Canada: వియన్నా ఒప్పందాన్ని గౌరవించాలి.. కెనడాకు స్పష్టం చేసిన భారత్!
సరిహద్దుల్లో మయన్మార్వాసుల కదలికలు ఆందోళనకరమని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఆందోళన వ్యక్తం చేశారు.
దిల్లీ: దౌత్యసంబంధాలకు ఉద్దేశించిన వియన్నా ఒప్పందాన్ని (Vienna Convention) కెనడా (Canada) గౌరవించాలని భారత్ పునరుద్ఘాటించింది. ఇటీవల కెనడాలోని వాంకోవర్లో నిర్వహించిన ఓ కాన్సులర్ క్యాంప్ (Consular Camp)నకు ఆటంకం కలిగించేందుకు కొన్ని శక్తులు యత్నించాయని, అయినప్పటికీ.. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు విదేశాంగ శాఖ (MEA) తెలిపింది. ఈ క్రమంలోనే మయన్మార్ (Myanmar) నుంచి భారత్లోకి అక్రమ వలసలు, సరిహద్దు సమీపంలో హింసాత్మక ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘భారత్ వైపు మయన్మార్ జాతీయుల కదలికలు కనిపిస్తున్నాయి. దేశ సరిహద్దుకు సమీపంలో ఇటువంటి ఘటనలు ఆందోళనకరం. మయన్మార్ అధికారులు స్థానికంగా చర్చలు జరిపి.. ఈ హింసాత్మక ఘటనలకు తెరదించాలి’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ సూచించారు.
ఇటీవల కెనడాలోని బ్రాంప్టన్లో దీపావళి పండగ రోజు చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై స్పందిస్తూ.. రెండు వర్గాల మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నామన్నారు. ఈ విషయమై కెనడాలోని భారత కాన్సులేట్కు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం కారణంగా గాజాలోని అల్-షిఫా ఆస్పత్రి వద్ద ఏర్పడిన దయనీయ పరిస్థితులపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మానవతా సాయం అవసరాన్ని భారత్ ఇప్పటికే స్పష్టంగా చాటిచెప్పిందన్నారు. ఉగ్రదాడులను ఖండించడంతోపాటు ఉద్రిక్తతలకు తెరదించాలని పిలుపునిచ్చామన్నారు. అదే విధంగా మానవతా సాయాన్ని కూడా అందించినట్లు గుర్తుచేశారు.
అల్-షిఫా ఆస్పత్రి MRI యూనిట్లో.. హమాస్ ఆయుధాలు..!
వర్చువల్ వేదికగా శుక్రవారం నుంచి ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 2023’ నిర్వహించనున్నట్లు అరిందమ్ బాగ్చీ తెలిపారు. ప్రపంచ పరిణామాల వల్ల ఎదురవుతున్న సవాళ్లనూ ఈ సందర్భంగా చర్చిస్తామన్నారు. ఇదిలా ఉండగా.. మయన్మార్లో కొంతకాలంగా తరచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అక్కడి ప్రజలు పొరుగున ఉన్న మిజోరంలోకి అక్రమంగా ప్రవేశించి తలదాచుకుంటున్నారు. ఈ పరిణామాలపై భారత్ తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. మయన్మార్- భారత్ సరిహద్దు భద్రతను పర్యవేక్షిస్తున్న ‘అస్సాం రైఫిల్స్’ ఈ వ్యవహారంపై ఇప్పటికే అప్రమత్తమైంది. మయన్మార్ నుంచి వచ్చి మిజోరంలోని వివిధ జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్న వారి సంఖ్య 32 వేలకు పైగా ఉండొచ్చని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.