Canada: వియన్నా ఒప్పందాన్ని గౌరవించాలి.. కెనడాకు స్పష్టం చేసిన భారత్!
సరిహద్దుల్లో మయన్మార్వాసుల కదలికలు ఆందోళనకరమని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఆందోళన వ్యక్తం చేశారు.
దిల్లీ: దౌత్యసంబంధాలకు ఉద్దేశించిన వియన్నా ఒప్పందాన్ని (Vienna Convention) కెనడా (Canada) గౌరవించాలని భారత్ పునరుద్ఘాటించింది. ఇటీవల కెనడాలోని వాంకోవర్లో నిర్వహించిన ఓ కాన్సులర్ క్యాంప్ (Consular Camp)నకు ఆటంకం కలిగించేందుకు కొన్ని శక్తులు యత్నించాయని, అయినప్పటికీ.. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు విదేశాంగ శాఖ (MEA) తెలిపింది. ఈ క్రమంలోనే మయన్మార్ (Myanmar) నుంచి భారత్లోకి అక్రమ వలసలు, సరిహద్దు సమీపంలో హింసాత్మక ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘భారత్ వైపు మయన్మార్ జాతీయుల కదలికలు కనిపిస్తున్నాయి. దేశ సరిహద్దుకు సమీపంలో ఇటువంటి ఘటనలు ఆందోళనకరం. మయన్మార్ అధికారులు స్థానికంగా చర్చలు జరిపి.. ఈ హింసాత్మక ఘటనలకు తెరదించాలి’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ సూచించారు.
ఇటీవల కెనడాలోని బ్రాంప్టన్లో దీపావళి పండగ రోజు చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై స్పందిస్తూ.. రెండు వర్గాల మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నామన్నారు. ఈ విషయమై కెనడాలోని భారత కాన్సులేట్కు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం కారణంగా గాజాలోని అల్-షిఫా ఆస్పత్రి వద్ద ఏర్పడిన దయనీయ పరిస్థితులపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మానవతా సాయం అవసరాన్ని భారత్ ఇప్పటికే స్పష్టంగా చాటిచెప్పిందన్నారు. ఉగ్రదాడులను ఖండించడంతోపాటు ఉద్రిక్తతలకు తెరదించాలని పిలుపునిచ్చామన్నారు. అదే విధంగా మానవతా సాయాన్ని కూడా అందించినట్లు గుర్తుచేశారు.
అల్-షిఫా ఆస్పత్రి MRI యూనిట్లో.. హమాస్ ఆయుధాలు..!
వర్చువల్ వేదికగా శుక్రవారం నుంచి ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 2023’ నిర్వహించనున్నట్లు అరిందమ్ బాగ్చీ తెలిపారు. ప్రపంచ పరిణామాల వల్ల ఎదురవుతున్న సవాళ్లనూ ఈ సందర్భంగా చర్చిస్తామన్నారు. ఇదిలా ఉండగా.. మయన్మార్లో కొంతకాలంగా తరచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అక్కడి ప్రజలు పొరుగున ఉన్న మిజోరంలోకి అక్రమంగా ప్రవేశించి తలదాచుకుంటున్నారు. ఈ పరిణామాలపై భారత్ తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. మయన్మార్- భారత్ సరిహద్దు భద్రతను పర్యవేక్షిస్తున్న ‘అస్సాం రైఫిల్స్’ ఈ వ్యవహారంపై ఇప్పటికే అప్రమత్తమైంది. మయన్మార్ నుంచి వచ్చి మిజోరంలోని వివిధ జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్న వారి సంఖ్య 32 వేలకు పైగా ఉండొచ్చని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ