Katchatheevu: కచ్చతీవు వ్యవహారం.. శ్రీలంక స్పందన ఏంటంటే!
కచ్చతీవు దీవి వ్యవహారంపై శ్రీలంక స్పందించింది. ఈ విషయం తమవద్ద చర్చకే రాలేదని మంత్రి బందుల గుణవర్ధెన మీడియాకు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ భారత్లో కచ్చతీవు (Katchatheevu) ద్వీపం వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఐదు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంక (Sri Lanka)కు ఇచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై శ్రీలంక స్పందించింది. ఈ వ్యవహారం తమవద్ద చర్చకే రాలేదని సమాచారశాఖ మంత్రి బందుల గుణవర్ధెన మీడియాకు వెల్లడించారు. ‘‘కచ్చతీవు సమస్యను శ్రీలంక మంత్రివర్గం ఇప్పటివరకు చర్చించలేదు. అసలు ఈ అంశాన్ని ఎవరూ లేవనెత్తలేదు’’ అని చెప్పడం గమనార్హం.
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్- శ్రీలంక మధ్య ఉన్న చిరుద్వీపమే కచ్చతీవు. ఇది తమిళనాడులోని రామేశ్వరానికి 19 కిలోమీటర్లు, శ్రీలంకలోని జాఫ్నాకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1974-76 మధ్య భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండారునాయకెల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ దీవిపై న్యూదిల్లీ హక్కులను వదులుకొంది. దీనిపై ఓ కథనాన్ని ఉటంకించిన ప్రధాని మోదీ.. దేశ సమగ్రత, ప్రయోజనాలను బలహీనపర్చేలా కాంగ్రెస్ 75 ఏళ్లు పనిచేసిందని విమర్శించారు. నాటి ప్రధానులు భారత భూభాగంపై ఉదాసీనత ప్రదర్శించారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు.
అవాస్తవాలతో వివాదానికి ఆస్కారం: చిదంబరం
కచ్చతీవుపై 50 ఏళ్ల తర్వాత అవాస్తవమైన, ఘర్షణపూరిత ప్రకటనలు.. శ్రీలంక ప్రభుత్వానికి, అక్కడున్న 35 లక్షల మంది తమిళులకు మధ్య వివాదానికి కారణమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం హెచ్చరించారు. ‘‘ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతీసేలా జైశంకర్ తదితరులు మాట్లాడే ముందు.. ఆ దేశంలో 35 లక్షల మంది శ్రీలంక, భారతీయ తమిళులు నివసిస్తున్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. కేంద్రం తన దూకుడు ధోరణిని చైనాపై ప్రదర్శించాలి. రెండువేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. ప్రాంతాల పేర్లు మారుస్తున్న డ్రాగన్ చర్యలపై విదేశాంగ మంత్రి ఎందుకు స్పందించరు?’’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!