Health: మొటిమల క్రీం వాడే ముందు.. ఈ జాగ్రత్త తప్పనిసరి!
మొటిమల చికిత్సలో వాడే క్రీమ్ను రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలో ఉంచడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల వీటిపై విభిన్నమైన కథనాలు రావడంతో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇంటర్నెట్డెస్క్: టీనేజ్, యువతలో సర్వసాధారణంగా మొటిమల సమస్యను చూస్తూనే ఉంటాము. వాటిని ఎదుర్కోవడానికి రకరకాల క్రీమ్లు వినియోగిస్తుంటారు. వీటిల్లో ముఖ్యంగా బెంజయిల్ పెరాక్సైడ్ మిశ్రమాలను వాడుతుంటారు. వీటి వినియోగంలో చిన్న జాగ్రత్తలు తీసుకొంటే క్యాన్సర్ ముప్పును తప్పించుకోవచ్చని ది అమెరికన్ యాక్నే అండ్ రొసేసియా సొసైటీ (ఏఏఆర్ఎస్) పేర్కొంది. ‘‘మొటిమలు, ఇతర చర్మ సమస్యలతో బాధపడే చాలా మంది పేషెంట్లకు చికిత్సలో బెంజయిల్ పెరాక్సైడ్ కీలకం’’ అని వివరించింది. ఈ సొసైటీలో మొత్తం 6,000 మంది సభ్యులున్నారు. బెంజయిల్ పెరాక్సైడ్ మిశ్రమంతో ఉన్న క్రీములు, జెల్స్, వాష్లను ఫ్రిజ్లలో ఉంచాలని సూచించింది. అప్పుడు శరీరం బెంజీన్ బారినపడే అవకాశం తగ్గుతుందని వెల్లడించింది.
బెంజయిల్ పెరాక్సైడ్ అధికమోతాదులో ఉండటంతో మొటిమల చికిత్స క్రీమ్లు ఇతర ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని ప్రముఖ ల్యాబ్ వాలీష్యూర్ అమెరికా ఎఫ్డీఏ వద్ద పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని బ్లూమ్బెర్గ్ కథనంలో వెల్లడించింది. చాలా ప్రముఖ కంపెనీల క్రీముల్లో బెంజీన్ అధికంగా ఉన్నట్లు తాము గుర్తించామని వాలీష్యూర్ వెల్లడించింది.
ఈ ఫలితాలు నిర్ఘాంతపరిచినట్టు ఏఏఆర్ఎస్ అధ్యక్షుడు జేమ్స్ డెల్ రోస్సో పేర్కొన్నారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా బెంజయిల్ పెరాక్సైడ్ను చికిత్సల్లో వాడుతున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఎఫ్డీఏ కూడా దీనిపై స్పందిస్తూ.. వాలీష్యూర్ సంస్థ ఫలితాలను మరింత లోతుగా విశ్లేషిస్తామని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
భారీగా కురిసిన వర్షాలతో అఫ్గానిస్థాన్(Afghanistan) అల్లాడిపోతోంది. దాంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
జెలెన్స్కీ(Volodymyr Zelenskyy) హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ క్రమంలో అత్యంత ప్రముఖులకు భద్రత కల్పించే స్టేట్ గార్డ్ విభాగాధిపతిని పదవి నుంచి తప్పించింది. -
నదిలో పడిన బస్సు.. డ్రైవర్తో ఓవర్ టైమ్ చేయించడమే ప్రమాదానికి కారణం..!
ఓ డ్రైవర్తో ట్రాన్స్పోర్టు సంస్థ ఓవర్ టైమ్ చేయించింది. అలిసిపోయిన డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయాడు. ఫలితంగా నేరుగా 20 మంది ప్రయాణికులతో అది ఓ నదిలో పడిపోయింది. -
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!