DNA: 40 ఏళ్ల కిందటి కేసు.. ‘చూయింగ్ గమ్’తో దొరికిపోయి!
నాలుగు దశాబ్దాల కిందటి ఓ హత్య కేసుకు సంబంధించి చూయింగ్ గమ్లోని డీఎన్ఏ ఆనవాళ్లు నిందితుడిని పట్టించాయి.
ఇంటర్నెట్ డెస్క్: నాలుగు దశాబ్దాల కిందటి ఓ హత్య కేసులో మిస్టరీ ఎట్టకేలకు వీడింది. చూయింగ్ గమ్లోని డీఎన్ఏ ఆనవాళ్లు నిందితుడిని పట్టించడం గమనార్హం. దీంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న 60 ఏళ్ల వృద్ధుడు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
ఓరెగాన్లోని మౌంట్ హూడీ కమ్యూనిటీ కాలేజీలో బార్బారా టక్కర్ (19) విద్యార్థిని. జనవరి 15, 1980న ఆమె అపహరణకు గురయ్యారు. మరుసటి రోజు కాలేజీకి వచ్చిన విద్యార్థులు.. క్యాంపస్ పార్కింగ్ సమీపంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు.. లైంగిక దాడి అనంతరం అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. రాబర్ట్ ప్లింప్టన్ ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానించిన దర్యాప్తు అధికారులు అతడిపై పలు అభియోగాలు మోపారు. అయితే, సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసు మరుగున పడిపోయింది.
మాస్కోలో మారణహోమం.. పుతిన్ హెచ్చరిక!
2000లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాధితురాలి శవపరీక్ష నాటి నమూనాలను ఒరెగాన్ స్టేట్ పోలీస్ (OSP) క్రైమ్ ల్యాబ్కు పంపించారు. అక్కడ వారు విశ్లేషించి.. డీఎన్ఏ ప్రొఫైల్ను రూపొందించారు. అనంతరం రాబర్ట్పైనా నిఘా కొనసాగించారు. ఈ క్రమంలో ఓసారి అతడు (2021లో) చూయింగ్ గమ్ నమలడాన్ని చూసిన పోలీసులు.. దాన్ని సేకరించి ఓఎస్పీ ల్యాబ్కు పంపించారు. అది 2000లో రూపొందించిన డీఎన్ఏ ప్రొఫైల్తో సరిపోలినట్లు గుర్తించారు.
జూన్ 8, 2021లో ప్లింప్టన్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. అతడిని దోషిగా తేల్చింది. అతడు మాత్రం తాను నేరం చేయలేదని వాదించాడు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లనున్నట్లు అతడి తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో తుది తీర్పు జూన్లో వెలువడే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం