Earthquake: అఫ్గాన్‌లో భూకంపం.. దిల్లీలోనూ ప్రకంపనలు

Eenadu icon
By International News Team Updated : 19 Apr 2025 13:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌- తజికిస్థాన్‌ సరిహద్దుల్లో శనివారం మధ్యాహ్నం భూకంపం (Earthquake) సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.8గా నమోదైంది. 86 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 

మరోవైపు.. భూకంపం కారణంగా దిల్లీ, జమ్మూకశ్మీర్‌తో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయిన ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. 

Tags :
Published : 19 Apr 2025 13:07 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు