎదిరిస్తే ప్రాణాలు తీసేస్తారు. అందుకనే మానవ రవాణా స్మగ్లర్ల సూచన మేరకు ప్రతి మహిళ కచ్చితంగా గర్భ నిరోధకాలను వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. కనీసం గర్భం దాల్చకుండా ఉంటామన్న ఆశ. అలాంటి దుర్భర పరిస్థితుల్లో మహిళలు భీతావహమైన దారిలో ప్రయాణం సాగిస్తుంటారు.
ఎక్కడ ఉందీ దారి..?
కొలంబియా, పనామాకు మధ్యలో అటవీ ప్రాంతం ఉంటుంది. దీన్నే డేరియన్ గ్యాప్ (Darien Gap) అంటారు. కొలంబియాలో ఈ ప్రాంతం మాదక ద్రవ్యాల ముఠాల అధీనంలో ఉంటుంది. మనిషికి ఇంత అని డబ్బు తీసుకొని ఇక్కడికి పంపిస్తారు. కేవలం డేరియన్లోనే కాదు అమెరికా సరిహద్దు దేశమైన మెక్సికోకు చేరుకునే వరకు మహిళలకు ఎటువంటి రక్షణ ఉండదు. వీరిని తీసుకువెళ్లే గైడ్లు.. మహిళల సంచుల్లో కండోమ్ ప్యాకెట్లు ఉంచుతారు. రౌడీమూకలు అడ్డగిస్తే ఏ మాత్రం ప్రతిఘటించకుండా లొంగిపొమ్మని కోరతారు.
బోర్గ్ డ్రింకింగ్.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్!
అమెరికాకు అక్రమంగా చేరుకోవాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. కొలంబియా, పనామా, కోస్తారికా, నికరాగువా, హోండురాస్, గ్వాటిమెలా, మెక్సికోలు దాటాలి. మాన, ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. ప్రత్యేకించి దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికా దేశాలకు చెందిన వేలాదిమంది ఇలాంటి మార్గాల్లో ప్రయాణిస్తుంటారు. మార్గమధ్యంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ దారిలో (Darien Gap) అనేక నదులు, అరణ్యాలు, ఎడారులు ఉంటాయి.
ఎలాగోలా చేరినా దొరికిపోతారు..
ఇలా మెరుగైన జీవితం కోసం నిత్యం వేలాదిమంది అభాగ్యులు సవాళ్లను ఎదుర్కొంటూ పయనం సాగిస్తుంటారు. తీరా మెక్సికో దాటినా అక్కడ అమెరికా దళాలు పట్టుకొని తిరిగి వారి స్వదేశాలకు పంపుతుంటాయి. సొంత దేశాల్లో అవినీతిమయమైన ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల ముఠాలతో నిత్యం చస్తూ బతుకుతూ హమ్మయ్య అని అమెరికా చేరుకున్నా.. కథ మొదటికి వస్తుండటం గమనార్హం. కొందరికి మాత్రం శరణార్థుల కింద అమెరికా ఆశ్రయం కల్పిస్తుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం