Israel-Hamas: అల్-షిఫా ఆస్పత్రి MRI యూనిట్లో.. హమాస్ ఆయుధాలు..!
Israel-Hamas: అల్-షిఫా ఆస్పత్రిలోని ఎంఆర్ఐ యూనిట్లో భారీగా ఆయుధాలు బయటపడ్డాయి. ఈ ఆస్పత్రిని హమాస్ తమ కమాండ్ సెంటర్గా వాడుకుంటోందని చెబుతున్న ఇజ్రాయెల్ అందుకు సంబంధించిన సాక్ష్యాలను విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: గాజా (Gaza)లోని ఆల్-షిఫా ఆస్పత్రి (Al-Shifa Hospital)లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ (Israel) దళాలు.. అక్కడ హమాస్ ముష్కరుల కోసం ముమ్మరంగా వేట సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టింది. ఇక్కడ హమాస్ కమాండ్ సెంటర్ ఉన్నట్లు చెబుతున్న ఐడీఎఫ్ (IDF).. దాన్ని బలపర్చే సాక్ష్యాలను తాజాగా బయటపెట్టింది. ఆల్-షిఫా ఆస్పత్రిలోని ఎంఆర్ఐ భవనంలో పెద్ద ఎత్తున ఆయుధాలు బయటపడ్డాయి. అందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
ఆ వీడియోలో ఆస్పత్రిలోని ఎంఆర్ఐ యూనిట్లో దాచి ఉంచిన హమాస్ ఆయుధాలను ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి జొనాథన్ కాన్రికస్ స్వయంగా చూపించారు. ‘‘అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి గాజాలోని ఆస్పత్రులను హమాస్ తమ నేర కార్యకలాపాలకు వినియోగించుకుంటోంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అని జొనాథన్ అందులో పేర్కొన్నారు. ఎంఆర్ఐ గదిలో హమాస్కు చెందిన పలు బ్యాగులు కన్పించాయి. అందులో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయి. ఏకే-47, గ్రనేడ్ల వంటి వాటిని అక్కడ భద్రపర్చినట్లుగా తెలుస్తోంది.
గాజాలో బందీల విడుదలపై కొనసాగుతున్న సందిగ్ధం
ఆస్పత్రి వద్ద బుల్డోజర్లు..
అల్-షిఫా ఆస్పత్రిలో ఆయుధాలు బయటపడగానే ఇజ్రాయెల్ తమ ఆపరేషన్ను మరింత తీవ్రంగా చేసింది. ఈ ఆస్పత్రి కింద హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని చెబుతున్న ఇజ్రాయెల్.. ఆ టన్నెల్ నెట్వర్క్ను ఛేదించేందుకు ఇక్కడ భారీగా సోదాలు నిర్వహిస్తోంది. నిఘా వర్గాల సాయంతో టన్నెల్ ప్రవేశ మార్గాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కాగా.. ఈ ఆస్పత్రిని కూల్చేయాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అల్-షిఫా చుట్టపక్కన బుల్డోజర్లను మోహరించినట్లు తెలిపింది.
మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ పోరుతో ఆస్పత్రి వద్ద భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వైద్యశాలలో నీరు, విద్యుత్, ఔషధాల సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఐసీయూలో చికిత్స పొందుతున్న నవజాత శిశువుల పరిస్థితి దారుణంగా ఉంది. అయితే, ఆస్పత్రిలో రోగులకు అవసరమైన ఔషధాలను తాము సరఫరా చేస్తున్నామని ఐడీఎఫ్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రణరంగంగా తైవాన్ పార్లమెంటు
ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. -
సింగపూర్లో మళ్లీ కొవిడ్ అలజడి
కొవిడ్-19 మహమ్మారి సింగపూర్లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (4)
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. -
కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు
కిర్గిజ్స్థాన్లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిష్కెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.